అన్వేషించండి

Pension Distribution: పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం స్పష్టత - అధికారులకు కీలక ఆదేశాలు

Andhrapradesh News: వాలంటీర్లపై సీఈసీ ఆదేశాలతో ఇకపై సచివాలయాల్లోనే సిబ్బందితో పింఛన్ల పంపిణీ చేయాలని సెర్ప్ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకూ ఇంటింటికీ పింఛన్లు ఇవ్వరని తెలిపింది.

Ap Government Key Orders on Pension Distribution: రాష్ట్రంలో ఎన్నికల కోడ్ దృష్ట్యా వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ (Pension Distribution) చేయించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం (CEC) ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పింఛన్ల పంపిణీపై నెలకొన్న సందిగ్థతపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకూ ఇంటింటికీ పింఛన్ల పంపిణీ ఉండదని గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్) వెల్లడించింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో సచివాలయాల్లోనే పింఛన్లు పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. సచివాలయాలకు వెళ్లి ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డు తీసుకెళ్లి పెన్షన్ తీసుకోవాలని సూచించింది. ఈ క్రమంలో ఏప్రిల్ 3 నుంచి సచివాలయాల్లో పెన్షన్ పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఈసీ కీలక ఆదేశాలు

కాగా, ఎన్నికల కోడ్ కారణంగా వాలంటీర్లను పింఛన్ల పంపిణీకి దూరంగా ఉంచాలని శనివారం కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. పింఛన్ మాత్రమే కాదు, ఎలాంటి సంక్షేమ పథకాలకు వాలంటీర్ల ద్వారా నగదు పంపిణీ చేయించవద్దని ఉత్తర్వులు ఇచ్చింది. అంతే కాకుండా, ఏపీలో ఎన్నికల కోడ్ ముగిసే వరకూ వాలంటీర్లకు ఇచ్చిన ట్యాబ్స్, మొబైల్స్ ఎన్నికల అధికారుల వద్ద డిపాజిట్ చేసుకోవాలని స్పష్టం చేసింది. పింఛన్ సహా అమల్లో ఉన్న ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలను ఆన్‌లైన్ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని సూచించారు. లేకపోతే రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా నగదు పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఈసీ పేర్కొంది. వాలంటీర్ల పని తీరుపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు, పత్రికల్లో కథనాలు, హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. కాగా, వాలంటీర్లు అధికార పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారని.. ఎన్నికల ప్రచారంలో పాల్గొనవద్దని ఈసీ ఆదేశించినా పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో పలు చోట్ల కొందరిని అధికారులు విధుల నుంచి సైతం తప్పించారు. ఈ పరిణామాల నేపథ్యంలో వాలంటీర్లను నగదు పంపిణీ ప్రయోజనాలకు దూరంగా ఉంచేలా ఈసీ చర్యలు చేపట్టింది.

అటు, వాలంటీర్లపై చంద్రబాబు కుట్ర చేసి పేదలకు పెన్షన్ అందకుండా చేశారని మంత్రి బొత్స మండిపడ్డారు. పేదవాడికి వచ్చే లబ్ధితో కూడా టీడీపీ కుటిల రాజకీయం చేస్తోందని విమర్శించారు. మాజీ మంత్రి పేర్ని నాని, ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల సైతం టీడీపీపై విమర్శలు గుప్పించారు.

సీఎస్ కు చంద్రబాబు లేఖ

మరోవైపు, రాష్ట్రంలో పింఛన్ల పంపిణీపై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఎన్నికల కోడ్ కారణంగా వాలంటీర్లపై ఈసీ ఆదేశాలతో.. ప్రత్యామ్నాయ మార్గాల్లో వృద్ధులు, వితంతువులు, ఇతర లబ్ధిదారులకు నగదు రూపంలో పింఛను అందించాలని అన్నారు. గ్రామ, సచివాలయ సిబ్బంది, ఇతర క్షేత్రస్థాయి ఉద్యోగుల ద్వారా సకాలంలో పింఛన్ అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. సీఎస్ తో పాటు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి సైతం ఆయన లేఖ రాశారు. పింఛన్ల పంపిణీకి తగు చర్యలు చేపట్టేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని సీఈవోను కోరారు.

Also Read: Janasena: మరో అభ్యర్థిని ప్రకటించిన పవన్ కల్యాణ్ - ఇంకా 2 స్థానాల్లో పెండింగ్, పిఠాపురంలో పవన్ రెండో రోజు పర్యటన

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

India vs Zimbabwe, 2nd T20I: షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India vs Zimbabwe, 2nd T20I: షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Embed widget