అన్వేషించండి

Pawan Kalyan: సాటి మహిళా విలేకరి ఇబ్బంది పడుతుంటే మీరేం చేస్తున్నారు? - జర్నలిస్టులకు డిప్యూటీ సీఎం పవన్ క్లాస్

Andhra News: డిప్యూటీ సీఎం పవన్ మీడియా ప్రతినిధులకు క్లాస్ తీసుకున్నారు. సాటి మహిళా విలేకరి ఇబ్బంది పడుతుంటే కనీసం పట్టించుకోవడం లేదని.. స్పృహ ఇక్కడి నుంచే రావాలని అన్నారు.

Deputy CM Pawan Class To Journalists: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) గుంటూరులో ఆదివారం నిర్వహించిన అటవీశాఖ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తున్న సమయంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓ మీడియా ప్రతినిధి రాష్ట్రంలో మహిళలపై దాడుల విషయం ప్రస్తావించారు. ఆడబిడ్డల ఆత్మరక్షణకు బాలికలకు స్కూల్ స్థాయి నుంచే సెల్ఫ్ ప్రొటక్షన్ శిక్షణ వంటి అంశాలను పరిశీలిస్తారా.? అని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన పవన్.. ముందు మారాల్సింది మీరే అంటూ వారికి క్లాస్ తీసుకున్నారు. అక్కడి మీడియా ప్రతినిధుల్లో ఓ మహిళా విలేకరి సైతం ఉన్నారు. ఆమె పవన్ బైట్ తీసుకునేందుకు యత్నిస్తూ ఇబ్బంది పడ్డారు. ఈ విషయాన్నే పవన్ వారికి చెప్పారు. 'మీరు సెల్ఫ్ ప్రొటక్షన్ అంటున్నారు. మీరే ఉన్నారు ఇక్కడ. ఈ మహిళా విలేకరి ఇందాకటి నుంచి నలిగిపోతున్నారు. మీ సాటి మహిళా విలేకరి ఇబ్బంది పడుతుంటే మీరు ఆమె గురించి ఆలోచించడం లేదు. మీరు బైట్ తీసుకోవాలనుకుంటున్నారు తప్ప ఆమె ఇబ్బంది పడకుండా చూడాలని అనుకోవడం లేదు. ఫస్ట్ మన స్పృహ మనకు ఉండాలి.' అంటూ క్లాస్ తీసుకున్నారు.

'సామాజిక స్పృహ ఉండాలి'

అటవీశాఖ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్, ఐపీఎస్‌లతో పాటు అధికారులకు ఎవరైనా వార్నింగ్ ఇస్తే సుమోటోగా కేసులు పెడతామని హెచ్చరించారు. తమ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని మభ్యపెట్టి పోలీస్ అధికారులతో ఘోర తప్పిదాలు చేయించారని మాజీ సీఎం జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 'ఆడబిడ్డలపై అఘాయిత్యాలు ఆగాలంటే మొదట మనందరికీ సామాజిక స్పృహ ఉండాలి. అన్యాయం జరిగితే ఆపాలన్న ఆలోచన సమాజానికి ఉండాలి. కళ్ల ముందు ఆడబిడ్డలను ఏడిపిస్తుంటే చోద్యం చూస్తుంటారు. ముందుగా ప్రజలు కళ్ల ముందు జరుగుతున్న అన్యాయాన్ని నిలువరించాలి. నా కళ్ల ముందు ఏ ఆడబిడ్డకు ఇబ్బంది కలిగినా చూస్తూ ఊరుకోను. పోలీసులు కూడా.. ఫిర్యాదు చేసిన వారిని క్రిమినల్స్‌గా పరిగణించవద్దు. ప్రజలు కూడా నేరం మీద ఫిర్యాదు చేసేందుకు వెళ్తే పోలీసులు మనల్ని ఇబ్బందిపెడతారు అన్న ఆలోచనల నుంచి బయటకు రావాలి. పది మంది వెళ్లి ఫిర్యాదు చేస్తే అలాంటి పరిస్థితులను నిలువరించవచ్చు.' అని పేర్కొన్నారు.

'క్రిమినల్స్‌కు కులమతాలు ఉండవు'

'ఎన్ని చట్టాలు తెచ్చినా వాటిని అమలు చేసే వ్యక్తుల్లో చిత్తశుద్ది లేకపోతే ఫలితం ఉండదు. నిర్భయ కేసు తర్వాత కూడా కోల్‌కతా ప్రభుత్వ ఆసుపత్రి వంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి. చట్టాల అమలుకు ప్రజల నుంచి కూడా సహకారం అవసరం. సింగపూర్ తరహా శిక్షలు అమలు చేయాలి. ఏ కులమైనా, మతమైనా తప్పు చేస్తే శిక్షించి తీరాలని సీఎం, డీజీపీకి చెప్పాం. దీంతో పాటు ఆడబిడ్డల సంరక్షణలో ముందుగా చుట్టుపక్కల వారి పర్యవేక్షణ ఉండాలి. పూంచ్ సెక్టార్ మాదిరి విలేజ్ డిఫెన్స్ సిస్టం ఉండాలి. ప్రాంతాల వారీగా యువత, పెద్దల కలయికతో డిఫెన్స్ కమిటీలు రావాలి. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తాం. దీంతో పాటు విద్యార్ధినులకు విద్యాలయాల్లో నిరంతర స్వీయ రక్షణ శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలి. డ్రగ్స్ నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నాం. పర్యావరణానికి నష్టం కలిగించేలా చేస్తా కఠిన చర్యలు తీసుకుంటాం.' అని పవన్ హెచ్చరించారు.

Also Read: Madanapalli News: ఆర్డీవో మురళీపై ప్రభుత్వం వేటు- ఆ కేసులో కాదు, అక్రమ ఆస్తుల కేసులో చర్యలు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget