అన్వేషించండి

Pension Distribution: పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం స్పష్టత - అధికారులకు కీలక ఆదేశాలు

Andhrapradesh News: వాలంటీర్లపై సీఈసీ ఆదేశాలతో ఇకపై సచివాలయాల్లోనే సిబ్బందితో పింఛన్ల పంపిణీ చేయాలని సెర్ప్ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకూ ఇంటింటికీ పింఛన్లు ఇవ్వరని తెలిపింది.

Ap Government Key Orders on Pension Distribution: రాష్ట్రంలో ఎన్నికల కోడ్ దృష్ట్యా వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ (Pension Distribution) చేయించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం (CEC) ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పింఛన్ల పంపిణీపై నెలకొన్న సందిగ్థతపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకూ ఇంటింటికీ పింఛన్ల పంపిణీ ఉండదని గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్) వెల్లడించింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో సచివాలయాల్లోనే పింఛన్లు పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. సచివాలయాలకు వెళ్లి ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డు తీసుకెళ్లి పెన్షన్ తీసుకోవాలని సూచించింది. ఈ క్రమంలో ఏప్రిల్ 3 నుంచి సచివాలయాల్లో పెన్షన్ పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఈసీ కీలక ఆదేశాలు

కాగా, ఎన్నికల కోడ్ కారణంగా వాలంటీర్లను పింఛన్ల పంపిణీకి దూరంగా ఉంచాలని శనివారం కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. పింఛన్ మాత్రమే కాదు, ఎలాంటి సంక్షేమ పథకాలకు వాలంటీర్ల ద్వారా నగదు పంపిణీ చేయించవద్దని ఉత్తర్వులు ఇచ్చింది. అంతే కాకుండా, ఏపీలో ఎన్నికల కోడ్ ముగిసే వరకూ వాలంటీర్లకు ఇచ్చిన ట్యాబ్స్, మొబైల్స్ ఎన్నికల అధికారుల వద్ద డిపాజిట్ చేసుకోవాలని స్పష్టం చేసింది. పింఛన్ సహా అమల్లో ఉన్న ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలను ఆన్‌లైన్ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని సూచించారు. లేకపోతే రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా నగదు పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఈసీ పేర్కొంది. వాలంటీర్ల పని తీరుపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు, పత్రికల్లో కథనాలు, హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. కాగా, వాలంటీర్లు అధికార పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారని.. ఎన్నికల ప్రచారంలో పాల్గొనవద్దని ఈసీ ఆదేశించినా పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో పలు చోట్ల కొందరిని అధికారులు విధుల నుంచి సైతం తప్పించారు. ఈ పరిణామాల నేపథ్యంలో వాలంటీర్లను నగదు పంపిణీ ప్రయోజనాలకు దూరంగా ఉంచేలా ఈసీ చర్యలు చేపట్టింది.

అటు, వాలంటీర్లపై చంద్రబాబు కుట్ర చేసి పేదలకు పెన్షన్ అందకుండా చేశారని మంత్రి బొత్స మండిపడ్డారు. పేదవాడికి వచ్చే లబ్ధితో కూడా టీడీపీ కుటిల రాజకీయం చేస్తోందని విమర్శించారు. మాజీ మంత్రి పేర్ని నాని, ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల సైతం టీడీపీపై విమర్శలు గుప్పించారు.

సీఎస్ కు చంద్రబాబు లేఖ

మరోవైపు, రాష్ట్రంలో పింఛన్ల పంపిణీపై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఎన్నికల కోడ్ కారణంగా వాలంటీర్లపై ఈసీ ఆదేశాలతో.. ప్రత్యామ్నాయ మార్గాల్లో వృద్ధులు, వితంతువులు, ఇతర లబ్ధిదారులకు నగదు రూపంలో పింఛను అందించాలని అన్నారు. గ్రామ, సచివాలయ సిబ్బంది, ఇతర క్షేత్రస్థాయి ఉద్యోగుల ద్వారా సకాలంలో పింఛన్ అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. సీఎస్ తో పాటు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి సైతం ఆయన లేఖ రాశారు. పింఛన్ల పంపిణీకి తగు చర్యలు చేపట్టేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని సీఈవోను కోరారు.

Also Read: Janasena: మరో అభ్యర్థిని ప్రకటించిన పవన్ కల్యాణ్ - ఇంకా 2 స్థానాల్లో పెండింగ్, పిఠాపురంలో పవన్ రెండో రోజు పర్యటన

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Steel Plant Credit Game: మిట్టల్ స్టీల్ ప్లాంట్ క్రెడిట్ తనదేనన్న జగన్ - పాత వీడియోతో షాకిచ్చిన టీడీపీ
మిట్టల్ స్టీల్ ప్లాంట్ క్రెడిట్ తనదేనన్న జగన్ - పాత వీడియోతో షాకిచ్చిన టీడీపీ
Deputy CM Pawan Kalyan: రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
AP Assembly special meeting: 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
Vijayawada Terror Links Case: విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు

వీడియోలు

Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam
BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam
Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Indiramma Controversy: తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
Varanasi Movie Set: వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
Deputy CM Pawan Kalyan: రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Rakasa Trailer : ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
New Corona: ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
AP Assembly special meeting: 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
Vijayawada Terror Links Case: విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
West Asia Conflict: ప్రపంచ ఇంధన సంక్షోభం! భారత్ అప్రమత్తం! మైలేజీ పెంచుకోవడానికి నిపుణుల కీలక సూచనలు !
ప్రపంచ ఇంధన సంక్షోభం! భారత్ అప్రమత్తం! మైలేజీ పెంచుకోవడానికి నిపుణుల కీలక సూచనలు !
Embed widget