అన్వేషించండి

CM Jagan On Rains: వరద పునరావాస శిబిరంలో ఉన్న కుటుంబానికి రెండు వేలు ఆర్థిక సాయం

కూనవరం, చింతూరుల్లో 2 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, వి.ఆర్‌.పురం, కూనవరం, అమలాపురం, వేలురుపాడుల్లో 4 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఉన్నాయి. లైన్‌ డిపార్ట్‌మెంట్లు ప్రత్యామ్నాయాలతో సిద్ధంగా ఉండాలని సీఎం సూచించారు.

మరి కొన్ని రోజులు ఏపీలో భారీగా వర్షాలు పడనున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వరద ప్రభావిత జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడిన సీఎం జగన్... భారీ వర్షాలు, వరద ప్రభావిత జిల్లాల్లో తాజా పరిస్థితి, తీసుకుంటున్న సహాయ చర్యలను గురించి అధికారులు సీఎంకు వివ‌రించారు.

సీఎం జగన్‌ ఏమన్నారంటే.. గోదావరికి ముందస్తుగానే వరదలు వచ్చాయి. గడిచిన వందేళ్లలో ఇంత ముందుగా ఈ స్ధాయిలో వరద రాలేదు, సాధారణంగా ఆగష్టులో 10 లక్షల క్యూసెక్కుల వరద నీరు ఉంటుంది. అయితే తొలిసారిగా జులైలోనే 10 లక్షల క్యూసెక్కులకుపైన వరద వచ్చింది. ఇది జాగ్రత్త పడాల్సిన అంశం. ప్ర‌స్తుతం ధవళేశ్వరంలో 13 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. ఇప్పడు రెండో ప్రమాద హెచ్చరిక నడుస్తోంది. బుధవారం ఉదయానికి వరద పెరిగే సూచనలు కనిపిస్తున్నాయన్నారు. ఇది 15 నుంచి 16 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉంది. దీనివల్ల తలెత్తే పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలి. మహారాష్ట్రలో భారీ వర్షాలతో గోదావరి నదికి వరదలు కొనసాగే అవకాశం ఉంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఒక్కరూ కూడా మృత్యువాత పడకూడదు. అని అన్నారు. 

కూనవరం, చింతూరుల్లో 2 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఉన్నాయి. వి.ఆర్‌.పురం, కూనవరం, అమలాపురం, వేలురుపాడుల్లో 4 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఉన్నాయి లైన్‌ డిపార్ట్‌మెంట్లు ప్రత్యామ్నాయాలతో సిద్ధంగా ఉండాలని సీఎం సూచించారు. కంట్రోల‌్‌ రూమ్స్‌ సమర్థవంతంగా పని చేయాలని ఆదేశించారు. 24 గంటలపాటు నిరంతరాయంగా కంట్రోల్‌ రూంలు పనిచేయాలన్నారు. అవసరమైనచోట వరద సహాయక శిబిరాలు ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారిని వెంటనే శిబిరాలకు తరలించాలన్నారు. సహాయ శిబిరాల్లో మెరుగ‌యిన ఏర్పాట్లు చేయాల‌న్నారు.

మంచి ఆహారం, తాగునీరు, ఇతర సౌకర్యాల ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని జగన్ దిశానిర్దేశం చేశారు. బాధితుల పట్ల మానవతాదృక్ఫధంతో మెలగాలి ,శిబిరాల నుంచి వాళ్ల వాళ్ల ఇళ్లకు వెళ్లేటప్పుడు ప్రశంసించే విధంగా ఏర్పాట్లు ఉండాలన్నారు. సహాయ శిబిరాల్లో నాణ్యమైన సేవలందించే క్రమంలో ఖర్చుకు వెనుకాడొద్దని పేర్కొన్నారు. సహాయక శిబిరాల నుంచి ఇళ్లకు వెళ్లేటప్పుడు వ్యక్తికి అయితే రూ.1000, ప్రతి కుటుంబానికి రూ.2వేల రూపాయలు ఇవ్వాల‌ని ఆదేశించారు.

 వైద్య సదుపాయాల విష‌యంలో పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది, నర్సులు, ఇతర సిబ్బంది పూర్తిగా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అత్యవసర మందులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. నిత్యావసర సరుకులకు సంబంధించి కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. అవసరమైన సరకులు నిల్వ ఉంచేలా చూసుకోవాలన్నారు. పారిశుధ్యం బాగుండేలా చర్యలు తీసుకోవాలి, తాగునీటి పథకాలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

కరెంటు సరఫరాకు అంతరాయం వచ్చినప్పుడు అత్యవసర సర్వీసులు నడిచేందుకు వీలుగా జనరేటర్లను అందుబాటులో ఉంచాల‌న్నారు సీఎం జగన్. తాగునీటి కోసం ట్యాంకర్లను సిద్ధంచేసుకోవాలి, శిథిలావస్థలో ఉన్న నిర్మాణాల పట్ల అప్రతమత్తంగా ఉండాలన్నారు. చెరువులు, ఇరిగేషన్‌ కాల్వలు.. ఎక్కడ బలహీనంగా ఉన్నాయో.. అక్కడ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్‌ సబ్‌స్టేషన్లు ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకోమన్నారు. బోట్లు, లైఫ్‌ జాకెట్లు.. అవసరైన ప్రాంతాల్లో సిద్ధంగా ఉంచాల‌ని సూచించారు.

అల్లూరు సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, బి.ఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాల కలెక్టర్లకు రూ.2కోట్ల చొప్పున తక్షణ నిధులు ఇస్తున్నట్టు సీఎం ప్రకటించారు. సీఎంఓ అధికారులు అందుబాటులో ఉంటారని.. వరద కారణంగా జరిగిన నష్టాలపై ఎప్పటికప్పుడు వివరాలు సేకరించి రోజువారీ నివేదికలు పంపాలని కలెక్టర్లకు సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Telangana Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
IPL 2024: రెండో స్థానంపై హైదరాబాద్‌ కన్ను, పంజాబ్‌ అడ్డుకోగలదా ?
రెండో స్థానంపై హైదరాబాద్‌ కన్ను, పంజాబ్‌ అడ్డుకోగలదా ?
IPL 2024: అద్భుతం చేసిన ఆర్సీబీ, చెన్నైకి బిగ్‌ షాక్‌ - ప్లే ఆఫ్స్ చేరిన బెంగళూరు
అద్భుతం చేసిన ఆర్సీబీ, చెన్నైకి బిగ్‌ షాక్‌ - ప్లే ఆఫ్స్ చేరిన బెంగళూరు
Nagababu: ఎలక్షన్ ఇంకా పూర్తి కాలేదు, అరాచకాలకు ఛాన్స్! స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పహారా ఉండాలి: నాగబాబు
ఎలక్షన్ ఇంకా పూర్తి కాలేదు, అరాచకాలకు ఛాన్స్! స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పహారా ఉండాలి: నాగబాబు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RCB Won Against CSK Entered into Playoffs | చెన్నైని కొట్టి ప్లేఆఫ్స్‌కు ఆర్సీబీ | ABP DesamVizag Police About Sensational Attack | వైజాగ్‌లో కుటుంబంపై జరిగిన దాడి గురించి స్పందించిన పోలీసులు | ABP DesamPavitra Bandham Chandu Wife Sirisha Comments | సీరియల్ నటుడు చందు మృతిపై భార్య శిరీష సంచలన నిజాలు | ABP DesamWhat if RCB Vs CSK Match Cancelled | ఆర్సీబీ, సీఎస్కే మ్యాచ్ రద్దయితే ఏం జరుగుతుంది? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Telangana Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
IPL 2024: రెండో స్థానంపై హైదరాబాద్‌ కన్ను, పంజాబ్‌ అడ్డుకోగలదా ?
రెండో స్థానంపై హైదరాబాద్‌ కన్ను, పంజాబ్‌ అడ్డుకోగలదా ?
IPL 2024: అద్భుతం చేసిన ఆర్సీబీ, చెన్నైకి బిగ్‌ షాక్‌ - ప్లే ఆఫ్స్ చేరిన బెంగళూరు
అద్భుతం చేసిన ఆర్సీబీ, చెన్నైకి బిగ్‌ షాక్‌ - ప్లే ఆఫ్స్ చేరిన బెంగళూరు
Nagababu: ఎలక్షన్ ఇంకా పూర్తి కాలేదు, అరాచకాలకు ఛాన్స్! స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పహారా ఉండాలి: నాగబాబు
ఎలక్షన్ ఇంకా పూర్తి కాలేదు, అరాచకాలకు ఛాన్స్! స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పహారా ఉండాలి: నాగబాబు
Rains: తెలుగు రాష్ట్రాలకు కూల్ న్యూస్ - ఈ నెల 23 వరకూ భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాలకు కూల్ న్యూస్ - ఈ నెల 23 వరకూ భారీ వర్షాలు
Prabhas Bujji: ప్రభాస్‌ బుజ్జిని పరిచయం చేసిన 'కల్కి 2898 AD' టీం - ఆసక్తి పెంచుతన్న స్పెషల్ వీడియో, కానీ ఓ ట్విస్ట్‌
ప్రభాస్‌ బుజ్జిని పరిచయం చేసిన 'కల్కి 2898 AD' టీం - ఆసక్తి పెంచుతన్న స్పెషల్ వీడియో, కానీ ఓ ట్విస్ట్‌
Sania Mirza: సానియా మీర్జా రెండో పెళ్లి చేసుకుంటుందా? - పాక్‌ నటుడు షాకింగ్‌ కామెంట్స్‌
సానియా మీర్జా రెండో పెళ్లి చేసుకుంటుందా? - పాక్‌ నటుడు షాకింగ్‌ కామెంట్స్‌
Lok Sabha Election 2024: ఎన్నికల్లో పట్టుబడిన డబ్బు ఎంతో తెలిస్తే షాక్! తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
ఎన్నికల్లో పట్టుబడిన డబ్బు ఎంతో తెలిస్తే షాక్! తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
Embed widget