By: ABP Desam | Updated at : 29 Jan 2022 06:00 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
కరోనా కేసులు(ప్రతీకాత్మక చిత్రం)
ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 40,357 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 11,573 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో కోవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,594కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 9,445 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 21,30,162 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 1,15,425 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 22,60,181కి చేరింది. గడిచిన 24 గంటల్లో 9,445 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 1,15,425 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,594కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 3,24,06,132 శాంపిల్స్ పరీక్షించారు.
దేశంలో కరోనా కేసులు
భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో పోల్చితే దేశంలో దాదాపు 10 వేల పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 2,35,532 (2 లక్షల 35 వేల 532) మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో మరో 871 మంది కరోనా మహమ్మారితో పోరాడుతూ చనిపోయారు. రెండు రోజుల కిందట నమోదైన కేసులతో పోల్చితే పోల్చితే దేశంలో కరోనా మరణాలు 50 శాతం పెరిగాయి. దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 4 కోట్లు దాటిపోయింది.
దేశంలో నిన్న ఒక్కరోజులో 3,35,939 (3 లక్షల 35 వేల 939) మంది కరోనాను జయించారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 20,04,333కు దిగొచ్చింది. భారత్లో కరోనా యాక్టివ్ కేసులు చాలా రోజుల తరువాత క్రితం రోజుతో పోల్చితే తగ్గాయి. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 13.39 శాతానికి తగ్గినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తాజా బులెటిన్లో వెల్లడించింది. భారత్లో కొవిడ్ డోసుల పంపిణీ 165.04 కోట్ల మైలురాయికి చేరుకుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతా వద్ద దాదాపు 13 కోట్ల డోసుల వరకు నిల్వ ఉన్నాయని తెలిపింది.
నిన్నటితో పోల్చితే దేశంలో తగ్గిన కరోనా కేసులు
తాజాగా 2,35,532 పాజిటివ్ కేసులు, 871 మంది మృతి
భారత్లో 20,04,333కు చేరుకున్న యాక్టివ్ కేసులు
రోజువారీ పాజిటివిటీ రేటు 13.39 శాతం
వ్యాక్సినేషన్ పూర్తయిన డోసులు 1,65,04,87,260 (165 కోట్ల 4 లక్షల 87 వేల 260)
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకూ 36.94 కోట్ల మందికి కరోనా సోకింది. 56.4 లక్షల మందిని కరోనా మహమ్మారి బలిగొనడం విషాదదాయకం. వైరస్ వ్యాప్తిని నిర్మూలించేందుకు 992 కోట్ల డోసుల వ్యాక్సిన్లను ప్రజలు తీసుకున్నారని ప్రముఖ జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ తాజాగా తెలిపింది.
MP Raghurama Krishn Raju : ఎంపీ రఘురామ అనర్హత పిటిషన్ పై విచారణ, ప్రివిలేజ్ కమిటీ ఎదుట మార్గాని భరత్ హాజరు!
Revanth Reddy: ఇక్కడ ఫాంహౌస్ దాటరు! అటు వెళ్లి నష్ట పరిహారమా? రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న
Lokesh On Ysrcp Govt : తాడేపల్లి ప్యాలెస్ లో ఎమ్మెల్సీ అనంతబాబు, సజ్జలతో భేటీ - నారా లోకేశ్ సంచలన కామెంట్స్!
Breaking News Live Updates జ్ఞానవాపి మసీదు కేసులో సివిల్ దావా విచారణ ప్రారంభించిన వారణాసి జిల్లా కోర్టు
MLC Anantha Udaya Bhaskar: డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసినట్లు అంగీకరించిన ఎమ్మెల్సీ అనంతబాబు ! సాయంత్రం పోలీసుల ప్రెస్మీట్
Pawan Kalyan: సిరివెన్నెలను గుర్తు చేసుకున్న పవన్ కళ్యాణ్
Karimnagar: శాతవాహన యూనివర్సిటీలో 12బీ హోదా లొల్లి - UGCకి వర్సిటీ నుంచి వివాదాస్పద లేఖలు
Gyanvapi Mosque Case: జ్ఞాన్ వాపి మసీదు కేసులో వాదనలు పూర్తి- తీర్పు రేపటికి రిజర్వ్ చేసిన వారణాసి కోర్టు
CM Jagan In Davos: సామాన్యుల స్థోమతకు తగ్గట్టుగా వైద్యసేవలు, ఆ దిశగా ఏపీలో విప్లవాత్మక మార్పులు- దావోస్ సదస్సులో సీఎం జగన్