అన్వేషించండి

Andhra News Kadiri MLA : పించన్లు ఆపేస్తే రోడ్లు - వైసీపీ ఎమ్మల్యే వ్యాఖ్యలపై వివాదం !

Andhra News Kadiri MLA : పెన్షన్లు ఆపేస్తే రోడ్లు వేయవచ్చని ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై కదిరి ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. అన్ని ప్రభుత్వాలూ పెన్షన్లు ఇస్తున్నాయని గుర్తు చేస్తున్నారు.

 

Andhra News Kadiri MLA : గ్రామాల్లో రోడ్లు బాగోలేవని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తే ఆయన పథకాలు ఆపేస్తే రోడ్లు వేయవచ్చని సమాధానం ఇచ్చారు. వైసీపీ ఎమ్మెల్యే తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.   కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి దృష్టికి శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం చిన్నరామన్నగారి పల్లి వాసులు తీసుకెళ్లారు. అయితే ఆయన చెప్పిన సమాధానానికి వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. నియోజకవర్గంలో ప్రతి నెల రూ.15 కోట్లు ఫించన్లకే సరిపోతున్నాయని, రోడ్డు మరమ్మతులు చేయాలంటే వాటిని రద్దు చేయాలని చెప్పారు. అలా చేస్తే రోడ్లన్నీ అద్దంలా మెరిసిపోతాయని ఎమ్మెల్యే చెప్పారు. దీంతో గ్రామస్తులు విస్తుపోయారు. 

అన్ని ప్రభుత్వాలూ పెన్షన్లు ఇచ్చి రోడ్లూ వేశాయని గుర్తు చేసిన  గ్రామస్తులు             

ఎమ్మెల్యే సిద్ధారెడ్డి చెప్పిన సమాధానంపై మాత్రం గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు కూడా పింఛన్లు ఇచ్చాయని, ఇప్పుడు మాత్రమే ఇస్తున్నట్లు ఎమ్మెల్యే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చిన్నరామన్న గారిపల్లిలో రోడ్లు అధ్వాన్నంగా మారాయని, తమ గ్రామానికి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తే ఆయన సమాధానం బోడిగుండుకి, మోకాలికి ముడి వేసినట్లుందని గ్రామస్తులు విమర్శలు కురిపిస్తున్నారు. ఇప్పటికైనా తమ గ్రామానికి వెళ్లే రోడ్డుకు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు. పట్టించుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేకు కచ్చితంగా బుద్ది చెబుతామని చిన్నరామన్నగారి పల్లి వాసులు హెచ్చరించారు. 

ఏపీలో అధ్వాన్నంగా రోడ్లు - సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం                            

ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల దస్థితిపై చాలా కాలంగా విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం రోడ్లపై పెద్దగా నిధులు వెచ్చించడం లేదు. నిర్వహణకు కూడా పెద్దగా ఖర్చు పెట్టకపోతూండంతో  అధ్వాన్నంగా  మారాయి. గ్రామాల్లో పరిస్థితులు మరింత దారుణంగా మారాయని విమర్శలు వస్తున్నాయి. చాలా గ్రామాల ప్రజలు ప్రజా ప్రతినిదుల వద్దకు వెళ్తే ఇలాంటి సమాధానాలే వస్తున్నాయి. రోడ్లు వేయాలంటే సంక్షేమ పథకాలు ఆపేయాలన్నట్లుగా మాట్లాడుతున్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు రోడ్ల వల్ల ఉపయోగపగేమేమిటని..  రోడ్లేస్తే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయా అని ప్రశ్నించారు. వైసీపీ నేతల స్పందనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతున్నా అదే తరహా ప్రకటనలు చేస్తున్నారు. 

పలుమార్లు ఆందోళనలు చేసిన విపక్షాలు                              

ప్రతిపక్ష పార్టీలు కూడా చాలా సార్లు రోడ్డెక్కి నిరసన తెలిపాయి.  ఇటీవలే రెండు రోజుల పాటు టీడీపీ, జనసేన కూటమి నేతలు రోడ్ల పరిస్థితిపై నిరసన వ్యక్తం చేసారు. జనసేన పార్టీ ఓ సారి సొంతంగా మరమ్మతులు కూడా చేసింది. అయినా ప్రభు్తవ పెద్దగా పట్టించుకోలేదు. 

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Embed widget