అన్వేషించండి

AP Inter 2nd year Class: ఏపీలో 16 నుంచి ఇంటర్ సెకండియర్ తరగతులు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థులకు ఆగస్టు 16 నుంచి తరగతులు ప్రారంభం కానున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థులకు ఆగస్టు 16 నుంచి తరగతులు ప్రారంభం కానున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. తరగతుల ఏర్పాట్లకు చర్యలు తీసుకోవాలని కాలేజీల యాజమాన్యాలకు సూచించింది. ఈ మేరకు బోర్డు సెక్రటరీ రామకృష్ణ ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచనలు ఇచ్చారు.

10వ తరగతి ఫలితాలు విడుదల.. 
ఆంధ్రప్రదేశ్‌లో 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ఈ ఫలితాలను విడుదల చేశారు. పరీక్ష ఫలితాలను www.bse.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఈ సైట్‌లో జిల్లా, మండలం, స్కూల్, విద్యార్థి పేరు, డేట్ ఆఫ్ బర్త్ వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. షార్ట్ మెమోలను డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం ప్రధానోపాధ్యాయులకు మాత్రమే ఉంది. వీరి ద్వారా విద్యార్థులు మెమోలను పొందవచ్చు. 

ఈసారి 2021తో పాటు 2020లో పదో తరగతి పూర్తయిన వారి ఫలితాలను కూడా విడుదల చేశారు. కోవిడ్ కారణంగా గతేడాది పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. 2020లో మార్కులు కేటాయించకుండా కేవలం ఉత్తీర్ణులైనట్లు అధికారులు ప్రకటించారు. ఈ విద్యార్థులకు ప్రస్తుతం గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్లను అందించారు.

అడ్మిషన్లు స్టార్ట్ చేసిన కాలేజీలపై ఇంటర్ విద్యా బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం పర్మిషన్ లేకుండా అడ్మిషన్లు ఎలా తీసుకుంటారని మండిపడుతున్నారు అధికారులు. అలాంటి కాలేజీలపై చర్యలకు రెడీ అవుతున్నారు. 

ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రాక ముందే అడ్మిషన్లు చేపట్టిన ప్రైవేటు కాలేజీల గుర్తింపు రద్దు చేయడానికి ఇంటర్ బోర్డు అధికారులు ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. చాలా కాలేజీలు ఫీజులు కూడా కలెక్షన్లు చేశాయని... ఇలాంటి వాటిని సహించేది లేదని చెబుతున్నారు అధికారులు. ఇప్పటి ప్రైవేటు కాలేజీలు చేపట్టిన అడ్మిషన్లు చెల్లవంటు ప్రకటించారు. 

ఇంటర్ అడ్మిషన్లు అంటూ ఫోన్లు చేసినా... తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొచ్చినా చర్యలు తప్పవంటున్నారు. ఇలాంటి వారి వివరాలు విద్యాశాఖాధికారులు చెప్పాలని తల్లిదండ్రులకు, విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన తేదీ నుంచే అడ్మిషన్లు తీసుకోవాలని చెబుతున్నారు. ఆ తర్వాతే ప్రక్రియ చేపట్టాలని కాలేజీలను ఇంటర్ బోర్డు ఆదేశించింది. 

 

Also Read: AP SSC Result Live Updates: ఏపీ పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల.. ఈ లింక్ క్లిక్ చేసి చెక్ చేసుకోండి

Also Read: TS CPGET 2021: ఒకే పరీక్షతో ఏడు వర్సిటీల్లో ప్రవేశాలు.. సీపీజీఈటీ నోటిఫికేషన్‌ విడుదల.. అప్లై చేసేటప్పుడు వీటిని మర్చిపోవద్దు

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బహిరంగ విమర్శలు చేసే కాంగ్రెస్ నేతలపై కఠిన చర్యలు: టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్
బహిరంగ విమర్శలు చేసే కాంగ్రెస్ నేతలపై కఠిన చర్యలు: టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్
Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
NITI Aayog Report: 8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Gill Historic Milestone: గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
Embed widget