అన్వేషించండి

ఉన్న ప్రతిపక్షాలకే ఆదరణ లేదు- వచ్చే బీఆర్‌ఎస్‌ ఏం చేస్తుంది: ఏపీ మంత్రులు

టీఆర్‌ఎస్‌ బీఆర్‌ఎస్‌గా మారడంపై ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు సీరియస్‌గా స్పందించారు. రాజకీయా పార్టీలు ఎన్ని వచ్చినప్పటికీ తమకు డోకా లేదన్నారు.

ఏపీపై బీఆర్‌ఎస్‌ ప్రభావం ఉండబోదన్నారు మంత్రి జోగి రమేష్‌. దేశంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చని... వాళ్లందరి గురించి ఆలోచించాల్సిన అవసరం తమకు లేదన్నారు. ప్రస్తుతం ఏపీలో తమకు మరో ఇరవై ఏళ్లు తిరుగు లేదన్నారాయన. ఉన్న పార్టీలకే స్కోప్‌ లేనప్పుడు కొత్తగా వచ్చే పార్టీలు ఏం చేస్తాయని ప్రశ్నించారు. ప్రజలంతా తమవైపే ఉన్నారని అభిప్రాయపడ్డారు. తాము తీసుకొచ్చిన కార్యక్రమాలు సంక్షేమ పథకాలకు బ్రహ్మరథం పడుతున్నారని రాష్ట్రాభివృద్ధిని స్వాగతిస్తున్నారని అన్నారు. 

మరో మంత్రి అమర్‌నాథ్ స్పందిస్తూ ఎవరు ఎలా వచ్చినా ఏపీలో తమకు ఢోకా లేదన్నారు. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో తాము విజయం సాధిస్తామన్నారు. ఇప్పుడున్న ప్రతిపక్షాలనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆదరించడం లేదని కొత్తగా వచ్చే పార్టీలు ఏం చేస్తాయని ప్రశ్నించారు. ఉన్న బీజేపీకే ఒక శాతం ఓట్లు కూడా లేని విషయాన్ని అమర్‌నాథ్ గుర్తు చేశారు. 

బీఆర్‌ఎస్‌గా టీఆర్‌ఎస్

తెలంగాణ రాజ‌కీయ చ‌రిత్ర‌లో స‌రికొత్త అధ్యాయం ప్రారంభమయింది.  భార‌త్ రాష్ట్ర స‌మితిగా సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. జాతీయ పార్టీగా మారుస్తూ ఏక‌గ్రీవ తీర్మానం చేశారు. 21 ఏండ్ల టీఆర్ఎస్ ప్ర‌స్థానంలో మ‌రో మలుపు చోటు చేసుకుంది. ప‌లు రాష్ట్రాల నేత‌ల స‌మ‌క్షంలో కేసీఆర్ ప్ర‌క‌ట‌న చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) గా ఉన్న పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా మార్చడంతో పాటు టీఆర్ఎస్ను జాతీయ పార్టీగా మారుస్తూ పార్టీ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు.  టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూ పార్టీ కార్యవర్గం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ్యులందరూ  ఆమోదించారు. దీంతో మధ్యాహ్నం 1.19 గంటలకు బీఆర్ఎస్ పార్టీ పేరును ప్రకటించారు.

ముహుర్తం ప్రకారం టీఆర్ఎస్ పేరును  బీఆర్ఎస్‌గా మారుస్తున్నట్లుగా కేసీఆర్ ప్రకటన

బీఆర్ఎస్ ఆవిర్భావ తీర్మానానికి టీఆర్ఎస్ పార్టీ స‌ర్వ‌స‌భ్య స‌మావేశం ఆమోదించింది.తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో టీఆర్‌ఎస్‌ పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది.  సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటు పార్లమెంట్‌ సభ్యులు, జిల్లా పరిషత్‌ అధ్యక్షులు సహా 283 మంది కీలక ప్రతినిధులు భేటీకి హాజరయ్యారు. అలాగే సమావేశానికి పలు రాష్ట్రాల నేతలు సైతం హాజరయ్యారు. సమావేశంలో మాట్లాడిన సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందని ప్రకటించారు. 21 ఏళ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో దీన్ని కీలక మలుపుగా అభివర్ణించారు. పార్టీ సర్వసభ్య సమావేశానికి హాజరైన పలు రాష్ట్రాల నేతల సమక్షంలో కేసీఆర్ ఈ ప్రకటన చేశారు. దీంతో హైదరాబాద్లోని తెలంగాణ భవన్ వద్ద  బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మిఠాయిలు పంచి, బాణసంచా పేల్చి సంబురాలు చేసుకున్నారు.

కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి ఇతర పార్టీల ప్రతినిధులు హాజరు 

కర్నాటక మాజీ ముఖ్యమంతి, జేడీఎస్‌ నేత హెడీ కుమారస్వామి, ఆయన పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, తమిళనాడుకు చెందిన వీసీకే పార్టీ అధినేత తిరుమావళన్‌తో పాటు ఎంపీలు భేటీకి హాజరయ్యారు.ప్రస్తుతం జాతీయ పార్టీగా ఎందుకు మారుస్తున్నామో సభ్యులకు కేసీఆర్‌ వివరించారు.  అనంతరం టీఆర్‌ఎస్‌ను జాతీయ పార్టీగా మారుస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు.   తీర్మానానికి ఆమోదం తెలుపుతూ 283 మంది సభ్యులు ఆమోదముద్ర వేశారు.  ఆ తర్వాత సంతకాలు చేశారు.  

ఈసీ అనుమతి పొందిన తర్వాతనే అధికారికంగా మార్పు 

అయితే కార్యవర్గ సమావేశంలో తీర్మానం మాత్రమే చేశారు. ఈసీ ఆమోదించాల్సి ఉంది. ఈ తీర్మానంతో .. టీఆర్ఎస్ ప్రతినిధుల బృందం ఢిల్లీ వెళ్లి ఎన్నికలసంఘం ప్రతినిధులతో భేటీ అవుతుంది. వారికి సమర్పించి తెలంగాణ రాష్ట్ర సమితిపేరును రద్దు చేయించి..  భారత రాష్ట్ర సమితిగా మార్పు చేయిస్తారు. ఏమైనా అభ్యంతరాలు వ్యక్తం అయితే ఈ ప్రక్రియలో ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకూ  తెలంగాణ రాష్ట్ర సమితి ఉంటుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Governor: బుధవారం తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న రాధాకృష్ణన్
Telangana Governor: బుధవారం తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న రాధాకృష్ణన్
Jagan Tour : ఇడుపుల పాయ నుంచి  ఇచ్చాపురం బస్సు యాత్ర - జగన్ ప్రచారం ఖరారు !
ఇడుపుల పాయ నుంచి ఇచ్చాపురం బస్సు యాత్ర - జగన్ ప్రచారం ఖరారు !
BCCI: జాక్‌పాట్‌ కొట్టిన సర్ఫరాజ్‌, జురెల్‌
జాక్‌పాట్‌ కొట్టిన సర్ఫరాజ్‌, జురెల్‌
Hyderabad News: హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం-   చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం- చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Chilukur Balaji Temple | ముస్లిం రైతుకు పశువును బహుమతిగా ఇచ్చిన అర్చకులు రంగరాజన్ | ABP DesamMachu Lakshmi Adiparvam Trailer Launch | కాళ్లపై పడిపోయే ఫ్యాన్స్ మంచు లక్ష్మీకి ఉన్నారోచ్ | ABPMS Dhoni IPL 2024 Retirement | మహేంద్ర సింగ్ ధోనికి ఇదే లాస్ట్ ఐపీఎల్ సీజనా.? | ABP DesamSRH Captain Pat Cummins IPL 2024 | కమిన్స్ రాకతోనైనా ఆరెంజ్ ఆర్మీ ఆకట్టుకుంటుందా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Governor: బుధవారం తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న రాధాకృష్ణన్
Telangana Governor: బుధవారం తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న రాధాకృష్ణన్
Jagan Tour : ఇడుపుల పాయ నుంచి  ఇచ్చాపురం బస్సు యాత్ర - జగన్ ప్రచారం ఖరారు !
ఇడుపుల పాయ నుంచి ఇచ్చాపురం బస్సు యాత్ర - జగన్ ప్రచారం ఖరారు !
BCCI: జాక్‌పాట్‌ కొట్టిన సర్ఫరాజ్‌, జురెల్‌
జాక్‌పాట్‌ కొట్టిన సర్ఫరాజ్‌, జురెల్‌
Hyderabad News: హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం-   చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం- చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
Brothers As DGPs: దేశ పోలీసు వ్య‌వ‌స్థ‌లో రికార్డు.. రెండు రాష్ట్రాల‌కు డీజీపీలుగా అన్న‌ద‌మ్ములు
దేశ పోలీసు వ్య‌వ‌స్థ‌లో రికార్డు.. రెండు రాష్ట్రాల‌కు డీజీపీలుగా అన్న‌ద‌మ్ములు
Elections Commission News: ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఈల వేసి అధికారులను పిలవండి- మీ చేతిలోనే పవర్‌ అస్త్ర
ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఈల వేసి అధికారులను పిలవండి- మీ చేతిలోనే పవర్‌ అస్త్ర
SS Rajamouli: ఎన్టీఆర్ క్యారెక్టర్ మార్చిన రాజమౌళి - 'ఆర్ఆర్ఆర్'ను అలా తీస్తే ఎలా ఉండేదో?
ఎన్టీఆర్ క్యారెక్టర్ మార్చిన రాజమౌళి - 'ఆర్ఆర్ఆర్'ను అలా తీస్తే ఎలా ఉండేదో?
Iswarya Menon Photos:  పింక్ శారీలో ఐశ్వర్య మీనన్ ని చూస్తే రెప్పవేయడం మర్చిపోతారంతే!
Iswarya Menon Photos: పింక్ శారీలో ఐశ్వర్య మీనన్ ని చూస్తే రెప్పవేయడం మర్చిపోతారంతే!
Embed widget