అన్వేషించండి

Chandrababu Case : మద్యం కేసులో చంద్రబాబు, కొల్లు రవీంద్రలకు ఊరట - హైకోర్టు కీలక ఆదేశాలు

Chandrababu Case : మద్యం కేసులో చంద్రబాబు, కొల్లు రవీంద్రలపై తీర్పు వచ్చే వరకూ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. తీర్పు రిజర్వ్ చేసింది.


Chandrababu Case :  గత ప్రభుత్వంలో మద్యం ప్రివిలేజ్ ఫీజును  అక్రమంగా మాఫీ చేసి  ప్రభుత్వానికి నష్టం కలిగించారంటూ సీఐడీ నమోదు చేసిన కేసులో చంద్రబాబు, కొల్లు రవీంద్రలపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది.  తప్పుడు కేసు పెట్టారని విధానపరమైన నిర్ణయం తీసుకుంటే.. దానిపై కేసు పెట్టారని ఈ కేసులో  ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని వీరు హైకోర్టును ఆశ్రయించారు.  ఈ పిటిషన్లపై విచారణ పూర్తయింది.  లిఖిత పూర్వక వాదనలు కూడా సమర్పించారు. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు .. తీర్పు వెల్లడించే వరకూ ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది.

విధానపరమైన నిర్ణయంపై కేసులు పెట్టడం ఏమిటని  చంద్రబాబాబు తరపు లాయర్ల వాదన 

ఇంతకు ముందు జరిగిన విచారణలో  చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాదులు నాగముత్తు, దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. మద్యం దుకాణాల లైసెన్స్‌దారులకు 2015-17 సంవత్సరాల్లో ప్రివిలేజ్‌ ఫీజు విధింపు నిబంధన తొలగింపునకు ప్రతిపాదించిన ఫైలు అప్పటి సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అప్పటి ఎక్సైజ్‌ శాఖ మంత్రి, కమిషనర్‌ స్థాయిలో నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఫైలును ఆర్థిక శాఖకు పంపకపోవడాన్ని సీఐడీ ఆక్షేపించడం సరికాదని, ఈ విషయంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. అందుకు అప్పటి సీఎం, మంత్రిని బాధ్యులను చేయడం సరికాదన్నారు. పిటిషనర్‌పై దురుద్దేశపూర్వకంగా కేసు నమోదు చేశారని, ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు.

ఖజానాకు నష్టం కలిగించారని ప్రభుత్వం తరపు లాయర్ వాదనలు                                  

సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్‌ వాదనలు వినిపించారు.  గత ప్రభుత్వ హయాంలో మద్యం దుకాణాల లైసెన్స్‌దారులకు ప్రివిలేజ్‌ ఫీజు తొలగించడం ద్వారా రాష్ట్ర ఖజానాకు నష్టం జరిగిందన్నారు. వివిధ ఫైళ్లను   కోర్టు ముందు ఉంచారు. వాటిని తమకు అందజేయలేదని చంద్రబాబు తరఫు సీనియర్‌ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. న్యాయమూర్తి స్పందిస్తూ వాటిని పిటిషనర్లకు ఇవ్వాలని ఏజీకి సూచించారు.  విచారణలో ఇరువైపులా వాదనలు ముగించిన న్యాయస్థానం.. మౌఖికంగా తెలిపిన వివరాలను రాతపూర్వకంగా కోర్టు ముందుంచాలని పిటిషనర్లకు సూచిస్తూ విచారణను  సోమవారానికి వాయిదా వేశారు.

తీర్పు ఇచ్చే వరకూ చర్యలు తీసుకోవద్దని  హైకోర్టు ఆదేశం                                     

సోమవారం తీర్పును రిజర్వు చేస్తూ తొందరపాటు చర్యలు వద్దని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. గత ప్రభుత్వ హయాంలో మద్యం కంపెనీలకు అనుచిత లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలతో బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డి ఫిర్యాదు ఆధారంగా చంద్రబాబు, కొల్లు రవీంద్ర, ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌పై సీఐడీ కేసు నమోదు చేశారు. జీవోలు ఇచ్చిన వారిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Inter Exams: ఏపీ ఇంటర్ ఎగ్జామ్ పేపర్లు, పాస్ మార్కులలో కీలక మార్పులు..
ఏపీ ఇంటర్ ఎగ్జామ్ పేపర్లు, పాస్ మార్కులలో కీలక మార్పులు..
Chandrababu UAE Tour Schedule: నేడు యూఏఈకి సీఎం చంద్రబాబు.. విశాఖ సమ్మిట్‌కు పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానాలు
నేడు యూఏఈకి సీఎం చంద్రబాబు.. విశాఖ సమ్మిట్‌కు పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానాలు
శ్రీశైలం కార్తీక మాసోత్సవాలు: స్పర్శ దర్శనం, ప్రత్యేక మార్పుల గురించి మల్లన్న భక్తులకు ముఖ్య సూచనలు!
శ్రీశైలం కార్తీక మాసోత్సవాలు: స్పర్శ దర్శనం, ప్రత్యేక మార్పుల గురించి మల్లన్న భక్తులకు ముఖ్య సూచనలు!
Stock Market Holiday: నేడు స్టాక్ మార్కెట్ ఓపెన్ ఉంటుందా.. లేక హాలిడే ఇచ్చారా? ఈరోజు ఎందుకంత స్పెషల్
నేడు స్టాక్ మార్కెట్ ఓపెన్ ఉంటుందా.. లేక హాలిడే ఇచ్చారా? ఈరోజు ఎందుకంత స్పెషల్
Advertisement

వీడియోలు

6 Ball Over Behind Story | 6 బాల్ ఓవర్ కోసం ఇంగ్లండ్-ఆసీస్ మధ్య దశాబ్దాల ఫైట్‌ జరిగిందా? | ABP Desam
గంభీర్-గిల్ వల్లే అంతా! ఇలా అయితే సిరీస్ కూడా కష్టమే!
స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్ సింగ్.. ఇద్దరికీ ఎంత తేడా?
ఇండియా మ్యాచ్.. రూ.60కే టికెట్
గంభీర్ వల్లే టీమిండియా ఓడింది: అశ్విన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Inter Exams: ఏపీ ఇంటర్ ఎగ్జామ్ పేపర్లు, పాస్ మార్కులలో కీలక మార్పులు..
ఏపీ ఇంటర్ ఎగ్జామ్ పేపర్లు, పాస్ మార్కులలో కీలక మార్పులు..
Chandrababu UAE Tour Schedule: నేడు యూఏఈకి సీఎం చంద్రబాబు.. విశాఖ సమ్మిట్‌కు పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానాలు
నేడు యూఏఈకి సీఎం చంద్రబాబు.. విశాఖ సమ్మిట్‌కు పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానాలు
శ్రీశైలం కార్తీక మాసోత్సవాలు: స్పర్శ దర్శనం, ప్రత్యేక మార్పుల గురించి మల్లన్న భక్తులకు ముఖ్య సూచనలు!
శ్రీశైలం కార్తీక మాసోత్సవాలు: స్పర్శ దర్శనం, ప్రత్యేక మార్పుల గురించి మల్లన్న భక్తులకు ముఖ్య సూచనలు!
Stock Market Holiday: నేడు స్టాక్ మార్కెట్ ఓపెన్ ఉంటుందా.. లేక హాలిడే ఇచ్చారా? ఈరోజు ఎందుకంత స్పెషల్
నేడు స్టాక్ మార్కెట్ ఓపెన్ ఉంటుందా.. లేక హాలిడే ఇచ్చారా? ఈరోజు ఎందుకంత స్పెషల్
Ocean’s Deepest Secrets : మనిషికి తెలియని రహస్య ప్రపంచం.. అసలు సముద్రంలో ఏముంది? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు
మనిషికి తెలియని రహస్య ప్రపంచం.. అసలు సముద్రంలో ఏముంది? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు
Nara Lokesh Australia Tour: ఏపీలో గ్రిఫిత్ వర్సిటీ ఇండియా సెంటర్ ఏర్పాటు చేయండి- వైస్ ప్రెసిడెంట్ తో లోకేష్
ఏపీలో గ్రిఫిత్ వర్సిటీ ఇండియా సెంటర్ ఏర్పాటు చేయండి- వైస్ ప్రెసిడెంట్ తో లోకేష్
AP and Telangana Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం, ఏపీలో వారం రోజులు, తెలంగాణలో ఐదు రోజులు భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం, ఏపీలో వారం రోజులు, తెలంగాణలో ఐదు రోజులు భారీ వర్షాలు
Home Minister Anita: డీఎస్పీ జయసూర్యపై నివేదిక మా దగ్గర ఉంది- చర్యలు ఖాయం - హోంమంత్రి అనిత ప్రకటన
డీఎస్పీ జయసూర్యపై నివేదిక మా దగ్గర ఉంది- చర్యలు ఖాయం - హోంమంత్రి అనిత ప్రకటన
Embed widget