అన్వేషించండి

Cm Jagan Delhi Tour: రేపు సీఎం జగన్ దిల్లీ పర్యటన... ప్రధాని మోదీతో భేటీ

ఏపీ సీఎం జగన్ రేపు దిల్లీలో పర్యటించనున్నారు. దిల్లీ పర్యటనలో సీఎం జగన్ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు.

సీఎం జగన్ మోహన్ రెడ్డి రేపు దిల్లీ వెళ్లనున్నారు. దిల్లీ పర్యనటలో సీఎం జగన్ ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. మూడు రాజధానులు, అమరావతి అభివృద్ధి కార్యాచరణ, తెలుగు రాష్ట్రాల జలవివాదాలు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు రాబట్టే అంశాలపై ప్రధానితో చర్చించే అవకాశం ఉంది. విభజన హామీలు నేరవేర్చాలని సీఎం జగన్‌ ప్రధానిని కోరనున్నట్లు సమాచారం. రాష్ట్ర సమస్యలపై ప్రధాని మోదీకి వినతిపత్రం ఇవ్వనున్నారు. ప్రధానితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సహా పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నట్లు తెలుస్తోంది. 

Also Read: ఏపీ టికెట్ల వివాదంపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు... ఒకరిద్దరు హీరోలను తొక్కేయడానికో ఏమో...!... ధరలు తగ్గింపుపై లాజిక్ ఏమిటని ప్రశ్న

అమరావతిపై ప్రధాని మోదీతో చర్చ

పోలవరం, తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు, విభజన హామీలతో పాటు మరికొన్ని కీలకాంశాలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ చర్చించనున్నారు. ఇప్పటికే వారిద్దరి అపాయింట్ మెంట్ ను సీఎం జగన్ తీసుకున్నారని సమాచారం. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన సవరించిన వ్యయ అంచనాలు, ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. మూడేళ్లుగా ఈ అంశంపై కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్నా సానుకూల నిర్ణయం మాత్రం రాలేదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ పర్యటనలో ఈ విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. రాష్ట్రంలో మూడు రాజధానులు, అమరావతి భవిష్యత్ పై ప్రధానితో సీఎం జగన్ చర్చించనున్నారు. 

Also Read:  సినిమా టికెట్ల విషయంలో ప్రభుత్వ జోక్యం తగదు.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తాం 

ముందస్తు ఎన్నికలపై చర్చించడానికేనా..!

ఈ పర్యటనలో ముందస్తు ఎన్నికలపై కేంద్రం పెద్దలతో సీఎం జగన్ చర్చించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై ఇటీవల హడావుడి మొదలైంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఈ వాదనకు మరింత బలం చేకూరుస్తున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ సర్కార్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షానే  అన్నారు.  ఈ సమయంలో సీఎం జగన్ దిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. బయటకు విభజన సమస్యలు, పెండింగ్ నిధులపై చర్చించేందుకు వెళ్తున్నారని చెబుతున్నా ముందస్తు ఎన్నికలపై చర్చించేందుకు అని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. 

Also Read:  తిరుమల దర్శనానికి పదిరోజులపాటు ఎలాంటి సిఫార్సు లేఖలు తీసుకోం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijaya brand controversy: విజయ బ్రాండ్ పేరుతో కల్తీ నెయ్యి, పాలు - ఏపీ లింక్ - గుత్తా అమిత్ సంచలన వ్యాఖ్యలు
విజయ బ్రాండ్ పేరుతో కల్తీ నెయ్యి, పాలు - ఏపీ లింక్ - గుత్తా అమిత్ సంచలన వ్యాఖ్యలు
Raisina Dialogue Chandrababu: నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
YS Sharmila: 25 వేల బోడి ప్రోత్సాహకం కోసం మూడో బిడ్డను కనాలనడం ప్రజలను ఎగతాళి చేయడమే - చంద్రబాబుపై షర్మిల విమర్శలు
25 వేల బోడి ప్రోత్సాహకం కోసం మూడో బిడ్డను కనాలనడం ప్రజలను ఎగతాళి చేయడమే - చంద్రబాబుపై షర్మిల విమర్శలు
Sri Ramanavami Brahmotsavams: మార్చి 26 నుంచి ఏప్రిల్ 05 వరకు ఒంటిమిట్ట‌ శ్రీ కోదండ‌రామ‌స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు!
మార్చి 26 నుంచి ఏప్రిల్ 05 వరకు ఒంటిమిట్ట‌ శ్రీ కోదండ‌రామ‌స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు!

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Vijay Super Six: తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
Iran ship: భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
Secunderabad Railway Stations: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
Vijay Deverakonda: బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
Maoists surrender in Hyderabad: జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
Hyderabad to Kanyakumari Amrit Bharat Express : హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
Rapappa Song: అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
Raisina Dialogue Chandrababu: నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
Embed widget