అన్వేషించండి

Chandrababu: ఢిల్లీలో బిజీబిజీగా చంద్రబాబు - ఏపీకి నిధులు ఇవ్వాలని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులకు రిక్వెస్ట్

Andhra Pradesh News | ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు శనివారం నాడు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. పోలవరం, అమరావతి సహా పలు అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వాలని కోరారు.

AP CM Chandrababu meets PM Modi | న్యూఢిల్లీ: దేశ రాజధానిలో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శనివారం నాడు బిజీబిజీగా గడిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సహాలు పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ అయ్యారు. మొదట కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో చంద్రబాబు సమావేశమై, రాష్ట్రంలో కొత్త ఎయిర్ పోర్టుల ఏర్పాటుపై సమీక్షించారు.

రాష్ట్రానికి నిధులపై కేంద్రం పెద్దలతో వరుస భేటీలు

అనంతరం ప్రధాని మోదీతో భేటీ అయిన చంద్రబాబు.. పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని, రాజధాని అమరావతి అభివృద్ధికి కేంద్రం నుంచి నిధుల రావాల్సిన నిధుల అవసరాన్ని ప్రస్తావించారు. అనంతరం కేంద్ర మంత్రి అమిత్ షాతో గంటన్నరపాటు సమావేశం కాగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం చర్చల్లో పాల్గొన్నారు. అమిత్ షా, నడ్డాతో భేటీలో ఏపీ రాజకీయాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో జరిగిన చంద్రబాబు భేటీలో ఉక్కు శాఖ మంత్రి కుమార స్వామి పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై చర్చించినట్లు సమాచారం. 

ప్రధాని మోదీతో భేటీలో భాగంగా.. ఏపీ పునర్నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తోడ్పాటు అందించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి నిర్మాణం, ఏపీ విభజన హామీలు, వెనుకబడిన జిల్లాలకు నిధులతో పాటు, ఇతర ప్రాజెక్టుల నిర్మాణానికి త్వరగా నిధులు అందేలా చూడాలని ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

ఏపీ ఆర్థిక పరిస్థితిపై కేంద్రానికి వివరించిన చంద్రబాబు

గత ఐదేళ్లలో ఏపీలో ఆర్థిక విధ్వంసం జరిగి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత ఘోరంగా మారిందని కేంద్రం పెద్దలకు చంద్రబాబు వివరించారు. ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టాలన్నా, అభివృద్ధి పనులు కొనసాగాలన్నా నిధుల రూపంలో ఏపీకి కేంద్ర సాయం అవసరమని చంద్రబాబు పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమిలో టీడీపీ కీలక పాత్ర పోషిస్తోంది. బీజేపీకి సొంతంగా పూర్తి మెజార్టీ లేకపోవడంతో ఎన్డీయేలో బిహార్ నితీష్ కుమార్ కు పార్టీ జేడీయూ, ఏపీకి చెందిన టీడీపీ మద్దతు కీలకమని తెలిసిందే. దాంతో ఏపీ, బిహార్ నేతల డిమాంట్లపై ఆలోచించిన కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి కేంద్ర బడ్జెట్ లో ఈ రెండు రాష్ట్రాలకు ఆర్థిక సాయం విషయాల్ని గుర్తించి నిధులు కేటాయించారు. సాధ్యమైనంత త్వరగా నిధులు విడుదల చేస్తే ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు రాజధాని నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

Also Read: Andhra Pradesh: ఏపీలో మరో 7 విమానాశ్రయాలు, 2026 జూన్ నాటికి భోగాపురం ఎయిర్ పోర్ట్ పూర్తి: రామ్మోహన్‌ నాయుడు

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

తెలంగాణ పంచాయతీ ఎన్నికల సమరం: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రత్యేక వ్యూహాలు..గ్రామాల్లో విజయం ఎవరిదో?
తెలంగాణ పంచాయతీ ఎన్నికల సమరం: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రత్యేక వ్యూహాలు..గ్రామాల్లో విజయం ఎవరిదో?
Vaikunta Dwara Darshan Tokens Registration: తిరుమలేశుడి భక్తులకు గుడ్ న్యూస్- వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం 
తిరుమలేశుడి భక్తులకు గుడ్ న్యూస్- వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం 
US Shooting: వైట్ హౌస్ దగ్గర ఆప్ఘన్‌ యువకుడి కాల్పులు! ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులకు గాయాలు!
వైట్ హౌస్ దగ్గర ఆప్ఘన్‌ యువకుడి కాల్పులు! ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులకు గాయాలు!
Andhra King Taluka OTT : రామ్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్ - ఎందులో చూడొచ్చంటే?
రామ్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్ - ఎందులో చూడొచ్చంటే?
Advertisement

వీడియోలు

Gambhir Comments on Head Coach Position | గంభీర్ సెన్సేషనల్ స్టేట్‌మెంట్
World Test Championship Points Table | టెస్టు ఛాంపియన్‌షిప్ లో భారత్ స్థానం ఇదే
Reason for Team India Failure | భారత్ ఓటమికి కారణాలు ఇవే !
Rohit Sharma First Place in ICC ODI Rankings | అగ్రస్థానంలో
South Africa whitewashed India | రెండో టెస్ట్ ఓడిపోయిన టీమ్ ఇండియా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ పంచాయతీ ఎన్నికల సమరం: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రత్యేక వ్యూహాలు..గ్రామాల్లో విజయం ఎవరిదో?
తెలంగాణ పంచాయతీ ఎన్నికల సమరం: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రత్యేక వ్యూహాలు..గ్రామాల్లో విజయం ఎవరిదో?
Vaikunta Dwara Darshan Tokens Registration: తిరుమలేశుడి భక్తులకు గుడ్ న్యూస్- వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం 
తిరుమలేశుడి భక్తులకు గుడ్ న్యూస్- వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం 
US Shooting: వైట్ హౌస్ దగ్గర ఆప్ఘన్‌ యువకుడి కాల్పులు! ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులకు గాయాలు!
వైట్ హౌస్ దగ్గర ఆప్ఘన్‌ యువకుడి కాల్పులు! ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులకు గాయాలు!
Andhra King Taluka OTT : రామ్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్ - ఎందులో చూడొచ్చంటే?
రామ్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్ - ఎందులో చూడొచ్చంటే?
Smriti Mandhana–Palash Muchhal Wedding Row: స్మృతి మంధాన పెళ్లిపై మేరీ డి'కోస్టా సంచలన పోస్టు! పలాష్ ముచ్చల్‌తో సంబంధంపై క్లారిటీ!
స్మృతి మంధాన పెళ్లిపై మేరీ డి'కోస్టా సంచలన పోస్టు! పలాష్ ముచ్చల్‌తో సంబంధంపై క్లారిటీ!
South Central Railway : ఇంటి నుంచే దేశం నలుమూలలకు పార్శిల్ పంపేయొచ్చు- కొత్త సర్వీస్ ప్రారంభించనున్న దక్షిణ మధ్య రైల్వే
ఇంటి నుంచే దేశం నలుమూలలకు పార్శిల్ పంపేయొచ్చు- కొత్త సర్వీస్ ప్రారంభించనున్న దక్షిణ మధ్య రైల్వే
India Wedding Season: 44 రోజుల్లో 46 లక్షల వివాహాలు... ఎక్కువ పెళ్లిళ్లు ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయో తెలుసా?
44 రోజుల్లో 46 లక్షల వివాహాలు... ఎక్కువ పెళ్లిళ్లు ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయో తెలుసా?
Raju Weds Rambai : హార్ట్ టచింగ్ 'రాజు వెడ్స్ రాంబాయి' - ఈ థియేటర్లలో ఫ్రీగా చూడొచ్చు
హార్ట్ టచింగ్ 'రాజు వెడ్స్ రాంబాయి' - ఈ థియేటర్లలో ఫ్రీగా చూడొచ్చు
Embed widget