అన్వేషించండి

AP CM Jagan 3 Years of Ruling: మూడేళ్ల పాలన పూర్తి చేసుకున్న జగన్ ముందస్తు ఎన్నికలకు సిద్ధమేనా ! చంద్రబాబు కల నెరవేరుతుందా ?

AP CM Jagan 3 Years of Ruling: ఏపీ సీఎం జగన్ కి ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తెలిసిపోయిందని, ఇంకా వేచి చూస్తే ఆ వ్యతిరేకత మరింత పెరిగే అవకాశముందని, అందుకే ముందస్తుకు వెళ్తారని చంద్రబాబు అంటున్నారు.

AP CM Jagan 3 Years of Ruling: వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చి నెలలు గడవకముందే.. ఏపీ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలంటూ సవాల్ విసిరారు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. అప్పటినుంచి ఆయన అవకాశం వచ్చిన ప్రతిసారీ ఎన్నికలకు వెళ్దాం దమ్ముంటే రండి అంటూ సవాళ్లు విసురుతూనే ఉన్నారు. అమరావతి రెఫరెండం పెడతామంటారు, ఏపీలో అభివృద్ధిని రెఫరెండంగా పెట్టాలంటారు.. ఇలా రకరకాలుగా ప్రతిపక్షనేత చంద్రబాబు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అయితే స్థానిక ఎన్నికల్లో మాత్రం టీడీపీ తమ సత్తా చూపించలేకపోయింది. అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేసిన చంద్రబాబు.. స్థానిక ఎన్నికల్లో తమ పార్టీ ఓటమికి మాత్రం సరైన కారణంలా చెప్పుకోలేకపోతున్నారు. ఆ సంగతి పక్కనపెడితే ఇప్పుడు ఏపీలో ముందస్తు ఎన్నికలంటూ చంద్రబాబు మరోసారి జోస్యం చెబుతున్నారు. 

వ్యతిరేఖత పెరిగే అవకాశం.. 
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తెలిసిపోయిందని, ఇంకా ఎక్కువ రోజులు వేచి చూస్తే ఆ వ్యతిరేకత మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు చంద్రబాబు. అందుకే ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్తారని, తమ్ముళ్లూ సిద్ధంగా ఉండండి.. అంటూ దిశా నిర్దేశం చేస్తున్నారు. రాష్ట్ర మంత్రులు, వైసీపీ నేతలు మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నారు. ప్రజలు తమకు సంపూర్ణ మెజార్టీ ఇచ్చారని, ఐదేళ్లు పాలించాలని చెప్పారని, అలాంటిది తామెందుకు ముందస్తు ఎన్నికలకు వెళ్తామని గతంలో ప్రశ్నించారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ తర్వాత ఆయనే మరో సందర్భంలో.. ముందస్తు ఎన్నికల ప్రస్తావనను పూర్తిగా ఖండించలేకపోయారు. దీంతో వైసీపీ క్యాడర్ లో కూడా కొంత గందరగోళం నెలకొంది. 

ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లాలి..?
2014లో ఉమ్మడి ఏపీలో చివరిసారిగా ఎన్నికలు జరిగాయి. ఏపీ, తెలంగాణలో వేర్వేరుగా ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఏపీలో టీడీపీకి, తెలంగాణలో టీఆర్ఎస్ కి పూర్తి మెజార్టీ ఉంది. ఆ తర్వాత రెండు రాష్ట్రాలకు 2019లో ఎన్నికలు జరగాలి. కానీ తెలంగాణలో కేసీఆర్ ముందుగానే ఎన్నికలకు వెళ్లారు. 2018లోనే ప్రజా తీర్పు కోరారు. ప్రతి పనికి ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని, తమకి సంపూర్ణ మద్దితివ్వాలని కోరారు. ఆ పిలుపు మేరకు ప్రజలు కేసీఆర్ కి మెజార్టీ పెంచారు. ఆ తర్వాత కాంగ్రెస్ తరపున గెలిచిన వారు కూడా టీఆర్ఎస్ లోకి ఫిరాయించారనుకోండి. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏపీలో ఉందా అంటే అనుమానమే. ప్రస్తుతం ఏపీలో 151 సీట్ల భారీ మెజార్టీతో ఉంది వైసీపీ. ఇప్పటికే నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు, ఒక జనసేన ఎమ్మెల్యే వైసీపీ వైపుకి వచ్చేశారు. అంటే ఆ పార్టీ బలం 156కి పెరిగింది. తమ పార్టీలో చేరాలంటే ఇతర పార్టీ ఎమ్మెల్యేలు పదవికి రాజీనామా చేయాలనే కండిషన్ ని జగన్ ఎత్తేస్తే.. మరికొంతమంది టీడీపీ నుంచి వైసీపీలోకి వస్తారనే అంచనా కూడా ఉంది. ఇలాంటి సందర్భంలో జగన్ ముందస్తుకి ఎందుకు వెళ్లాలి..?

ముందస్తుకి వెళ్తే ఎవరికి లాభం..?
ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా జగనే సీఎం అవుతారని సర్వేలు చెబుతున్నాయి. ఈమేరకు వైసీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియాలో కూడా పలు కథనాలు వస్తున్నాయి. పోనీ కొంతకాలం వేచి చూసినా కూడా వైసీపీపై వ్యతిరేకత పెరిగే అవకాశం లేదు. అసలు సంక్షేమ పథకాలు సరిగ్గా అమలైనంత కాలం ఏపీకి ఎంత అప్పు ఉంది, ప్రజలపై అప్పుల భారం ఎంత పెరిగింది అనేది ఎవరూ ఆలోచించట్లేదు. బ్యాంక్ అకౌంట్లలో నగదు జమ అయిందా లేదా అనేదే ఆలోచిస్తున్నారు. సో.. ఇలాంటి సమయంలో జగన్ ముందస్తుకి వెళ్లాల్సిన అవసరమే లేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకవేళ.. జగన్ ముందస్తుకి వెళ్తే అది పెద్ద సాహసమేనని చెప్పాలి. ప్రజలు పూర్తి మద్దతు ఇస్తే, ప్రజా ధనాన్ని వృధా చేస్తూ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారనే అపవాదు ఆయన్ను చుట్టుముట్టే అవకాశముంది. దాదాపుగా జగన్ ముందస్తుకి వెళ్లరు, చంద్రబాబు ఆశలు నెరవేరవు. 

Also Read: 3 Years of YSRCP Rule: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 175 సీట్లు సాధ్యమా ? నిజంగానే క్లీన్‌స్వీప్ చేసే ఛాన్స్ ఉందా ! 

Also Read: 3 Years of YSR Congress Party Rule : మూడేళ్ల పాలన తర్వాత వైఎస్ఆర్‌సీపీ గ్రాఫ్ పెరిగిందా ? తగ్గిందా ?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget