అన్వేషించండి

Dharmana Comments: చంద్రబాబు మంచి ముఖ్యమంత్రే, నో డౌట్ - ప్రతిపక్ష నేతపై డిప్యూటీ సీఎం పొగడ్తలు

Srikakulam: కొత్త జిల్లాలపై శ్రీకాకుళం జిల్లాలో సోమవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన, స్పీకర్ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు

Dharmana Krishna Das: ఏపీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశంసించారు. చంద్రబాబు విజ్ఞత కలిగిన ముఖ్యమంత్రి అంటూ వ్యాఖ్యలు చేశారు. పద్నాలుగు ఏళ్ల పాటు ఆయన ఈ రాష్ట్రాన్ని విజ్ఞతతో పరిపాలించారని అన్నారు. చంద్రబాబు ప్రస్తుతం ప్రతిపక్షంగా ఉన్నందున తమ ప్రభుత్వానికి సలహాలు ఇచ్చి సహకరించాలని కోరారు. కొత్త జిల్లాలపై శ్రీకాకుళం జిల్లాలో సోమవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన, స్పీకర్ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రతిపక్ష నాయకులు చేస్తున్న విమర్శల గురించి ధర్మాన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

విద్యుత్ చార్జీల పెంపుపై ధర్మాన మాట్లాడుతూ.. కరెంటు రేట్లు నామినల్‌గా పెంచితే టీడీపీ నాయకులు దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారని అన్నారు. వారు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. కనీసం వారు అసెంబ్లీకి హాజరు కాకుండా వచ్చిన కాసేపు కూడా చిడతలు వాయించుకుంటూ కూర్చుంటున్నారని ఎద్దేవా చేశారు. ‘‘ప్రతిపక్షం పాలక పక్షం ఒక బండికి రెండు చక్రాల్లాటివి. ఆ రెండిట్లో ఒక చక్రం లేకపోయినా బండి సాఫీగా నడవదు. నో డౌట్ చంద్రబాబు గారు విజ్ఞత కలిగిన ముఖ్యమంత్రి నేనేం కాదనట్లేదు. 14 ఏళ్లు ఆ ఆరోజులకు తగ్గట్లుగా ఆయన పాలించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మకమైన పరిపాలన చేస్తుంటే దాన్ని అభినందించలేకపోతున్నారు. ప్రతిపక్షాలు ఇలా ఆలోచన లేని మాటలు మాట్లాడి ప్రజల ముందు చులకన అవుతున్నారు. మూడేళ్ల నుంచి బ్రహ్మాండమైన ఫలితాలను ప్రజలు ఇస్తున్నారు. జగన్ గారి పాలన ప్రజలకు మేలు చేకూర్చేది.’’ అంటూ మాట్లాడారు.

ఉప ముఖ్యమంత్రి ధర్మాన కాస్త చర్చనీయాంశ రీతిలో వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో కూడా విజయం సాధించి రెండోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని, ఒకవేళ ఓడిపోతే తన ఆస్తి మొత్తం రాసిచ్చేస్తానంటూ సవాలు విసిరారు. గత మార్చిలో 19వ తేదీన శ్రీకాకుళం జిల్లా పోలాకి, చెల్లాయి వలసలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కాకపోతే తన ఆస్తులన్నీ తెలుగు దేశం పార్టీకి రాసిచ్చేస్తానని సవాల్ విసిరారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన నభూతో న భవిష్యతి అని అభివర్ణించారు.

నాలుగు సార్లు ఎమ్మెల్యేగా
2019 ఎన్నికల్లో ధర్మాన కృష్ణదాస్ నాలుగోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన ఈయన వైసీపీ స్థాపించినప్పుడు సీఎం జగన్ వెనక్కి వచ్చారు. ఆ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో తన సోదరుడు ధర్మాన ప్రసాదరావు మంత్రిగా ఉన్నా కూడా కృష్ణదాస్ మాత్రం కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిపోయారు. ఈ క్రమంలోనే 2012లో జరిగిన ఉప ఎన్నికలో వైసీపీ తరఫున ధర్మాన కృష్ణదాస్ పోటీ చేసి గెలుపొందారు. అనంతరం 2014 ఎన్నికల్లో ధర్మాన సోదరులిద్దరూ ఓడిపోయారు. 2019లో ధర్మాన సోదరులిద్దరూ వైసీపీ నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలుపొందారు.

ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తన మంత్రివర్గంలో సీఎం జగన్ ధర్మానకు పెద్ద పీట వేశారు. ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. త్వరలోనే మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించనున్నట్లు సీఎం జగన్ ప్రకటించిన వేళ ధర్మాన కృష్ణదాస్‌ తన పదవి కోల్పోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandra Babu : పాలనలో 2025 గేమ్‌ ఛేంజర్‌ కావాలి- రాత్రి పగలు కష్టపడొద్దని అధికారులకు చెబుతున్న చంద్రబాబు
పాలనలో 2025 గేమ్‌ ఛేంజర్‌ కావాలి- రాత్రి పగలు కష్టపడొద్దని అధికారులకు చెబుతున్న చంద్రబాబు
Tiger Attack News: కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
Maoists News: మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
New Year 2025: ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma test Retirement | బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వైఫల్యంతో రోహిత్ మనస్తాపం | ABP DesamGautam Gambhir Coaching Controversy | గంభీర్ కోచింగ్ పై బీసీసీఐ అసంతృప్తి | ABP DesamSS Rajamouli Mahesh babu Film Launch | మహేశ్ సినిమాకు పూజ..పనులు మొదలుపెట్టిన జక్కన్న | ABP Desamతప్పతాగి కరెంటు తీగలపై పడుకున్నాడు - వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandra Babu : పాలనలో 2025 గేమ్‌ ఛేంజర్‌ కావాలి- రాత్రి పగలు కష్టపడొద్దని అధికారులకు చెబుతున్న చంద్రబాబు
పాలనలో 2025 గేమ్‌ ఛేంజర్‌ కావాలి- రాత్రి పగలు కష్టపడొద్దని అధికారులకు చెబుతున్న చంద్రబాబు
Tiger Attack News: కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
Maoists News: మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
New Year 2025: ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
Telangana News: హాస్టల్ నిర్వహణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం 
హాస్టల్ నిర్వహణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం 
Sydney Test Updates: ఐదో టెస్టులో ఆ టీమిండియా స్టార్ పై వేటు ఖాయం..! గంభీర్ పైనా వేళాడుతున్న కత్తి.. జట్టు ప్రదర్శనను నిశితంగా పరిశీలిస్తున్న బోర్డు
ఐదో టెస్టులో ఆ టీమిండియా స్టార్ పై వేటు ఖాయం..! గంభీర్ పైనా వేళాడుతున్న కత్తి.. జట్టు ప్రదర్శనను నిశితంగా పరిశీలిస్తున్న బోర్డు
New Year 2025: క్రేజీ అప్డేట్స్, కిర్రాక్ పోస్టర్స్‌... టాలీవుడ్‌లో న్యూ ఇయర్ స్పెషల్స్ ఏమిటో తెల్సా?
క్రేజీ అప్డేట్స్, కిర్రాక్ పోస్టర్స్‌... టాలీవుడ్‌లో న్యూ ఇయర్ స్పెషల్స్ ఏమిటో తెల్సా?
US Terror Attack: న్యూ ఇయర్ వేడుకల్లో ఉగ్రదాడి- జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు -  12 మంది మృతి
న్యూ ఇయర్ వేడుకల్లో ఉగ్రదాడి- జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు - 12 మంది మృతి
Embed widget