అన్వేషించండి

AP New Cabinet: త్వరలో ఏపీ మంత్రివర్గంలో భారీ మార్పులు.. మంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు

ఏపీ మంత్రి వర్గం మార్పులపై మంత్రి బాలినేని శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో మంత్రి వర్గంలో భారీ మార్పులుంటాయన్నారు.

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం మారనుందా.. కొత్త వాళ్లకి ఛాన్స్ రానుందా అంటే అవుననే చెప్తున్నారు మంత్రి బాలినేని. ఏపీలో త్వరలో భారీ మార్పులు జరుగుతాయని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంత్రి వర్గంలో వందశాతం కొత్తవారిని తీసుకుంటామని సీఎం జగన్ చెప్పారని ఆయన అన్నారు. విధాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని సీఎంకు స్పష్టం చేశామని బాలినేని అన్నారు. మంత్రి పదవి పోయినా తాను భయపడనన్నారు. తనకు పార్టీ ముఖ్యం కానీ పదవులు కాదని పేర్కొన్నారు. 

Also Read: 13 జిల్లాల జడ్పీ ఛైర్మన్లు వీరే... కొనసాగుతున్న ప్రమాణ స్వీకారాలు...

మంత్రి పదవి పోయినా భయపడను

రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులపై మంత్రి బాలినేని శ్రీనివాస్​రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే భారీ మార్పులుంటాయన్నారు. మంత్రివర్గంలో వంద శాతం కొత్తవారే ఉంటారని సీఎం చెప్పారని వెల్లడించారు. విధాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని సీఎం జగన్ కు స్పష్టం చేశానన్నారు. మంత్రివర్గాన్ని వంద శాతం మారుస్తానని సీఎం జగన్ గతంలోనే చెప్పారని మంత్రి బాలినేని అన్నారు. మంత్రి వర్గాన్ని వంద శాతం మారిస్తే మంచిదేనని సీఎంకు తన అభిప్రాయాన్ని తెలిపానన్నారు. తనను కూడా మార్చాలని చెప్పానని బాలినేని అన్నారు. మంత్రి పదవి పోయినా తాను భయపడనని తెలిపారు. తనకు పార్టీయే ముఖ్యమని, పదవులు కాదని మంత్రి బాలినేని స్పష్టం చేశారు. 

Also Read: ప్రాంతీయ పార్టీగా గుర్తింపు తెచ్చుకోలేకపోయిన జనసేన ! ఇక గాజు గ్లాస్ గుర్తు ఉండదా ?

ముందుగానే చెప్పిన సీఎం జగన్

రెండున్నరేళ్ల తరువాత మంత్రివర్గాన్ని విస్తరించి కొత్తవారికి స్థానం కల్పిస్తానని సీఎం జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయకముందే స్పష్టం చేశారు. ఆ సమయం దగ్గర పడిందనే చర్చ కూడా ఇప్పుడు వినిపిస్తోంది. తన మంత్రివర్గంలో ఎవరిని తొలగించి ఎవరిని తీసుకోవాలనే దానిపై సీఎం జగన్ కసరత్తు కూడా మొదలుపెట్టారని సమాచారం వినిపిస్తుంది. అయితే తాజాగా సీఎం జగన్‌కు బదులుగా పీకే టీమ్ ఆ పని చేస్తుందనే ప్రచారం వినిపిస్తుంది. మంత్రి వర్గం నుంచి ఎవరిని తప్పించాలి, కొత్తగా ఎవరిని తీసుకోవాలనే దానిపై సీఎం జగన్ సామాజిక లెక్కలతో పాటు అభ్యర్థి సానుకూలతలను బేరీజు వేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త మంత్రి వర్గంపై సీఎం జగన్ ఇంటలిజెన్స్ ఇంతకు ముందు పలు సర్వేల సహకారం తీసుకోవాలని భావించారు. కానీ ఇప్పుడు పీకే టీమ్ ఇచ్చే నివేదికల ఆధారంగానే కొత్తగా కేబినెట్‌లోకి ఎవరిని తీసుకోవాలనే దానిపై ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

Also Read: తగ్గని కోవిడ్ వ్యాప్తి... ఏపీలో కొత్తగా 1167 కేసులు, ఏడు మరణాలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR Re Entry: కేసీఆర్ రీ ఎంట్రీకి ఫిబ్రవరి 19న ముహుర్తం - తెలంగాణ భవన్‌లో కీలక సమావేశం - ఇక సమరమే !
కేసీఆర్ రీ ఎంట్రీకి ఫిబ్రవరి 19న ముహుర్తం - తెలంగాణ భవన్‌లో కీలక సమావేశం - ఇక సమరమే !
Andhra Pradeh BirdFlu: బర్డ్ ఫ్లూ భయం లేదు - ఉడికించిన గుడ్లు, చికెన్ తినొచ్చు - ఏపీ సర్కార్ కీలక ప్రకటన
బర్డ్ ఫ్లూ భయం లేదు - ఉడికించిన గుడ్లు, చికెన్ తినొచ్చు - ఏపీ సర్కార్ కీలక ప్రకటన
Manipur: మణిపూర్ లో రాష్ట్రపతి పాలన - సీఎం రాజీనామాతో కేంద్రం నిర్ణయం
మణిపూర్ లో రాష్ట్రపతి పాలన - సీఎం రాజీనామాతో కేంద్రం నిర్ణయం
Google And Microsoft AI Centers In Hyderabad : తెలంగాణలో ఒకే రోజు రెండు కీలక ఒప్పందాలు- గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ ఏఐ కేంద్రాల ఏర్పాటుకు ఎంవోయు
తెలంగాణలో ఒకే రోజు రెండు కీలక ఒప్పందాలు- గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ ఏఐ కేంద్రాల ఏర్పాటుకు ఎంవోయు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rajat Patidar RCB New Captain IPL 2025 | కొత్త కెప్టెన్ ను ప్రకటించిన ఆర్సీబీ | ABP DesamBird Flu in East Godavari Poultry | పెరవలి మండలంలో మృత్యువాత పడుతున్న వేలాది కోళ్లు | ABP DesamPawan kalyan in Kumbakonam Swamimalai Visit | తమిళనాడు ఆలయాలను దర్శించుకుంటున్న డిప్యూటీ సీఎం | ABP DesamEluru Collector Vetriselvi on Bird Flu | కోళ్ల నుంచి బర్డ్ ఫ్లూ మనిషికి వచ్చిందా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR Re Entry: కేసీఆర్ రీ ఎంట్రీకి ఫిబ్రవరి 19న ముహుర్తం - తెలంగాణ భవన్‌లో కీలక సమావేశం - ఇక సమరమే !
కేసీఆర్ రీ ఎంట్రీకి ఫిబ్రవరి 19న ముహుర్తం - తెలంగాణ భవన్‌లో కీలక సమావేశం - ఇక సమరమే !
Andhra Pradeh BirdFlu: బర్డ్ ఫ్లూ భయం లేదు - ఉడికించిన గుడ్లు, చికెన్ తినొచ్చు - ఏపీ సర్కార్ కీలక ప్రకటన
బర్డ్ ఫ్లూ భయం లేదు - ఉడికించిన గుడ్లు, చికెన్ తినొచ్చు - ఏపీ సర్కార్ కీలక ప్రకటన
Manipur: మణిపూర్ లో రాష్ట్రపతి పాలన - సీఎం రాజీనామాతో కేంద్రం నిర్ణయం
మణిపూర్ లో రాష్ట్రపతి పాలన - సీఎం రాజీనామాతో కేంద్రం నిర్ణయం
Google And Microsoft AI Centers In Hyderabad : తెలంగాణలో ఒకే రోజు రెండు కీలక ఒప్పందాలు- గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ ఏఐ కేంద్రాల ఏర్పాటుకు ఎంవోయు
తెలంగాణలో ఒకే రోజు రెండు కీలక ఒప్పందాలు- గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ ఏఐ కేంద్రాల ఏర్పాటుకు ఎంవోయు
30 Years PrudhviRaj: 'డోంట్ బాయ్ కాట్.. వెల్ కమ్ టు 'లైలా' - క్షమాపణలు చెప్పిన నటుడు పృథ్వీ, కాంట్రవర్సీకి ఎండ్ కార్డ్ పడుతుందా?
'డోంట్ బాయ్ కాట్.. వెల్ కమ్ టు 'లైలా' - క్షమాపణలు చెప్పిన నటుడు పృథ్వీ, కాంట్రవర్సీకి ఎండ్ కార్డ్ పడుతుందా?
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి స్టేషన్ బెయిల్ వస్తుందా ? ఆయనపై పెట్టిన కేసులేంటి ?
వల్లభనేని వంశీకి స్టేషన్ బెయిల్ వస్తుందా ? ఆయనపై పెట్టిన కేసులేంటి ?
Telangana News: గేదెపై లోనుకు గేటు జప్తు- ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం
గేదెపై లోనుకు గేటు జప్తు- ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం
Viral news: తాగుబోతు పైగా అప్పుల అప్పారావు - భార్య ఇచ్చిన షాక్‌తో ఒంటరైపోయాడు !
తాగుబోతు పైగా అప్పుల అప్పారావు - భార్య ఇచ్చిన షాక్‌తో ఒంటరైపోయాడు !
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.