అన్వేషించండి

Anantapur: తల్లి మృతదేహంతో తహసీల్దారు కార్యాలయంలో ఆందోళన... పాసుపుస్తకం రాలేదని మనస్తాపంతో మహిళా రైతు మృతి..!

మహిళా రైతు మృతదేహంతో ఆమె కుమార్తెలు తహసీల్దారు కార్యాలయంలో ధర్నాకు దిగారు. ఏడేళ్ల పాటు పట్టాదారు పాసు పుస్తకం కోసం తిరిగిన మహిళా రైతు మనోవేదనతో మృతి చెందిందని కుమార్తెలు ఆరోపిస్తున్నారు.

అనంతపురం జిల్లా బత్తలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. తల్లి మృతదేహంతో ఇద్దరు కుమార్తెలు ఆందోళనకు దిగారు. భర్త పేరు మీదున్న భూమిని తన పేరుపై మార్చుకునేందుకు ఏడేళ్లుగా మహిళ తహసీల్దార్ కార్యాలయం చుట్టూతిరిగిందని బంధవులు ఆరోపిస్తున్నారు. అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం జలాలపురం గ్రామంలో  పెద్దన్న అనే వ్యక్తి పేరు మీద ఐదు ఎకరాల పొలం ఉంది. పెద్దన్న ఏడు సంవత్సరాల క్రితం మరణించారు. పెద్దన్న మృతిచెందడంతో భర్తపేరు మీద ఉన్న భూమిని తన పేరుకు మార్చాలని లక్ష్మీ దేవమ్మ అధికారులను కోరింది. లక్ష్మీదేవమ్మ పేరపై మార్చేందుకు వీఆర్వో రూ.3 లక్షలు లంచం అడిగారని ఆమె కుమార్తెలు ఆరోపిస్తున్నారు. అంత డబ్బు ఇచ్చుకోవాలని కోరినా వీఆర్వో నాగేంద్ర వినలేదన్నారు. 

Also Read: భర్తను చంపితే బీమా డబ్బులొస్తాయని ప్లాన్.. ప్రియుడితో కలిసి స్కెచ్.. చివరకు..

తహసీల్దార్ కార్యాలయంలో మృతదేహంతో నిరసన

భూమి దక్కకుండా పోతుందని మనోవేదనకు గురైన తల్లి లక్ష్మీ దేవమ్మ మృతి చెందిందని కూతుళ్లు ఆరోపిస్తున్నారు. ఆమె మృతదేహాన్ని బత్తలపల్లి తహసీల్దార్ కార్యాలయానికి తీసుకొచ్చి నిరసన తెలిపారు. తహసీల్దార్ కార్యాలయంలోని టేబుల్ పై పెట్టి ఆందోళనకు దిగారు. లంచం అడిగిన వీఆర్వో నాగేంద్రని సస్పెండ్ చేయాలని లేకపోతే ఆత్మహత్య చేసుకుంటామని మహిళలు పెట్రోల్ పోసుకునేందుకు ప్రయత్నించారు. వారిని స్థానికులు అడ్డుకున్నారు. తహసీల్దారు సెలవులో ఉన్నారని రెవెన్యూ సిబ్బంది వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేసినా పరిస్తితి ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తహసీల్దార్ కార్యాలయం నుంచి మృతదేహాన్ని తరలించారు. ఈ ఘటనపై రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు.


Anantapur: తల్లి మృతదేహంతో తహసీల్దారు కార్యాలయంలో ఆందోళన... పాసుపుస్తకం రాలేదని మనస్తాపంతో మహిళా రైతు మృతి..!

Also Read: ఒకే చీరకు ఉరేసుకున్న వదిన, మరిది.. కారణం తెలిసి స్థానికులు షాక్

మానసిక ఆవేదనతో మహిళ మృతి..! 

లక్ష్మీదేవి (70) అనే మహిళా రైతుకు జలాలపురం గ్రామంలో 19.20 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. భర్త పెద్దన్న పేరున ఉన్న భూమికి సంబంధించి పట్టాదారు పాసుపుస్తకం తన పేరుతో ఇవ్వాలంటూ ఏడేళ్లుగా బత్తలపల్లి తహసీల్దారు కార్యాలయం చుట్టూ లక్ష్మీదేవమ్మ  తిరిగింది. ఇటీవల ఆమె అనంతపురం నవోదయ కాలనీలోని తన కుమార్తె నాగేంద్రమ్మ వద్ద ఉంటోంది. మంగళవారం ఉదయం లక్ష్మీదేవమ్మ తీవ్ర అస్వస్థతకు గురై మరణించింది. పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వకపోవడం వల్లే తన తల్లి మానసిక ఆవేదనతో మృతి చెందిందంటూ ఆమె ఇద్దరు కుమార్తెలు నాగేంద్రమ్మ, రత్నమ్మలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబులెన్స్‌లో లక్ష్మీదేవమ్మ మృతదేహాన్ని బత్తలపల్లి తహసీల్దారు కార్యాలయానికి తీసుకెళ్లి తహసీల్దారు టేబుల్‌పై మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేశారు. 


Anantapur: తల్లి మృతదేహంతో తహసీల్దారు కార్యాలయంలో ఆందోళన... పాసుపుస్తకం రాలేదని మనస్తాపంతో మహిళా రైతు మృతి..!

Also Read:  ఎన్‌కౌంటర్‌ కేసులో ముందుగా విచారించొద్దు.. దిశ కమిషన్‌పై కోర్టుకెళ్లిన ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Embed widget