అన్వేషించండి

Andhra Cabinet Inside: ఏపీకి అప్పులు, పెట్టుబడులు రాకుండా ఈమెయిల్స్ - చర్యలు తీసుకోవాలని ఏపీ కేబినెట్ నిర్ణయం

AP Cabinet: ఏపీకి అప్పులు పెట్టుబడులు రాకుండా తప్పుడు ఈమెయిల్స్ రాస్తున్న వారిపై కేసులు పెట్టాలని ఏపీ కేబినెట్ లో చర్చించారు. ఏపీ జరుగుతున్న కుట్రలను పయ్యావుల కేశవ్ కేబినెట్ దృష్టికి తీసుకు వచ్చారు.

AP Cabinet: ఆంధ్రప్రదేశ్ కు అప్పులు రాకుండా, పెట్టుబడులు రాకుండా వివిధ సంస్థలకు, వ్యక్తులకు దాదాపుగా రెండు వందల మేర ఫేక్ ఈమెయిల్స్ పంపారని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఏపీ కేబినెట్ దృష్టికి తీసుకు వచ్చారు. ఈ అంశంపై తనకు సమాచారం రావడంతో పంపించిన వ్యక్తి ఎవరో ఆరా తీశానని ఉదయ్ భాస్కర్ అనే జర్మనీలో ఉండే వైసీపీ సానుభూతిపరుడితో ఈ ఫేక్ ఈమెయిల్స్ పంపించారని గుర్తించారు. ఈ అంశంపై చంద్రబాబు స్పందించారు. ఏపీపై కుట్రలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే.. ఈ అంశంపై ప్రజలకు నిజాలు వివరించాలన్నారు.  

జర్మనీలో పని చేసే వ్యక్తి ద్వారా తప్పుడు సమాచారాలతో ఈ మెయిల్                

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ,ఆయన సన్నిహితులు రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకోవడానికి 200కి పైగా ఈ-మెయిల్‌లను బాంబే స్టాక్ మార్కెట్‌లోని పెట్టుబడిదారులకు పంపారని పయ్యావుల కేశవ్ మంగళవారం ప్రెస్ మీట్‌లో ఆరోపించారు. ఈ ఈ-మెయిల్‌లు జర్మనీలోని విప్రోలో పనిచేస్తున్న ఉదయభాస్కర్ అనే వ్యక్తి ద్వారా పంపించారని గుర్తించారు.  ఈ మెయిల్‌లలో ప్రభుత్వ విధానాలు ,  ప్రాజెక్టుల గురించి తప్పుడు సమాచారం ఉందని, ఇది పెట్టుబడిదారులలో భయం ,  గందరగోళం సృష్టించే ఉద్దేశ్యంతో జరిగిందని ఆయన  ఆరోపించారు.          

తప్పుడు ప్రచారంతో రుణాన్ని ఆపలేకపోయిన వైసీపీ నేతలు            

ఈ కుట్రల కారణంగా ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APMDC) ద్వారా రూ. 9,000 కోట్ల నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్స్ (NCDs) జారీ చేసే ప్రయత్నంలో అడ్డంకులు ఏర్పడ్డాయని కేశవ్ ఆరోపించారు. వైసీపీ నాయకులు, ముఖ్యంగా రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI),  సెబీలకు ఫిర్యాదులు చేశారని, అలాగే వైసీపీ నాయకుడు  లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారని  తెలిపారు. ఇలా కోర్టులో పిటిషన్ దాఖలు చేసి అలా వివాదం కోర్టులో ఉందని అందరికీ మెయిల్ చేశారని తెలిపారు.                

తప్పుడు ఈ మెయిల్స్ పెట్టే వారిపై కఠిన చర్యలు                

రాష్ట్రంలో అభివృద్ధి ,  సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకోవడానికి, ప్రజలు తమకు ఓటు వేయనందుకు ప్రతీకారంగా వైసీపీ ఈ చర్యలు చేపట్టిందని కేశవ్ ఆరోపించారు. ఈ చర్యలను దేశద్రోహంగా పరిగణించి, జగన్ , ఆయన సన్నిహితులపై కేసులు నమోదు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరినట్లు ఆయన తెలిపారు. ఈ అడ్డంకులు ఉన్నప్పటికీ, RBI మరియు సెబీలు క్లియరెన్స్ ఇచ్చాయని, పెట్టుబడిదారులు ఆసక్తి చూపడంతో ఓవర్-సబ్‌స్క్రిప్షన్ జరిగిందని కేశవ్ పేర్కొన్నారు.  వైసీపీ ప్రభుత్వం 2024 మార్చిలో రూ. 7,000 కోట్ల రుణాల కోసం జీవో జారీ చేసినప్పటికీ, పెట్టుబడిదారుల విశ్వాసం లేకపోవడంతో ఆ రుణాలు సమకూరలేదని కేశవ్ పేర్కొన్నారు. 

ఈ అంశాన్ని పయ్యావుల కేబినెట్ దృష్టికి తేవడంతో    ఈ-మెయిల్ కుట్రలపై విచారణ జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  ఆదేశించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kondagattu Temple: పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టు ఆలయానికి రూ.35 కోట్లు.. బండి సంజయ్ హర్షం
పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టు ఆలయానికి రూ.35 కోట్లు.. బండి సంజయ్ హర్షం
Hyderabad Crime News: అమ్మాయి ఫొటోతో మెస్సేజ్ చేసి రూ.14 కోట్లు కొట్టేశారు.. నలుగురి అరెస్ట్‌, అతిపెద్ద సైబర్ మోసం
అమ్మాయి ఫొటోతో మెస్సేజ్ చేసి రూ.14 కోట్లు కొట్టేశారు.. నలుగురి అరెస్ట్‌, అతిపెద్ద సైబర్ మోసం
CM Revanth Reddy: పర మతాలను కించపరిస్తే శిక్షించేలా కొత్త చట్టం - సీఎం రేవంత్ రెడ్డి
పర మతాలను కించపరిస్తే శిక్షించేలా కొత్త చట్టం - సీఎం రేవంత్ రెడ్డి
Maa Vande Movie : మోదీ బయోపిక్ 'మా వందే' - పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్
మోదీ బయోపిక్ 'మా వందే' - పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్

వీడియోలు

Sanju Samson For T20 World Cup 2026 | మొత్తానికి చోటు దక్కింది...సంజూ వరల్డ్ కప్పును శాసిస్తాడా | ABP Desam
Ishan Kishan Named T20 World Cup 2026 | రెండేళ్ల తర్వాత టీ20ల్లో ఘనంగా ఇషాన్ కిషన్ పునరాగమనం | ABP Desam
Shubman Gill Left out T20 World Cup 2026 | ఫ్యూచర్ కెప్టెన్ కి వరల్డ్ కప్పులో ఊహించని షాక్ | ABP Desam
T20 World Cup 2026 Team India Squad Announced | ఊహించని ట్విస్టులు షాకులతో టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ | ABP Desam
Tilak Varma Innings Ind vs SA T20 | అహ్మదాబాద్‌లో రెచ్చిపోయిన తిలక్ వర్మ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Temple: పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టు ఆలయానికి రూ.35 కోట్లు.. బండి సంజయ్ హర్షం
పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టు ఆలయానికి రూ.35 కోట్లు.. బండి సంజయ్ హర్షం
Hyderabad Crime News: అమ్మాయి ఫొటోతో మెస్సేజ్ చేసి రూ.14 కోట్లు కొట్టేశారు.. నలుగురి అరెస్ట్‌, అతిపెద్ద సైబర్ మోసం
అమ్మాయి ఫొటోతో మెస్సేజ్ చేసి రూ.14 కోట్లు కొట్టేశారు.. నలుగురి అరెస్ట్‌, అతిపెద్ద సైబర్ మోసం
CM Revanth Reddy: పర మతాలను కించపరిస్తే శిక్షించేలా కొత్త చట్టం - సీఎం రేవంత్ రెడ్డి
పర మతాలను కించపరిస్తే శిక్షించేలా కొత్త చట్టం - సీఎం రేవంత్ రెడ్డి
Maa Vande Movie : మోదీ బయోపిక్ 'మా వందే' - పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్
మోదీ బయోపిక్ 'మా వందే' - పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్
Ishan Kishan Viral Video: టి20 ప్రపంచ కప్‌నకు ఎంపికైన ఇషాన్ కిషన్.. ప్యాకెట్ డైనమైట్ ఫస్ట్ రియాక్షన్ చూశారా
టి20 ప్రపంచ కప్‌నకు ఎంపికైన ఇషాన్ కిషన్.. ప్యాకెట్ డైనమైట్ ఫస్ట్ రియాక్షన్ చూశారా
ఉద్యోగులకు EPFO శుభవార్త.. వారాంతపు సెలవుల్లో బీమా క్లెయిమ్ కట్ అవ్వదు
ఉద్యోగులకు EPFO శుభవార్త.. వారాంతపు సెలవుల్లో బీమా క్లెయిమ్ కట్ అవ్వదు
Tata Punch CNG లేదా Hyundai Exter CNG లలో ఏది బెటర్? రూ. 7 లక్షల్లో ఏ కారు మంచిది
Tata Punch CNG లేదా Hyundai Exter CNG లలో ఏది బెటర్? రూ. 7 లక్షల్లో ఏ కారు మంచిది
Pawan Counter to YS Jagan: అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకలేకపోయావు? ఇప్పుడేం చేస్తావు? జగన్‌కు పవన్ స్ట్రాంగ్ కౌంటర్
అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకలేకపోయావు? ఇప్పుడేం చేస్తావు? జగన్‌కు పవన్ స్ట్రాంగ్ కౌంటర్
Embed widget