అన్వేషించండి

AP High Court: ఈనెల 21న హాజరు కావాలి.. అనంతపురం ఎస్పీకి హైకోర్టు ఆదేశాలు

మహిళా విభాగం నేతలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇతర మంత్రులపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అనంతపురం నాల్గవ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ అనంతపురం తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం నేతలు తీవ్రంగా స్పందించారు. ఈ నేపథ్యంలో మహిళా విభాగం నేతలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇతర మంత్రులపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అనంతపురం నాల్గవ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తులో భాగంగా మహిళా నేతలను పోలీసు స్టేషన్ కు పిలిపించి విచారణ చేపట్టారు. అంతటితో ఆగకుండా మహిళా నేతలు చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఎవరెవరు ఉన్నారన్న దానిపై ప్రశ్నించారు. పీఎస్‌కు వచ్చిన మహిళా నేతలు ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందని పోలీసులు మహిళా నేతల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు. ఇక్కడే పోలీసులు ప్రవర్తించిన తీరు కొంత వివాదాస్పదమైంది. ఇళ్లలోకి వెల్లిన పోలీసులు ఇంటిని మొత్తం తనిఖీ చేయడం, అంతటితో ఆగకుండా ఇళ్లును క్షుణ్ణంగా వెతికారు. ఇంటిలో దొరికిన డబ్బులు, బ్యాంక్ పాస్ పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పోలీసులు ప్రవర్తనపై మహిళా నేతలతో పాటు టీడీపీ నేతలు కూడా చాలా సీరియస్ గానే స్పందించారు. ఆరోజే పోలీసుల ప్రవర్తనపై టీడీపీ సీనియర్ నేత, ఎంఎల్ఏ పయ్యావుల కేశవ్ పోలీసుల వ్యవహార శైలిపై కచ్చితంగా కోర్టును ఆశ్రయిస్తామని భాదితులకు అండగా ఉంటామని ప్రకటించారు. 
ఆ పార్టీ నేతలు కోర్టును ఆశ్రయించారు. మహిళా నేతలకు హైకోర్టు బెయిల్ కూడా ఇచ్చింది. పోలీసులు ప్రవర్తించిన తీరుపై అడ్వకేట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో హైకోర్టు అనంతపురం ఎస్పీతో పాటు, నాల్గవ పట్టణ సీఐని కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ఈ నెల 21న కోర్టుకు హాజరు కావాలంటూ ఆదేశించింది. దీంతో పోలీసులు ప్రవర్తనపై మరోసారి చర్చకు దారితీసింది. మహిళా నేతలు ఆరోపణలు చేస్తే కేసు నమోదు చేసి విచారణ చేయాలి కానీ, ఇళ్లలోకి వెళ్లి వ్యక్తిగతంగా దాడులు చేయడం ఏంటని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. 

మేం ఆరోపణలు చేస్తే కేసులు నమోదు చేసే పోలీసులు మంత్రులపై ఎందుకు కేసులు నమోదు చేయలేదంటూ ప్రశ్నిస్తున్నారు. అత్యుత్సాహంతోనే పోలీసులు తమ ఇళ్లపై దాడి చేసి, వంటిళ్లుతో సహా క్షుణ్ణంగా తనిఖీలు చేసి తమను ఇబ్బందులకు గురిచేశారని పిర్యాదు చేసినట్లు తెలిసింది. వీటన్నిటిపై కూడా టీడీపీ నేతలు సీరియస్ గానే రియాక్ట్ అవుతున్నారు. తమ కార్యకర్తలపై ఎవ్వరూ దాడిచేసినా చూస్తూ ఉరుకోనేది లేదంటున్నారు. మహిళా విభాగం నేతలపై పోలీసులు కేసు నమోదు చేయడం, వారి వెనుక ఎవరున్నారన్న దాని పేరుతో వేదించారంటూ మహిళా నేతలు ఆరోపిస్తున్నారు. 
Also Read: తిరుపతిలో జరగబోయేది తెలుగుదేశం పార్టీ సభ.... ప్రాజెక్టులకు భూములిచ్చిన రైతులది త్యాగం కాదా?... టీడీపీపై మంత్రి బొత్స ఫైర్
జరిగిన పరిణామాలకు సమాధానం చెప్పాలంటూ హైకోర్టు ఎస్పీని పిలిపించడం జిల్లాలో చర్చనీయాంశం అయ్యింది. మరి పోలీసులు ఏం చెప్తారన్నదానిపై ఆసక్తి నెలకొంది. వీటికి తోడు ఇటీవలే రాయదుర్గం పోలీసులు మాజీమంత్రి కాలువ శ్రీనివాసులు, మరో పదమూడు మందిపై పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేసిన కేసులో రాయదుర్గం పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ఈ కేసుపై కూడా టీడీపీ నేతలు కోర్టుకు వెళ్లనున్నారు. పోలీసులు వర్సెస్ టీడీపీ నేతలు అన్నట్లుగా ఉన్న ఈ వ్యవహారం ఎక్కడికి దారితీస్తుందోనని ఉత్కంఠ నెలకొంది.
Also Read: AP Employees : పీఆర్సీ కూడా ప్రకటించలేదు ... ఉద్యమం నిలిపివేత ! ఏపీ ఉద్యోగ నేతలు ఏం సాధించారు ?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Sivaji Reaction : ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
Pawan Kalyan In Ippatam: ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
Hyderabad Crime News: బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగురి అరెస్ట్
బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Rohit Sharma: విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం

వీడియోలు

ప్రపంచ రికార్డ్ సృష్టించిన షెఫాలీ వర్మ
టీమిండియా సూపర్ విక్టరీ.. ఐసీసీ ర్యాంకులో దూసుకెళ్లిన దీప్తి
15 ఏళ్ల తర్వాత రోహిత్, కోహ్లీ.. ఫస్ట్ టైం స్టార్లతో నిండిన విజయ్ హజాారే ట్రోఫీ
టీమిండియా ప్లేయర్ల కెరీర్ ని సెలెక్టర్లు నాశనం చేస్తున్నారు: మహమ్మద్ కైఫ్
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sivaji Reaction : ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
Pawan Kalyan In Ippatam: ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
Hyderabad Crime News: బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగురి అరెస్ట్
బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Rohit Sharma: విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
The Paradise Movie : నాని 'ది ప్యారడైజ్'లో హీరోయిన్ ఫిక్స్? - కన్ఫర్మ్ చేసేసిన బ్యూటీ!
నాని 'ది ప్యారడైజ్'లో హీరోయిన్ ఫిక్స్? - కన్ఫర్మ్ చేసేసిన బ్యూటీ!
Vaibhav Suryavanshi: 36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
H1B visa: హెచ్-1బీ వీసాలకు లాటరీ విధానం ఎత్తివేత - భారతీయులపై ఎంత ప్రభావం పడుతుందో తెలుసా?
హెచ్-1బీ వీసాలకు లాటరీ విధానం ఎత్తివేత - భారతీయులపై ఎంత ప్రభావం పడుతుందో తెలుసా?
Delhi Metro: ఢిల్లీ మెట్రోకు మరో 12 వేల కోట్లు - కేంద్ర కేబినెట్ నిర్ణయం - హైదరాబాద్ మెట్రోకు ఎదురుచూపులే!
ఢిల్లీ మెట్రోకు మరో 12 వేల కోట్లు - కేంద్ర కేబినెట్ నిర్ణయం - హైదరాబాద్ మెట్రోకు ఎదురుచూపులే!
Embed widget