అన్వేషించండి

AP Sanitation Workers: సమ్మె యథాతథం, మున్సిపల్‌ కార్మిక సంఘాలతో ప్రభుత్వ చర్చలు మరోసారి విఫలం

AP Municipal Workers: మున్సిపల్ కార్మిక సంఘాల ప్రతినిధులతో ఏపీ ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం అయ్యాయి.

AP Govt Discussion fail with Sanitation Workers: అమరావతి: మున్సిపల్ కార్మిక సంఘాల ప్రతినిధులతో ఏపీ ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. కార్మికులకు బేసిక్ పే ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించింది. ఒకవేళ మున్సిపల్ కార్మికులకు (AP Municipal Workers) బేసిక్ పే చెల్లిస్తే.. ఇతర శాఖల సిబ్బంది సైతం డిమాండ్ చేస్తారని ఏపీ మంత్రులు, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు)సజ్జల రామకృష్ణారెడ్డి వారికి వివరించారు. సచివాలయం (Andhra Pradesh Secretariat)లో జనవరి 2వ తేదీన (మంగళవారం) మున్సిపల్ కార్మిక సంఘాల ప్రతినిధులతో వారి డిమాండ్లపై మంత్రుల బృందం చర్చించింది. ఏపీ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు)సజ్జల రామకృష్ణారెడ్డి, కొందరు ఉన్నతాధికారులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. అయితే వేతనానికి సంబంధించిన డిమాండ్ ను నెరవేర్చలేమని కార్మిక సంఘాల ప్రతినిధులకు మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. జనవరి 12 లేదా 17న మరోసారి చర్చించాలని మంత్రుల కమిటీ భావిస్తోంది. మున్సిపల్ కార్మికుల డిమాండ్లను సీఎం జగన్ కు మరోసారి వివరిస్తామని మంత్రులు పేర్కొన్నారు.

పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లు ఏంటంటే.. 
పారిశుధ్య కార్మికుల డిమాండ్లలో ప్రధానమైనటువంటి కేటగిరీల వారీగా బేసిక్ పే నిర్ణయం, పొరుగు సేవల విధానాన్ని కాంట్రాక్టు, శాశ్వత ఉద్యోగులుగా పర్మినెంట్ చేయడం తదితర అంశాలపై ఈ  సమావేశంలో చర్చించారు. వీటితో పాటు అవుట్ సోర్సింగ్ పై పనిచేసే పారిశుధ్య, ఇంజనీరింగ్, ఇతర సిబ్బందికి  అన్ని ప్రభుత్వ పథకాలు వర్తింపచేయడం, నియామకాల్లో వెయిటేజీ మార్కులు కేటాయించడం,  ఖాళీగా ఉన్న రెగ్యులర్ పోస్టులను వెంటనే భర్తీ చేయడం, అవసరానికి తగ్గట్టుగా పారిశుధ్య కార్మికుల సంఖ్యను పెంచడం, కాంట్రాక్టు విదానంలో ఘన వ్యర్థాలను తరలించే వాహనాల పనితీరును మెరగుపర్చడం, పారిశుధ్య కార్మికులు, ఇంజనీరింగ్ సిబ్బంది, పార్కుల నిర్వహణ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్కర్ల నిర్వహించే పనుల ఆధారంగా వారికి బేసిక్ పే నిర్ణయించడం తదితర అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. 

ఈ సమావేశంలో ప్రభుత్వ సలహా దారులు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్. చంద్ర శేఖర రెడ్డి, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మీ,  సిడిఎంఎ కోటేశ్వరరావు, స్వచ్ఛాంధ్రకార్పొరేషన్ విసి & ఎండి గంధం చంద్రుడు, ఆప్కాస్ ఎండి వాసుదేవ రావు తదితర అధికారులతో పాటు రాష్ట్ర మున్సిపల్ ఉద్యోగుల సంఘాల నాయకులు  ఆనంద్ రావు (YSRTUC రాష్ట్ర ప్రెసిడెంట్),  వై.వి.రమణ (YSRTUC ప్రధాన      కార్యదర్శి),  ఎ. రంగనాయకులు (AITUC రాష్ట్ర అధ్యక్షులు),  పి. సుబ్బారాయుడు (AITUC ప్రధాన కార్యదర్శి), అబ్రహం లింకన్ (IFTU ప్రెసిడెంట్), జి. ప్రసాద్ (APCITU  ప్రెసిడెంట్), కె. ఉమామహేశ్వరరావు (AP CITU ప్రధాన కార్యదర్శి), జి.రఘురామరాజు (TNTUC రాష్ట్ర ప్రెసిడెంట్),  శ్యామ్ (TNTUC ప్రధాన కార్యదర్శి), మధుబాబు (AP MEWU రాష్ట్ర ప్రెసిడెంట్),  ఆంజనేయులు (AP MEWU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి), GVRKH వరప్రసాద్ (AICTU రాష్ట్ర అధ్యక్షులు),  కె. శ్రీనివాసరావు (AICTU జనరల్ సెక్రటరీ) తదితరులు పాల్గొన్నారు. 

మున్సిపల్ కార్మికుల సమ్మె
ఏపీ వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు డిసెంబర్ 26 నుంచి నిరవధిక సమ్మె చేపట్టారు. పారిశుద్ధ్య, ఇంజినీరింగ్ కాంట్రాక్ట్‌ సిబ్బంది, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. దాంతో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో పారిశుద్ధ్య కార్మికులు తమ డిమాండ్లను నెరవేర్చుకునేందుకు మొగ్గుచూపారు. అంటు వ్యాధులు వ్యాపించే సీజన్ కావడంతో ఏపీ ప్రభుత్వంపై రోజురోజుకూ ఒత్తిడి పెరుగుతోంది.  సమాన పనికి సమాన వేతనం, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ సహా 13 డిమాండ్లను నెరవేర్చాలని వారు సమ్మె చేస్తున్నారు. అంగన్వాడీ సంఘాల తరహాలోనే మున్సిపల్ కార్మిక సంఘాల ప్రతినిధులతో తొలి దఫా చర్చలు విఫలమయ్యాయి. రెండోసారి మున్సిపల్ కార్మిక సంఘాలతో ఏపీ ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దాంతో పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కొనసాగనుంది.

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని మున్సిపల్ కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, తమ వేతనం సైతం 26 వేల రూపాయలకు పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం రూ.15వేల వేతనం ఇస్తున్నారు. పని ఒత్తిడి, అనారోగ్య సమస్యల కారణంగా.. కార్మికుల సంఖ్యను పెంచాలన్న డిమాండ్‌ను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. మరోవైపు వేతనం పెంచాలన్న డిమాండ్ ను నెరవేర్చుకోవాలని పారిశుధ్య కార్మికులు సమ్మెకు దిగారు. తమ డిమాండ్లకు ఏపీ ప్రభుత్వం అంగీకరించకపోవడంతో, తమ సమస్యలు తీరే వరకు సమ్మె కొనసాగించాలని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి.

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: రైతుల కోసం వెళ్లిన వైసీపీ నేతలపై దాడులు దారుణం, పోలీసులు సైతం కోఆర్డినేట్: వైఎస్ జగన్
రైతుల కోసం వెళ్లిన వైసీపీ నేతలపై దాడులు దారుణం, పోలీసులు సైతం కోఆర్డినేట్: వైఎస్ జగన్
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Breaking News: రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
Embed widget