అన్వేషించండి

BJP Satya Kumar : హైదరాబాద్ లో రోడ్లు చూపించి మభ్యపెడుతున్నారు, కేటీఆర్ కామెంట్స్ పై సత్య కుమార్ ఫైర్

BJP Satya Kumar : మంత్రి కేటీఆర్ హైదరాబాద్ ను చూపించి మభ్యపెడుతున్నారని బీజేపీ నేత సత్య కుమార్ విమర్శించారు. తెలంగాణలో కరెంట్ కోతలు ఉన్నాయని, ప్రజలు ఇన్వెర్టర్లు, జనరేటర్లు వాడుతున్నారన్నారు.

BJP Satya Kumar :  మంత్రి కేటీఆర్ తెలంగాణ విషయాలు వదిలేసి ఏపీలో రోడ్ల పరిస్థితి మాట్లాడుతున్నారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ అన్నారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణలో ఇవాళ కనిపిస్తున్న రహదారులు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకా నిర్మించినవా అని ప్రశ్నించారు. అవుటర్ రింగ్ రోడ్ కేసీఆర్ నిర్మించారా? కేటీఆర్ ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. కేటీఆర్ హైదరాబాద్ లో రహదారులను చూపించి ఇదే తెలంగాణ అంటే ఎలా అని ప్రశ్నించారు. గ్రామీణ ప్రాంతాలకు వెళితే ప్రజల ఇబ్బందులు తెలుస్తాయన్నారు. 

హైదరాబాద్ చూపించి మభ్యపెడుతున్నారు 

సీఎం కేసీఆర్ పరిపాలన గాలికి వదిలేసి ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని సత్య కుమార్ విమర్శించారు. చాలా రోజుల తర్వాత ఆవిర్భావ దినోత్సవంలో గంటా 45 నిమిషాలు మాట్లాడాడన్నారు. 24 గంటలు కరెంట్ ఇచ్చామని కేసిఆర్ చెబుతున్నారని, కానీ తెలంగాణలో పరిస్థితులు వేరే అన్నారు. తనకు తెలంగాణలో ఇళ్లుందని, కరెంట్ లేక ఇన్వెర్టర్లు పెట్టుకోలేక, జనరేటర్లకు డీజిల్ భరించలేక ఎంత ఇబ్బంది పడుతున్నామో తనకు తెలుసన్నారు. తన లాంటి వారి పరిస్థితితే ఇలా ఉంటే ఇక పేదల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఒక హైదరాబాద్ ను చూపించి ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. మంత్రి కేటీఆర్, సీఎం జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఒకే గూటి పక్షులని సత్య కుమార్ విమర్శించారు. వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కేటీఆర్ ఇలాంటి విమర్శలు చేసి సమస్యలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కేటీఆర్ మాట్లాడుతుంటే నవ్వువస్తోందన్నారు. ఉద్యోగాలు ఇచ్చామన్న కేటీఆర్ ఎవరికి ఇచ్చారో చెప్పాలన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని, నిరుద్యోగులకు కాదన్నారు. 

టీడీపీ, వైసీపీ పొత్తులపై 

ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాల టైముంద కాబట్టి పొత్తులపై అప్పుడే స్పందించలేమని సత్య కుమార్ తెలిపారు.  ఏపీలో జనసేన పార్టీతో పొత్తుందని, ఈ పొత్తుని ఎన్నికల సమయం దాకా కొనసాగిస్తామన్నారు. ఏపీలో అత్యంత ప్రజాధరణ కలిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక్క పవన్ కల్యాణ్ మాత్రమే అన్నారు. రాష్ట్రంలో పవన్ ప్రజాదరణ, జాతీయ స్థాయిలో నరేంద్రమోదీ ప్రజాదరణ, సంక్షేమ పథకాలు, అభివృద్ధిని తీసుకెళ్తామన్నారు. ఎన్నికల సమయంలో ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలో ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్ కలసి నిర్ణయిస్తారన్నారు. టీడీపీ, వైసీపీలతో సమాన దూరం పాటిస్తా్మన్నారు. టీడీపీ, వైసీపీ ఈ రెండు పార్టీలు అవినీతి పార్టీలు పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిన పార్టీలని విమర్శించారు. చంద్రబాబు, జగన్ ఇద్దరూ ఆస్తులు పెంచుకుంటూ రాష్ట్రాన్ని అప్పుల ఉబిలోకి నెట్టారని ఆరోపించారు. 

టాప్ హెడ్ లైన్స్

Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget