అన్వేషించండి

AP Assembly Session: అసెంబ్లీకి వచ్చిన జగన్.. గవర్నర్ ప్రసంగం మధ్యలోనే వైసీపీ సభ్యులతో కలిసి వాకౌట్

AP Assembly Budget Session |మాజీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీకి వచ్చారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిలిపివేయాలని, రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలని నినాదాలు చేసిన వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.

YSRCP MLAs and MLCs Walkout | అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలైన కాసేపటికే వైఎస్సార్ సీపీ సభ్యులు సభ నుంచి వెళ్లిపోయారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తుంటే అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైసీపీ సభ్యులు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలుచేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. వైఎస్సార్ సీపీ చాంబర్ నుంచి సభకు వచ్చిన మాజీ సీఎం జగన్ పార్టీ సభ్యులతో కలిసి మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలని నినాదాలు చేసుకుంటూ అసెంబ్లీలోకి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొంత సమయానికే సభ వాకౌట్ చేశారు. 


AP Assembly Session: అసెంబ్లీకి వచ్చిన జగన్.. గవర్నర్ ప్రసంగం మధ్యలోనే వైసీపీ సభ్యులతో కలిసి వాకౌట్

గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలు నిర్వీర్యం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు. రాష్ట్ర విభజన సమస్యలతో పాటు ఆర్థిక కష్టనష్టాల మధ్య ప్రస్తుత కూటమి ప్రభుత్వం పాలన ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలు నిర్వీర్యమై అభివృద్ధి ఆగిపోయిందని, ఆర్థిక ఇబ్బందులు తీవ్రమయ్యాయని ఆయన అసహనం వ్యక్తం చేశారు. గతంలో శాంతిభద్రతలకు విఘాతం కలగడమే కాకుండా, 22ఏ వంటి నిబంధనలు దుర్వినియోగం అయ్యాయని విమర్శించారు. విద్యుత్, సాగునీరు, రహదారులు వంటి కీలక మౌలిక వసతుల రంగాల్లో ప్రగతి కుంటుపడిందని వివరించారు.


AP Assembly Session: అసెంబ్లీకి వచ్చిన జగన్.. గవర్నర్ ప్రసంగం మధ్యలోనే వైసీపీ సభ్యులతో కలిసి వాకౌట్

2024లో రాష్ట్రాన్ని పునర్నిర్మించే బాధ్యతను ప్రజలు కూటమికి అప్పగించారని గవర్నర్ గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నాయకత్వంలో, ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా సాగుతోందని చెప్పారు. గత 19 నెలల కాలంలో వ్యవస్థలను గాడిలో పెట్టి, సూపర్ సిక్స్ సహా పలు సంక్షేమ కార్యక్రమాలను పునఃప్రారంభించినట్లు తెలిపారు. పాలనలో పారదర్శకత కోసం ఏడు శ్వేత పత్రాలను విడుదల చేసి, వ్యవస్థల పునరుద్ధరణపై తొలి తొమ్మిది నెలల కాలంలోనే ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ప్రశంసించారు.


AP Assembly Session: అసెంబ్లీకి వచ్చిన జగన్.. గవర్నర్ ప్రసంగం మధ్యలోనే వైసీపీ సభ్యులతో కలిసి వాకౌట్

రాష్ట్ర భవిష్యత్తు కోసం 'స్వర్ణాంధ్ర 2047' లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రకటించారు. పది సూత్రాలను నిర్దేశించుకుని సుపరిపాలన అందించడమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని సమతూకంగా పాటిస్తూ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే ఈ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. వ్యవస్థల పునర్నిర్మాణం ద్వారా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఫిబ్రవరి 12, 13 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు

అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే సభ వాయిదా పడుతుంది. అనంతరం స్పీకర్ అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏయే అంశాలపై ఎప్పుడు చర్చించాలనే దానిపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటారు. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో చర్చ జరుగుతుంది. ఈ చర్చ ముగింపులో ముఖ్యమంత్రి చంద్రబాబు సభ్యులు లేవనెత్తిన అంశాలకు సమాధానం ఇస్తారు.


AP Assembly Session: అసెంబ్లీకి వచ్చిన జగన్.. గవర్నర్ ప్రసంగం మధ్యలోనే వైసీపీ సభ్యులతో కలిసి వాకౌట్

అత్యంత కీలకమైన రాష్ట్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 14న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశపెడతారు. శివరాత్రి పండుగను పురస్కరించుకుని ఫిబ్రవరి 15 (ఆదివారం), 16 తేదీల్లో అసెంబ్లీకి సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. తిరిగి ఫిబ్రవరి 17 నుంచి రెండు మూడు రోజుల పాటు బడ్జెట్‌పై సాధారణ చర్చ కొనసాగుతుంది. ఆ తర్వాత వివిధ ప్రభుత్వ శాఖల వారీగా గ్రాంట్లు, డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించి ఆమోదం తెలుపుతారు.

ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం కేవలం ఆర్థిక అంశాలకే పరిమితం కాకుండా చట్టసభలో బిల్లులను కూడా ప్రవేశపెట్టనుంది. గతంలో తీసుకువచ్చిన నాలుగు ఆర్డినెన్సుల స్థానంలో కొత్త బిల్లులను ప్రభుత్వం సభ ముందుకు తీసుకువస్తుంది. పరిపాలనలో సంస్కరణలు, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ బిల్లులు కీలకం కానున్నాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
VB GRAM G Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో వీబీ గ్రామ్‌జీ పథకం ప్రారంభం! గ్రామాల్లో విప్లవం మొదలైందన్న సీఎం, డిప్యూటీ సీఎం!
ఆంధ్రప్రదేశ్‌లో వీబీ గ్రామ్‌జీ పథకం ప్రారంభం! గ్రామాల్లో విప్లవం మొదలైందన్న సీఎం, డిప్యూటీ సీఎం!
Prasna Ravan Bail and Arrest: అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్‌ ప్రశ్న రావణ్‌ మళ్లీ అరెస్టు! 2025 నాటి కేసులో చర్యలు!
అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్‌ ప్రశ్న రావణ్‌ మళ్లీ అరెస్టు! 2025 నాటి కేసులో చర్యలు!
AP TET 2026: ఆంధ్రప్రదేశ్‌ టెట్ అభ్యర్థులకు అలర్ట్! దరఖాస్తుల సవరణకు వన్ టైమ్ డిలీట్ ఆప్షన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌ టెట్ అభ్యర్థులకు అలర్ట్! దరఖాస్తుల సవరణకు వన్ టైమ్ డిలీట్ ఆప్షన్! పూర్తి వివరాలు ఇవే!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Food Safety Raids: సోదాల జోరు సరే.. హోటళ్లు దారికి వచ్చే పక్కా యాక్షన్ ప్లాన్ ఏది?
సోదాల జోరు సరే.. హోటళ్లు దారికి వచ్చే పక్కా యాక్షన్ ప్లాన్ ఏది?
Rains in Andhra Pradesh and Telangana: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్
Drugs Smuggling via Speed Post: వీడు మామూలోడు కాదు - తపాలా శాఖ ద్వారానే గంజాయి డెలివరీ !
వీడు మామూలోడు కాదు - తపాలా శాఖ ద్వారానే గంజాయి డెలివరీ !
Sri Sathya Sai District Solar Plant Farmers Issue: కదిరిలో రైతులకు ప్రైవేటు సోలార్ ప్లాంట్ యాజమాన్యం బెదిరింపులు - బాధితులకు అండగా బీజేపీ !
కదిరిలో రైతులకు ప్రైవేటు సోలార్ ప్లాంట్ యాజమాన్యం బెదిరింపులు - బాధితులకు అండగా బీజేపీ !
Yashasvi Jaiswal In FIFA World Cup : ఇండియన్ స్టార్ యశస్వి జైస్వాల్ సందడి.. మెస్సి జెర్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్, ఎంబాప్పే డబుల్ గోల్స్ ధమాకా!
ఫిఫా ప్రపంచకప్ లో ఇండియన్ స్టార్ యశస్వి జైస్వాల్ సందడి.. మెస్సి జెర్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్, ఎంబాప్పే డబుల్ గోల్స్ ధమాకా!
Username Row: వాట్సాప్ తర్వాత యూజర్‌నేమ్ వివాదంలో సిగ్నల్, టెలిగ్రామ్‌లకు ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసులు!
వాట్సాప్ తర్వాత యూజర్‌నేమ్ వివాదంలో సిగ్నల్, టెలిగ్రామ్‌లకు ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసులు!
Sierra EV Launch: టాటా సియారా EVతో పోలిస్తే క్రెటా , కర్వ్ EVలు ఎందుకు వెనుకబడింది?
టాటా సియారా EVతో పోలిస్తే క్రెటా , కర్వ్ EVలు ఎందుకు వెనుకబడింది?
Stay Positive : రోజంతా పాజిటివ్‌గా ఉండాలంటే.. ఉదయాన్నే ఈ అలవాట్లు ఫాలో అయిపోండి
రోజంతా పాజిటివ్‌గా ఉండాలంటే.. ఉదయాన్నే ఈ అలవాట్లు ఫాలో అయిపోండి
Embed widget