అన్వేషించండి

Andhra Pradesh: రాష్ట్రం కన్నా కేంద్రమే ఎక్కువ అప్పులు చేసింది.. బీజేపీది దుష్ప్రచారమే: సజ్జల రామకృష్ణారెడ్డి

ఏపీ సీఎం జగన్ ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తోందని బీజేపీ అంటే…కేంద్రం అప్పులతో పోలిస్తే… రాష్ట్రం చేసిన అప్పులు చాలా తక్కువని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

ప్రజల జేబుల్లో డబ్బులుంటేనే వారి కొనుగోలు శక్తి పెరుగుతుందని, తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి లబ్ధిదారుల ఖాతాల్లో లక్ష కోట్ల రూపాయలకు పైగా జమచేశారన్నారు. తెచ్చే ప్రతి పైసా అప్పునూ సద్వినియోగం చేస్తున్నామని చెప్పారు. వివిధ సంక్షేమ పథకాలను పార్టీలకతీతంగా అర్హులందరికీ అందిస్తున్నారని తెలిపారు. జగన్‌ అనుసరించే మత విశ్వాసాన్ని  ఆధారంగా చేసుకుని దుష్ప్రచారం చేసేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ వ్యవహారాలు, పార్టీ వ్యవహారాలు, నాయకుల ట్రీట్‌మెంట్లో గానీ ఎక్కడా కుల, మత ప్రభావాలు కనిపించవని స్పష్టం చేశారు. అలాంటప్పుడు పనిగట్టుకుని చేస్తున్న బీజేపీ దుష్ప్రచారాన్ని అందరూ కలసికట్టుగా అడ్డుకోవాలని సజ్జల పిలుపునిచ్చారు.

భారతీయ జనతా పార్టీ పాలనలో కేంద్ర ప్రభుత్వం రూ.కోటి 16లక్షల కోట్లు అప్పు చేసిందని, కొవిడ్‌ సమయంలోనే రూ.20లక్షల కోట్లు అదనంగా అప్పు చేసిందని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. కేంద్రం చేసిన అప్పుతో పోలిస్తే రాష్ట్రం చేసిన అప్పు చాలా తక్కువన్నారు.  ఇతర రాష్ట్రాల్లోనూ ఇంతకు మించి అప్పులు చేశారని ఈ సందర్భంగా ప్రస్తావించారు. బీజేపీ నేతలకు ప్రజల సమస్యలపై పోరాటం, సమస్యల పరిష్కారం అనే అజెండాతో సంబంధం లేదని, మతం ప్రాతిపదికగా దుష్ప్రచారం చేయడమే వారి అజెండా అన్నారు. రాబోయే రోజుల్లో మత విశ్వాసాలు, ఆర్థికపరమైన అంశాలే అజెండాగా దాడి జరగబోతోందని, దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు నేతలు సిద్ధంగా ఉండాలన్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర స్థాయి ఆర్యవైశ్య నేతల సమావేశంలో సజ్జల పాల్గొన్నారు.  మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, పలువురు వైసీపీ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.

వారం రోజుల క్రితం  ఢిల్లీలో కేంద్ర మంత్రుల్ని కలసిన ఏపీ బీజేపీ నేతలు.. రాష్ట్ర అప్పులపై ఫిర్యాదు చేశారు. చట్ట విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం రూ.25వేల కోట్లు అప్పు చేసిందని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లామని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. ఆర్బీఐ నిబంధనలను ఏపీ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని విమర్శించారు. దీనిపై స్పందించిన వైసీపీ నేతలు…. ఏపీని వేలెత్తి చూపిస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు కనిపించడంలేదా అని ప్ర‌శ్నించారు. ఏపీలో ఉద్యోగుల జీతాలు ఒకటి రెండు రోజులు ఆలస్యమవుతున్నా.. ఎక్కడా ఆగిపోలేదని, సామాజిక పింఛన్లు సైతం ఒకటో తేదీనే ఇచ్చేస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులతోనే తిప్పలు ఎక్కువయ్యాయని, వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత బీజేపీకి లేదన్నారు. అయితే కేంద్రం చేసే అప్పులపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నేతలకు లేదని సోము వీర్రాజు బదులిచ్చారు.

Also Read: గెజిట్ నోటిఫికేషన్ అమలే అజెండా… తెలంగాణ సర్కార్ లేఖలు.. పరిగణనలోకి తీసుకోని బోర్డులు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Embed widget