Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
AP Government: ఐఐటీ మద్రాస్తో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు చేసుకుంది. అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేశ్ సమక్షంలో 8 విభాగాల ఒప్పందాలు చేసుకున్నారు.

AP Government Agreement With IIT Madras: ఏపీ ప్రభుత్వం ఐఐటీ మద్రాస్తో (IIT Madras) పలు కీలక ఒప్పందాలు చేసుకుంది. అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) సమక్షంలో 8 విభాగాల ఒప్పందాలు చేసుకున్నారు. ఈ మేరకు మంత్రి ట్వీట్ చేశారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం, అత్యాధునిక పరిశోధనలు నిర్వహించడం, సమాజానికి ప్రయోజనం చేకూర్చే సామాజిక సంబంధిత కార్యకలాపాల్లో ప్రభుత్వంతో కలిసి ఐఐటీ మద్రాస్ పనిచేయనుంది. ఈ మేరకు ఐఐటీఎం ప్రతినిధులతో సీఎం చంద్రబాబు (CM Chandrababu) చర్చలు జరిపారు. ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ విజినాథన్ కామకోటి, డీన్ ఆఫ్ ప్లానింగ్ రామానుజం సారధి ఆధ్వర్యంలో 8 ఒప్పందాలు కుదిరాయి.
అమరావతిని అంతర్జాతీయస్థాయి నగరంగా తీర్చిదిద్దడంతోపాటు వివిధ రంగాల్లో అధునాతన సాంకేతికత, పరిశోధనల ఫలాలను ఏపీ ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు,
— Lokesh Nara (@naralokesh) November 15, 2024
పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం, అత్యాధునిక పరిశోధనలు నిర్వహించడం, సమాజానికి ప్రయోజనం చేకూర్చే సామాజిక సంబంధిత… pic.twitter.com/sxEC9z1STO
ముఖ్యాంశాలివే..
- అమరావతిలో అంతర్జాతీయ డీప్టెక్ పరిశోధన, డిజైన్, ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ పార్క్ ఏర్పాటులో సాంకేతిక సలహా కోసం ఏపీ సీఆర్డీఏ ఒప్పందం చేసుకుంది.
- అలాగే, సముద్ర పరిశోధన, కమ్యూనికేషన్, కోస్టల్ ఎనర్జీ హార్వెస్టింగ్ టెక్నాలజీల కోసం ఐఐటీఎం, ఏపీ సర్కారు మధ్య ఏపీ మారిటైమ్ బోర్డు ఒప్పందం కుదిరింది. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి పరిశోధనతో పాటు కన్సల్టెన్సీ, విద్య, శిక్షణ ప్రయోజనాలను సాధించడమే ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం.
- స్వయం ప్లస్, ఐఐటీఎం ప్రవర్తక్ డిజిటల్ స్కిల్ అకాడమీ వంటి ప్లాట్ ఫామ్స్ ద్వారా స్కేల్ స్కిల్లింగ్ కార్యక్రమాల్లో నాణ్యత పెంచేలా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ఒప్పందం చేసుకుంది. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా అధునాతన సాంకేతిక శిక్షణ ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. ఐఐటీఎం ప్రవర్తక్ విద్యా శక్తి ద్వారా ప్రాథమిక, ఉన్నత పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఐఐటీఎం సాంకేతిక శిక్షణ ఇస్తుంది.
- విమానాశ్రయాలను లాజిస్టిక్స్, మెయింటెనెన్స్ హబ్లుగా మార్చే లక్ష్యంతో ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్టక్చర్ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యంగా కుప్పం, పుట్టపర్తి విమానాశ్రయాలపై దృష్టి సారించడం, ఆయా ప్రాంతాల్లో వ్యాపార అవకాశాలను గుర్తించి అభివృద్ధి చేయడం ఈ ఒప్పందం లక్ష్యం.
- అలాగే, అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతికతను ఉపయోగించి విశాఖ మహానగరాన్ని ఇంటర్నెట్ గేట్వేగా అభివృద్ధి చేసేలా ఒప్పందం చేసుకున్నారు. తద్వారా రాష్ట్రంలో అంతర్జాతీయ డేటా కనెక్టివిటీని మెరుగుపరుస్తారు.
- ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ రంగాల్లో సాఫ్ట్వేర్ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం ఐఐటీఎం ప్రవర్తక్తో ఏపీ ఆర్టీజీఎస్ కలిసి పని చేస్తుంది.
- రాజధాని అమరావతిలో అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో స్మార్ట్ టెక్ ఎనేబుల్డ్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు ఐఐటీఎం ద్వారా సాంకేతిక సలహాలు పొందేందుకు రాష్ట్ర క్రీడల శాఖ ఒప్పందం చేసుకుంది.
Also Read: APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Before You Go
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























