అన్వేషించండి

Dharmana Comments: చంద్రబాబు మంచి ముఖ్యమంత్రే, నో డౌట్ - ప్రతిపక్ష నేతపై డిప్యూటీ సీఎం పొగడ్తలు

Srikakulam: కొత్త జిల్లాలపై శ్రీకాకుళం జిల్లాలో సోమవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన, స్పీకర్ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు

Dharmana Krishna Das: ఏపీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశంసించారు. చంద్రబాబు విజ్ఞత కలిగిన ముఖ్యమంత్రి అంటూ వ్యాఖ్యలు చేశారు. పద్నాలుగు ఏళ్ల పాటు ఆయన ఈ రాష్ట్రాన్ని విజ్ఞతతో పరిపాలించారని అన్నారు. చంద్రబాబు ప్రస్తుతం ప్రతిపక్షంగా ఉన్నందున తమ ప్రభుత్వానికి సలహాలు ఇచ్చి సహకరించాలని కోరారు. కొత్త జిల్లాలపై శ్రీకాకుళం జిల్లాలో సోమవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన, స్పీకర్ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రతిపక్ష నాయకులు చేస్తున్న విమర్శల గురించి ధర్మాన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

విద్యుత్ చార్జీల పెంపుపై ధర్మాన మాట్లాడుతూ.. కరెంటు రేట్లు నామినల్‌గా పెంచితే టీడీపీ నాయకులు దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారని అన్నారు. వారు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. కనీసం వారు అసెంబ్లీకి హాజరు కాకుండా వచ్చిన కాసేపు కూడా చిడతలు వాయించుకుంటూ కూర్చుంటున్నారని ఎద్దేవా చేశారు. ‘‘ప్రతిపక్షం పాలక పక్షం ఒక బండికి రెండు చక్రాల్లాటివి. ఆ రెండిట్లో ఒక చక్రం లేకపోయినా బండి సాఫీగా నడవదు. నో డౌట్ చంద్రబాబు గారు విజ్ఞత కలిగిన ముఖ్యమంత్రి నేనేం కాదనట్లేదు. 14 ఏళ్లు ఆ ఆరోజులకు తగ్గట్లుగా ఆయన పాలించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మకమైన పరిపాలన చేస్తుంటే దాన్ని అభినందించలేకపోతున్నారు. ప్రతిపక్షాలు ఇలా ఆలోచన లేని మాటలు మాట్లాడి ప్రజల ముందు చులకన అవుతున్నారు. మూడేళ్ల నుంచి బ్రహ్మాండమైన ఫలితాలను ప్రజలు ఇస్తున్నారు. జగన్ గారి పాలన ప్రజలకు మేలు చేకూర్చేది.’’ అంటూ మాట్లాడారు.

ఉప ముఖ్యమంత్రి ధర్మాన కాస్త చర్చనీయాంశ రీతిలో వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో కూడా విజయం సాధించి రెండోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని, ఒకవేళ ఓడిపోతే తన ఆస్తి మొత్తం రాసిచ్చేస్తానంటూ సవాలు విసిరారు. గత మార్చిలో 19వ తేదీన శ్రీకాకుళం జిల్లా పోలాకి, చెల్లాయి వలసలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కాకపోతే తన ఆస్తులన్నీ తెలుగు దేశం పార్టీకి రాసిచ్చేస్తానని సవాల్ విసిరారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన నభూతో న భవిష్యతి అని అభివర్ణించారు.

నాలుగు సార్లు ఎమ్మెల్యేగా
2019 ఎన్నికల్లో ధర్మాన కృష్ణదాస్ నాలుగోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన ఈయన వైసీపీ స్థాపించినప్పుడు సీఎం జగన్ వెనక్కి వచ్చారు. ఆ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో తన సోదరుడు ధర్మాన ప్రసాదరావు మంత్రిగా ఉన్నా కూడా కృష్ణదాస్ మాత్రం కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిపోయారు. ఈ క్రమంలోనే 2012లో జరిగిన ఉప ఎన్నికలో వైసీపీ తరఫున ధర్మాన కృష్ణదాస్ పోటీ చేసి గెలుపొందారు. అనంతరం 2014 ఎన్నికల్లో ధర్మాన సోదరులిద్దరూ ఓడిపోయారు. 2019లో ధర్మాన సోదరులిద్దరూ వైసీపీ నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలుపొందారు.

ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తన మంత్రివర్గంలో సీఎం జగన్ ధర్మానకు పెద్ద పీట వేశారు. ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. త్వరలోనే మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించనున్నట్లు సీఎం జగన్ ప్రకటించిన వేళ ధర్మాన కృష్ణదాస్‌ తన పదవి కోల్పోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

తెలంగాణ పంచాయతీ ఎన్నికల సమరం: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రత్యేక వ్యూహాలు..గ్రామాల్లో విజయం ఎవరిదో?
తెలంగాణ పంచాయతీ ఎన్నికల సమరం: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రత్యేక వ్యూహాలు..గ్రామాల్లో విజయం ఎవరిదో?
Vaikunta Dwara Darshan Tokens Registration: తిరుమలేశుడి భక్తులకు గుడ్ న్యూస్- వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం 
తిరుమలేశుడి భక్తులకు గుడ్ న్యూస్- వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం 
US Shooting: వైట్ హౌస్ దగ్గర ఆప్ఘన్‌ యువకుడి కాల్పులు! ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులకు గాయాలు!
వైట్ హౌస్ దగ్గర ఆప్ఘన్‌ యువకుడి కాల్పులు! ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులకు గాయాలు!
Andhra King Taluka OTT : రామ్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్ - ఎందులో చూడొచ్చంటే?
రామ్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్ - ఎందులో చూడొచ్చంటే?
Advertisement

వీడియోలు

South Africa whitewashed India | రెండో టెస్ట్ ఓడిపోయిన టీమ్ ఇండియా
Iceland Cricket Tweet on Gautam Gambhir | గంభీర్‌ను ట్రోల్ చేసిన ఐస్‌లాండ్ క్రికెట్
Ashwin Tweet on Ind vs SA Test Match | వైరల్ అవుతున్న అశ్విన్ పోస్ట్
Rohit as ambassador of T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్‌ 2026 అంబాసిడర్‌గా రోహిత్
India vs South Africa Test Highlights | విజ‌యం దిశ‌గా సౌతాఫ్రికా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ పంచాయతీ ఎన్నికల సమరం: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రత్యేక వ్యూహాలు..గ్రామాల్లో విజయం ఎవరిదో?
తెలంగాణ పంచాయతీ ఎన్నికల సమరం: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రత్యేక వ్యూహాలు..గ్రామాల్లో విజయం ఎవరిదో?
Vaikunta Dwara Darshan Tokens Registration: తిరుమలేశుడి భక్తులకు గుడ్ న్యూస్- వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం 
తిరుమలేశుడి భక్తులకు గుడ్ న్యూస్- వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం 
US Shooting: వైట్ హౌస్ దగ్గర ఆప్ఘన్‌ యువకుడి కాల్పులు! ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులకు గాయాలు!
వైట్ హౌస్ దగ్గర ఆప్ఘన్‌ యువకుడి కాల్పులు! ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులకు గాయాలు!
Andhra King Taluka OTT : రామ్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్ - ఎందులో చూడొచ్చంటే?
రామ్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్ - ఎందులో చూడొచ్చంటే?
South Central Railway : ఇంటి నుంచే దేశం నలుమూలలకు పార్శిల్ పంపేయొచ్చు- కొత్త సర్వీస్ ప్రారంభించనున్న దక్షిణ మధ్య రైల్వే
ఇంటి నుంచే దేశం నలుమూలలకు పార్శిల్ పంపేయొచ్చు- కొత్త సర్వీస్ ప్రారంభించనున్న దక్షిణ మధ్య రైల్వే
India Wedding Season: 44 రోజుల్లో 46 లక్షల వివాహాలు... ఎక్కువ పెళ్లిళ్లు ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయో తెలుసా?
44 రోజుల్లో 46 లక్షల వివాహాలు... ఎక్కువ పెళ్లిళ్లు ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయో తెలుసా?
Raju Weds Rambai : హార్ట్ టచింగ్ 'రాజు వెడ్స్ రాంబాయి' - ఈ థియేటర్లలో ఫ్రీగా చూడొచ్చు
హార్ట్ టచింగ్ 'రాజు వెడ్స్ రాంబాయి' - ఈ థియేటర్లలో ఫ్రీగా చూడొచ్చు
Obesity Warning Signs : ఊబకాయం హెచ్చరిక సంకేతాలు.. బరువు పెరగడం నుంచి నిద్రలేమి వరకు.. జాగ్రత్త!
ఊబకాయం హెచ్చరిక సంకేతాలు.. బరువు పెరగడం నుంచి నిద్రలేమి వరకు.. జాగ్రత్త!
Embed widget