Breaking News: రాహుల్ గాంధీని ప్రత్యేకంగా కలిసిన తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 8న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

Background
రష్యాకు చెందిన కొవిడ్-19 వ్యాక్సిన్ ‘స్పుత్నిక్-వి’ తొలిడోసు సరఫరా ప్రారంభించినట్టు డా.రెడ్డీస్ లేబొరేటరీస్ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా తాము ఒప్పందం కుదుర్చుకున్న ఆసుపత్రులకు వీటిని పంపుతున్నట్టు తెలిపింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ స్పుత్నిక్-వి టీకా లభ్యత గురించి తెలుసుకునేందుకు ప్రత్యేకంగా వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చింది.
రాహుల్ గాంధీని ప్రత్యేకంగా కలిసిన తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలు
ఇటీవల నియమితులైన తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ కమిటీ నేతలు ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీని ప్రత్యేకంగా కలిశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్, నూతనంగా నియమితులైన ఇతర పీసీసీ కమిటీ నాయకులు రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు.
రెండు పడవలు ఢీ.. 100 మందికి పైగా గల్లంతు
అసోంలోని బ్రహ్మపుత్ర నదిలో రెండు పడవలు ఢీకొన్నాయి. జోర్హాత్లో నిమతి ఘాట్ వద్ద ప్రయాణికులు ఉన్న పడవలు పరస్పరం ఢీకొన్నాయి. ప్రమాద సమయంలో ఈ రెండు పడవల్లో 100 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. అసోం రాజధాని గౌహతికి 350 కిలో మీటర్ల దూరంలో ఈ విషాద ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో అనేకమంది గల్లంతైనట్టు సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
100 Feared Missing 😢 #Assam #Majuli #Brahmaputra pic.twitter.com/QK3vW6ZH52
— Socialist Panda 🐼 (@ViewsSocialist) September 8, 2021
2 Boats With 120 Passengers Collide In Brahmaputra In #Assam, 20 Missing#AssamBoatCollide pic.twitter.com/Xkj5GUPHET
— Lingaswamy siddala (@SwamyJourno) September 8, 2021





















