అన్వేషించండి

Rayalaseema Lift Irrigation: రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీలో ఏపీ అఫిడవిట్‌... అధ్యయనంలో భాగంగానే పనులు.. కాంక్రీట్ పనులు చేపట్టలేదని నివేదిక

చెన్నైలోని ఎన్జీటీలో రాయలసీమ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలపై శుక్రవారం విచారణ జరగనుంది. ఈ సందర్భంలో ఏపీ ప్రభుత్వం అఫిడవిడ్ దాఖలు చేసింది. ప్రాజెక్ట్ పనులు చేయడంలేదని స్పష్టం చేసింది.


రాయలసీమ ఎత్తిపోతల పథకంపై దాఖలపై పిటిషన్లపై శుక్రవారం ఎన్జీటీ(నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్)లో విచారణ జరగనుంది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీకి నివేదిక సమర్పించింది. ఈ పథకం డీపీఆర్‌ రూపొందించడానికి అవసరమైన పనులను మాత్రమే చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. సీడబ్ల్యూసీ నుంచి అనుమతుల కోసం అవసరమైన పనులు మాత్రమే చేపట్టినట్లు తెలిపింది. జులై 7 నుంచి డీపీఆర్‌ పనులను నిలిపివేసినట్లు వెల్లడించింది. ఆ ప్రదేశంలో యంత్రాలు లేవని, కార్మికులు కూడా లేరని ఎన్జీటీకి తెలిపింది. రాయలసీమ ఎత్తిపోతల ప్రధాన ప్రాజెక్టు పనులు చేపట్టినట్లు జాయింట్‌ కమిటీ పేర్కొనలేదని ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ట్రైబ్యునల్‌ను ఏపీ ప్రభుత్వం కోరింది. 

అఫిడవిట్ దాఖలు

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఎన్జీటీలో అఫిడవిట్‌ దాఖలు చేశారు. 8.89 కిలోమీటర్ల అప్రోచ్‌ ఛానల్‌ నిర్మాణానికి 250 లక్షల క్యూమెక్స్‌ తవ్వకాలు జరగాల్సి ఉండగా 30% అంటే 74 క్యూమెక్స్‌ తవ్వినట్లు తెలిపారు. ఐఐటీ సభ్యుల టీమ్ 2020లో ఇచ్చిన నివేదికలోని 5వ సిఫారసు ప్రకారం అప్రోచ్‌ ఛానల్‌ నిర్మాణంలో సున్నపురాయి ఉండటంతో నీటిని పీల్చుకునే అవకాశం ఉందన్నారు. అందువల్ల ఈ ఛానల్ ను మరింత లోతుగా తవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పంప్‌ హౌస్‌ నిర్మాణంలో భాగంగానే 1 నుంచి 12 స్లోపుల నిర్మాణం చేపట్టామని తెలిపారు. వర్షాలతో ఇవి కుంగిపోకుండా నివారించేందుకు గోడలు నిర్మించామని పేర్కొన్నారు.  అంతేగానీ ప్రాజెక్టు పనుల్లో భాగంగా ఎలాంటి కాంక్రీట్‌ పనులు చేపట్టలేదన్నారు. 

Also Read: Kabul Airport: వేటాడి మరీ ప్రతీకారం తీర్చుకుంటాం...తరలింపు ఆగదు... కాబూల్ దాడులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

అధ్యయనంలో భాగంగా

250 మీటర్ల వెడల్పు, 40 మీటర్ల లోతు పంప్‌ హౌస్‌ ఉంటుందని, అధ్యయనంలో భాగంగా కేవలం 50 నుంచి 60 మీటర్ల వరకు తవ్వినట్లు నివేదికలో పేర్కొన్నారు. 1.75 క్యూమెక్స్‌ కాంక్రీట్‌ పనులు చేపట్టాల్సి ఉందని, ఈ పనులకు రెండు, మూడు సీజన్‌ల సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. వర్షాకాలం అనంతరం నీటిని తొలగించి పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉందని ఎన్జీటీకి తెలిపారు. 5 మీటర్ల చుట్టుకొలత, 200 మీటర్ల పొడవుతో 12 పైపులైన్లు వేయాల్సి ఉందని, శాంపిళ్లలో భాగంగా 35 నుంచి 40 మీటర్ల పొడవు పైప్ లైన్ వేసినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. 

రాయలసీమ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై విచారణ

జాయింట్‌ కమిటీ నివేదికపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై పిటిషనర్‌ గవినోళ్ల శ్రీనివాస్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన ఎన్జీటీలో మెమో దాఖలు చేశారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన పనులన్నింటినీ వక్రీకరిస్తోందన్నారు. జాయింట్‌ కమిటీ ఆధారాలతో సహా పనులు జరిగినట్లు నివేదిక ఇచ్చినా పనులు జరగలేదని వాదిస్తోందన్నారు. గతంలో ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. అందువల్ల కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని కోరారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై దాఖలైన పిటిషన్‌లతోపాటు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులకు సంబంధించి దాఖలైన పిటిషన్‌లపైనా శుక్రవారం చెన్నైలోని ఎన్జీటీ విచారణ జరగనుంది. 

 

Also Read: AP New Property Tax: ఏపీలో అమల్లోకి కొత్త ఆస్తి పన్ను... ఏప్రిల్ ఒకటి నుంచి లెక్కిస్తున్నట్లు నోటీసులు.. పట్టణ స్థానిక సంస్థల్లో గెజిట్‌ నోటిఫికేషన్లు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget