అన్వేషించండి

AP Teachers Transfer: ఉపాధ్యాయుల బదిలీలు రద్దు, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం - విద్యాశాఖ ఉత్తర్వులు

AP Govt teachers Transfer | టీచర్ల బదిలీలను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ మధ్య జరిగిన బదిలీలు రద్దయ్యాయి.

Transfer of Andhra Pradesh Govt teachers rejected | ఉపాధ్యాయుల బదిలీలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీచర్ల అక్రమ బదిలీలు రద్దు చేస్తూ  ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం నాడు ఉత్తర్వులు విడుదల చేసింది. రాష్ట్రంలో ఫిబ్రవరి 2024 నుంచి జూన్ 2024 వరకు జరిగిన టీచర్ల బదిలీలను రద్దు చేశారు. ఏపీ విద్యాశాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం టీచర్ల బదిలీలను రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత కొన్ని రోజుల నుంచి టీచర్ల బదిలీలలో పారదర్శకత, జవాబుదారీతనం ఉంటుందని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెబుతూనే ఉన్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ వరకు జరిగిన ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్ల బదిలీలను రద్దు చేస్తూ రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఎన్నికలకు ముందు ఏపీలో టీచర్ల బదిలీలు 
ఏపీలో ఉపాధ్యాయుల అక్రమ బదిలీల వ్యవహారంపై సీఎం చంద్రబాబు ప్రభుత్వం గుర్రుగా ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు రాష్ట్రంలో జరిగిన టీచర్ల బదిలీలు పారదర్శకంగా జరగలేదని పేర్కొంటూ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్లు పొందిన 917 మంది బదిలీలను రద్దు చేసింది. సీఎం చంద్రబాబు టీచర్లు, హెడ్ మాస్టర్ల బదిలీలపై ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఎన్నికలకు ముందు పలు దఫాలుగా వైసీపీ ప్రభుత్వం టీచర్లను బదిలీలు చేసింది. వాటిలో 653 మంది ఉపాధ్యాయుల బదిలీలను అప్పటి సీఎం వైఎస్ జగన్ ర్యాటిఫై చేయడం తెలిసిందే. 

917 మంది టీచర్లకు బదిలీ ఆర్డర్లు ఇచ్చినా రాష్ట్రంలో ఎన్నికలు రావడంతో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న కారణంగా వాటిని ర్యాటిఫై చేయలేదు. దీంతో టీచర్లు ట్రాన్స్‌ఫర్ అయినప్పటికీ, ఆర్డర్స్ రాని కారణంగా పాత స్థానాల్లోనే కొనసాగుతున్నారు. ఎన్నికల తరువాత ఏపీలో ప్రభుత్వం మారింది. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారిలోకి వచ్చిన వెంటనే టీచర్ల బదిలీలపై గత ప్రభుత్వ ఆదేశాలను నిలుపుదల చేశారు. అందుకు సంబంధించి ఏపీ పాఠశాల విద్యాశాఖ బుధవారం నాడు (జులై 24న) ఉత్తర్వులు జారీచేసింది. 

హైకోర్టును ఆశ్రయించిన టీచర్లు 
తమను ట్రాన్స్‌ఫర్ చేసినా రిలీవ్‌ చేయడం లేదని 215 మంది టీచర్లు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అదే సమయంలోనే పాఠశాల విద్యాశాఖ వైసీపీ సర్కార్ చేసిన బదిలీలకు సంబంధించిన రాటిఫికేషన్‌ ఫైలును సీఎం చంద్రబాబుకు పంపింది. ఆ బదిలీల ఫైలును పరిశీలించిన సీఎం చంద్రబాబు ట్రాన్స్‌ఫర్ల నిర్ణయాన్ని తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. దీంతో 917 మంది టీచర్ల బదిలీ ఆగిపోయింది. తాజాగా విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసి స్పష్టత ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వం డబ్బులు వసూలు చేసి, ఇష్టారాజ్యాంగా టీచర్లను వారు కోరుకున్న చోటుకు బదిలీ చేసి కోట్లు దండుకుందని ఆరోపణలున్నాయి. కూటమి ప్రభుత్వం టీచర్ల బదిలీలు పారదర్శకంగా జరిగేలా చేస్తామని, ఎవరికీ అన్యాయం జరగకుండా చేస్తామని కొన్ని రోజుల కిందట ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సైతం స్పష్టం చేశారు.

Also Read: సీటెట్‌ 2024 ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Spokesperson Shyamala Response on Rumors: శ్యామలకు కౌంట్‌డౌన్ మొదలైందా? పొగ పెడుతున్న వారికీ యాంకర్ శ్యామల ఘాటు కౌంటర్!
శ్యామలకు కౌంట్‌డౌన్ మొదలైందా? పొగ పెడుతున్న వారికీ యాంకర్ శ్యామల ఘాటు కౌంటర్!
Kakinada Constable Murder: కాకినాడలో గొంతు కోసి కానిస్టేబుల్ దారుణహత్య.. ఒక్కసారిగా దాడిచేసి గొంతు కోయడంతో విషాదం
కాకినాడలో గొంతు కోసి కానిస్టేబుల్ దారుణహత్య.. ఒక్కసారిగా దాడిచేసి గొంతు కోయడంతో విషాదం
Modi Telangana strategy: మోదీ మాస్టర్ స్ట్రోక్ - తెలంగాణ బీజేపీ రోడ్ మ్యాప్ రెడీ - కొత్త కూటమికి పునాదులు?
మోదీ మాస్టర్ స్ట్రోక్ - తెలంగాణ బీజేపీ రోడ్ మ్యాప్ రెడీ - కొత్త కూటమికి పునాదులు?
Hyderabad Road Accident: రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ హీరో, కెమెరా మెన్ మృతి.. హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై విషాదం
రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ హీరో, కెమెరా మెన్ మృతి.. హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై విషాదం

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Bhagirath POCSO Case: బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. తక్షణ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. తక్షణ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Petrol and Diesel Price Hike? ప్రధాని మోదీ మాటల వెనక అంతరార్థం అదేనా..! భారత్ పై మిడిల్ ఈస్ట్ సంక్షోభం తప్పదా! సామాన్యులపై భారీ భారం?
ప్రధాని మోదీ మాటల వెనక అంతరార్థం అదేనా..! భారత్ పై మిడిల్ ఈస్ట్ సంక్షోభం తప్పదా! సామాన్యులపై భారీ భారం?
TN Minister S Keerthana: ఎమ్మెల్యేగా ప్రమాణం చేయకుండా మహిళా మంత్రికి అనుమతి నిరాకరణ.. నిరాశగా వెనుదిరిగిన కీర్తన
ఎమ్మెల్యేగా ప్రమాణం చేయకుండా మహిళా మంత్రికి అనుమతి నిరాకరణ.. Watch Video
Barrierless Toll Plaza: టోల్ ప్లాజాల వద్ద ఇక ఆగక్కర్లేదు.. దేశంలో రెండో బారియర్ లెస్ టోల్ ప్రారంభం! కేంద్రం సరికొత్త అడుగు
టోల్ ప్లాజాల వద్ద ఇక ఆగక్కర్లేదు.. దేశంలో రెండో బారియర్ లెస్ టోల్ ప్రారంభం! కేంద్రం సరికొత్త అడుగు
Kakinada Constable Murder: కాకినాడలో గొంతు కోసి కానిస్టేబుల్ దారుణహత్య.. ఒక్కసారిగా దాడిచేసి గొంతు కోయడంతో విషాదం
కాకినాడలో గొంతు కోసి కానిస్టేబుల్ దారుణహత్య.. ఒక్కసారిగా దాడిచేసి గొంతు కోయడంతో విషాదం
Modi Telangana strategy: మోదీ మాస్టర్ స్ట్రోక్ - తెలంగాణ బీజేపీ రోడ్ మ్యాప్ రెడీ - కొత్త కూటమికి పునాదులు?
మోదీ మాస్టర్ స్ట్రోక్ - తెలంగాణ బీజేపీ రోడ్ మ్యాప్ రెడీ - కొత్త కూటమికి పునాదులు?
Mangoes and Food Combinations : మామిడి పండుతో కలిపి తినకూడని ఫుడ్స్ ఇవే.. తింటే వచ్చే సమస్యలు ఇవే
మామిడి పండుతో కలిపి తినకూడని ఫుడ్స్ ఇవే.. తింటే వచ్చే సమస్యలు ఇవే
Mahabubnagar Road Accident: మహబూబ్‌నగర్‌లో స్పోర్ట్స్‌ బైక్, కారు ఢీకొనడంతో ఐదుగురు మృతి
మహబూబ్‌నగర్‌లో స్పోర్ట్స్‌ బైక్, కారు ఢీకొనడంతో ఐదుగురు మృతి
Embed widget