అన్వేషించండి

Simhachalam Temple: సింహాచలం దేవస్థానానికి అంతర్జాతీయ గుర్తింపు... ఐఎస్ఓ సర్టిఫికెట్ ను ఈవోకు అందించిన మంత్రి అవంతి

సింహాచలం దేవస్థానానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఆలయానికి చెందిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఐఎస్ఓ సర్టిఫికెట్ అందించింది.

విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. సింహాచలం దేవస్థానానికి ఐఎస్ఓ (ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ ) సర్టిఫికెట్ లభించింది. ఆలయానికి చెందిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఐఎస్ఓ గుర్తింపునిచ్చింది. ఈ సర్టిఫికెట్ ను మంత్రి అవంతి శ్రీనివాస్ దేవస్థానం ఈవో సూర్యకళకు అందజేశారు. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఉద్యోగుల నాణ్యమైన సేవలు, పరిశుభ్రత, పచ్చదనంలాంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ గుర్తింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. భక్తులకు నాణ్యమైన సేవలందిచడంతోపాటు హిందు ధర్మాన్ని, సంస్కృతిని సింహాచలం దేవస్థానం కాపాడుతోందని సర్టిఫికెట్ లో తెలిపారు.

మరో సర్టిఫికెట్ వచ్చే అవకాశం

ఐఎస్ఓ గుర్తింపుపై సింహాచలం ఈవో సూర్యకళ స్పందించారు. ఈ సర్టిఫికేట్ ను మంత్రి అవంతి శ్రీనివాస్ చేతుల మీదుగా అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. గత ఆర్నెళ్ల నుంచి దేవస్థానంలో నాణ్యమైన సేవల గురించి ఆడిటర్ ద్వారా అంతర్జాతీయ సంస్థకు సమాచారం పంపించామని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలను పాటించడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఆహార, భద్రత విషయంలో ఆడిటింగ్ జరుగుతోందని ఆమె తెలిపారు. ఆ విభాగంలోనూ ఐఎస్ఓ సర్టిఫికెట్ వచ్చే అవకాశం ఉందన్నారు.  

 

Also Read: AP Fiber Net: ఏపీ ఫైబర్ నెట్ టెండర్లపై సీఐడీ కేసు... బ్లాక్ లిస్ట్ కంపెనీకి టెండర్లు ఇచ్చారని అభియోగం... నిందితుల జాబితాలో 19 మంది పేర్లు

ప్రసాద్ పథకం ద్వారా రూ.54 కోట్లు మంజూరు

దేవస్థానానికి అంతర్జాతీయ గుర్తింపు రావడం సంతోషంగా ఉందని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఐఎస్ఓ సర్టిఫికెట్ వచ్చేలా కృషి చేసిన దేవస్థానం ఈవో, సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఈ సర్టిఫికేట్ ను నిర్వహణ నైపుణ్యత బట్టి ఇస్తారని పేర్కొన్నారు.  ఈవో, ఉద్యోగులు చాలా కష్టపడి పనిచేసి గుర్తింపు సాధించారని కితాబు ఇచ్చారు. దేవస్థానంలో భక్తులకు మంచి సౌకర్యాలు కల్పిస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ పథకం ద్వారా రూ.54 కోట్లు దేవాలయానికి మంజూరయ్యాయని మంత్రి అన్నారు. వసతి సౌకర్యం, క్యూలైన్ లో వచ్చే భక్తులకు మంచినీరు అందించడంతో పాటు ఇతర సౌకర్యాలు అభివృద్ధి చేయడంపై దృష్టిపెడతామని మంత్రి తెలిపారు. భక్తులకు అన్నదానం సౌకర్యాన్ని కూడా కల్పిస్తే బావుంటుందన్న మంత్రి ఈవో ఈ విషయంపై దృష్టిపెట్టాలని కోరారు. 

Also Read: AP News: రైతు సమస్యలపై టీడీపీ నిరసనలు.. రేపటి నుంచి ‘రైతు కోసం తెలుగుదేశం’

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
BSNL Best Prepaid Plan: జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
BSNL Best Prepaid Plan: జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
Embed widget