అన్వేషించండి

AP Electricity Employees Salaries : జీతాల కోసం ఏపీ విద్యుత్ సిబ్బంది పడిగాపులు - ధర్నాలు చేస్తున్న ఉద్యోగులు !

జీతాల కోసం ఏపీ విద్యుత్ సిబ్బంది ఎదురు చూస్తున్నారు. జీతాలివ్వాలని ధర్నాలు చేస్తున్నారు.

 

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు,పెన్షన్లు విడతల వారీగా పదో తేదీకైనా సర్దుబాటు చేస్తున్నారు. కానీ కీలకమైన విద్యుత్ సంస్థల సిబ్బందికి మాత్రం ఎప్పుడు జీతాలు అందుతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ నెల 13వ తేదీ వచ్చినా విద్యుత్ సంస్థల ఉద్యోగులకు జీతాలు అందలేదు. దాంతో వారంతా ఆందోళనలు ప్రారంభించారు. ఎందుకైనా మంచిదని ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. విద్యుత్ సంస్థల్లో సిబ్బంది ఎవరైనా సమ్మె చేస్తే ఎస్మా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. జీతం అడిగితే ఎస్మా ప్రయోగించడం ఏమిటని ఉద్యోగులు మథనపడుతున్నారు. 

ఏపీ విద్యుత్ ఉద్యోగులు జీతాల కోసం రెండు రోజుల నుంచి  విద్యుత్ కార్యాలయాల ముందు ధర్నాలు చేస్తున్నారు.  ఎన్నో ఏళ్లుగా ఉద్యోగం చేస్తోన్నామని... ఎప్పుడూ ఒకటో తేదీన వేతనాలు బ్యాంకు ఖాతాలో ఠంఛనుగా జమ అయ్యేవని కానీ ఇప్పుడు 13 రోజులు దాటినా జీతాలివ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. సకాలంలో జీతాలివ్వకపోవడం వల్ల ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు.  బ్యాంకుల అప్పులకు ఈఎంఐలు, ఇంటి అద్దెలు కట్టలేని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి ఖర్చులకూ డబ్బులేని స్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ప్రభుత్వం వెంటనే తమకు జీతం చెల్లించే ఏర్పాట్లు చేయాలని... లేని పక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామంటున్నారు.  

మూడు డిస్కంల పరిధిలో ఎవ్వరికీ ఇంతవరకూ వేతనాలు అందలేదు.  విద్యుత్‌ శాఖలోని విశ్రాంత ఉద్యోగులకు ఇంతవరకు పెన్షన్‌ డబ్బులు పడని పరిస్థితి. డిసెంబరు నెల నుండి విద్యుత్‌ శాఖలో పనిచేసే ఉద్యోగులకు వేతనాలు సకాలంలో అందడం లేదు.  డిసెంబరు నెల వేతనాలు సంక్రాంతి పండుగ తరువాత జనవరి 17న జమ చేశారు. ఫలితంగా అతి పెద్ద పండుగను జరుపుకోలేపోయామని తెలిపారు. అలాగే, జనవరి నెల వేతనాలు కూడా ఫిబ్రవరి రెండో వారంలో జమ చేయగా, ఫిబ్రవరి నెల వేతనాలు మార్చి రెండో వారంలో జమ చేశారని పేర్కొంటున్నారు. ఇక, మార్చి వేతనం ఏప్రిల్‌ 2 ఉగాది తరువాత 8వ తేదీ వేశారని, ఏప్రిల్‌ వేతనం మే నెల 13వ తేదీ వచ్చినప్పటికీ ఇంతవరకూ ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదు.

విద్యుత్‌ శాఖ సకాలంలో సిబ్బందికి వేతనాలు అందించకపోడంతో సుమారుగా 64 వేల మంది ఉద్యోగులు ఇబ్బందులపాలవుతున్నారు. ఇందులో మూడు డిస్కంల పరిధలో పనిచేస్తున్న సుమారు 24 వేల మంది ఉద్యోగులతోపాటు మరో 40 వేల మంది వరకూ పెన్షనర్లు ఉన్నారు.  శనివారం, ఆదివారం బ్యాంకులకు సెలవులు కావడంతో   తిరిగి సోమవారం అంటే ఈనెల 16వ తేదీనే జీతాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. విద్యుత్‌ కొరత ఉందని, కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నందున ఉద్యోగుల జీతాలకు సమస్యగా ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  

 

టాప్ హెడ్ లైన్స్

Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Embed widget