అన్వేషించండి

AP Fake Votes: ఏపీలో ఓటర్లు పెరగలేదు - నకిలీ ఓట్లపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

Fake Votes in Andhra Pradesh: రాష్ట్రంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఓటర్ల పెరుగుదల నమోదు కాలేదు, ఈ విషయంపై ఎన్నికల కమిషన్ విచారణ జరపాలని మాజీ మంత్రి పేర్ని నాని ఫిర్యాదు చేశారు.

Fake Votes in Andhra Pradesh: 
సచివాలయం, వెలగపూడి: ఆంధ్రప్రదేశ్ లో నకిలీ ఓట్ల అంశంపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య ఆరోపణలు, విమర్శలు కొనసాగుతున్నాయి. ఇదివరకే టీడీపీ శ్రేణులు రాష్ట్రంలో నకిలీ ఓట్లపై ఫిర్యాదు చేయగా ఈసీ సైతం రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకుంటోంది. తాజాగా వైసీపీ సైతం నకిలీ ఓట్లపై ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఓటర్ల పెరుగుదల నమోదు కాలేదు, ఈ విషయంపై ఎన్నికల కమిషన్ విచారణ జరపాలని మాజీ మంత్రి పేర్ని నాని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సచివాలయంలోఆంధ్రప్రదేశ్ ఛీఫ్ ఎలక్ర్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనాను కలసి వినతిపత్రం అందించారు. రాష్ర్టంలో 2014 నుండి 2019వరకు, 2019 నుండి 2023 వరకు రాష్ట్రంలో నమోదైన ఓటర్ల సంఖ్య హెచ్చు తగ్గులకు సంబంధించి ఫిర్యాదులో పేర్కొన్నారు.

2014 నుంచి 2019 వరకూ 30,08,032 ఓట్లు ఉండగా.. ఓటర్ల జాబితాలో పెరిగాయన్నారు.  అదే 2019 నుంచి 2023 కాలంలో 38 వేల ఓట్లు మాత్రమే తగ్గాయని ఫిర్యాదులో వివరించారు. అదే విధంగా ఓటర్ల వృధ్ది చూసినట్లయితే 2014-19 మధ్య కాలంలో 8.1 శాతం మేర వృద్ధి నమోదైందని 2019 నుంచి 2023 మధ్య 0.09 శాతం క్షీణత నమోదైందని పేర్ని నాని తెలిపారు.


AP Fake Votes: ఏపీలో ఓటర్లు పెరగలేదు - నకిలీ ఓట్లపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

సీఈసీకి వైసీపీ ఇచ్చిన ఫిర్యాదులో ఇంకా ఏముందంటే...... గతేడాది కంటే 2023 సంవత్సరంలో నికర ఓట్ల సంఖ్య తగ్గింది. దీనిని బట్టి నకిలీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని స్పష్టమవుతోంది. 2019 ఓటర్ల జాబితా నుండి నకిలీ ఓట్లను తొలగించే అంశాన్ని పరిశీలించాలి. నకిలీ ఓట్ల విషయంపై సమగ్ర విచారణ జరపాలని ఎన్నికల కమిషన్ ను అధికార పార్టీ కోరుతోంది. 

AP Fake Votes: ఏపీలో ఓటర్లు పెరగలేదు - నకిలీ ఓట్లపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

2014లో మొత్తం ఓటర్లు 3,68,26,744 (3 కోట్ల 68 లక్షల 26 వేల 7 వందల 44) కాగా 2019లో మొత్తం ఓటర్లు 3,98,34,776 (3 కోట్ల 98 లక్షల 34 వేల 7 వందల 76)

2014కు 2019కి మధ్య ఓట్ల తేడా 30,08,032 (పెరుగుదల 30 లక్షల 8 వేల 32)

2019లో మొత్తం ఓటర్లు 3,98,34,776, 2023లో మొత్తం ఓటర్లు 3,97,96,678

2019కి 2023కి మధ్య ఓట్ల తేడా 38,098 (తగ్గుదల 38 వేల 98) ఉందని తెలియచేశారు.


AP Fake Votes: ఏపీలో ఓటర్లు పెరగలేదు - నకిలీ ఓట్లపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
Oscar 2026 : ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Loose Motions : వాతావరణం మారగానే విరేచనాలు అవుతున్నాయా? అయితే ఈ జాగ్రత్తలతో పాటు ఈ ఫుడ్స్ తీసుకోండి
వాతావరణం మారగానే విరేచనాలు అవుతున్నాయా? అయితే ఈ జాగ్రత్తలతో పాటు ఈ ఫుడ్స్ తీసుకోండి
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
Embed widget