అన్వేషించండి

Andhra Pradesh Politics: చంద్రబాబు వేధింపులు భరించలేక ఐపీఎస్‌లు రాజీనామా చేసి వెళ్లిపోతున్నారు- జగన్

YS Jagan Press Meet | ఇటీవల గుడివాడలో కృష్ణా జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక, ఆమె భర్త మీద దాడి చేపించిన చంద్రబాబు దానవీరశూరకర్ణ కంటే బాగా నటించారు, ఎన్టీఆర్ కన్నా గొప్ప నటుడు అని జగన్ అన్నారు.

YS Jagan Satires on AP CM Chandrababu | తాడేపల్లి: ఎన్టీఆర్ కంటే గొప్ప నటుడు చంద్రబాబు అని.. దానవీరశూరకర్ణ కన్నా గొప్పగా ఏపీ సీఎం నటించారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. మీరు దాడి చేసి జడ్పీ చైర్ పర్సన్ హారికను మహానటి అని మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు. హారిక భర్త రాము తన కారుతో ఢీకొట్టాడని తప్పుడు కేసు పెట్టి వేధిస్తున్నారు. డ్రైవర్ గవర్నమెంట్ ఉద్యోగి, వెనక సీట్లో కూర్చున్న వ్యక్తిపై ఏ విధంగా కేసు పెట్టారో అర్థం కావడం లేదు. ఈ దాడి ఘటనలో పోలీసులు ఎంత మందిని అరెస్ట్ చేశారు. ప్లాన్ చేసి దాడులు చేస్తున్నా పోలీసులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తన పర్యటన ఉంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారని చంద్రబాబుపై ఆరోపణలు గుప్పించారు. 

తాడేపల్లిలో వైఎస్ జగన్ ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ.. ‘వైసీపీ పాలనలో ప్రజలు తలెత్తుకుని పనిచేసేవారు. స్పందన అనే కార్యక్రమంలో వైసీపీ వాళ్ల కన్నా టీడీపీ వాళ్ల సమస్యలే ఎక్కువగా పరిష్కారం చేశాం. ఎవరికి సమస్య వచ్చినా చంద్రబాబు మాట వినని పోలీసులు అధికారుల పరిస్థితి ఎలా ఉందంటే.. డీజీ స్థాయి అధికారి అయిన పీఎస్ఆర్ ఆంజనేయులును, మరో అడిషనల్ డీజీ స్థాయి అధికారి సునీల్ కుమార్,  సంజయ్ అనే అధికారి, బీసీ అధికారి క్రాంతి రానా టాటా, డీఐజీ స్థాయి విశాల్ గున్నీలపై అక్రమ కేసులు బనాయించారు. విచారణ పేరుతో ఎంతో మంది ఎస్పీలను వేధించారు. 22 మంది అడిషనల్ ఎస్పీలు, 50 మంది డీఎస్పీలకు పోస్టింగ్ ఇవ్వలేదు. మరికొందరు పోలీసు ఉన్నతాధికారులను హెడ్ క్వార్టర్ లో రిపోర్ట్ చేయాలన్నారు. ఎంతో మంది అధికారులు వీఆర్ లో ఉన్నారు. 

వేధింపులు తట్టుకోలేక అధికారులు రాజీనామా
’తన మోచేతి నీళ్లు తాగే అధికారులను మాత్రమే పోత్సహిస్తూ వారిని అవినీతిలో భాగస్వామ్యం చేస్తున్నారు. వీరు ఆయన ఆర్మీగా మారి బెల్ట్ షాపులు, నియోజకవర్గంలో పరిశ్రమలు, పేకాడ క్లబ్బుల విషయంలో డీఐజీల ఆధ్వర్యంలో సీఐలు కలెక్ట్ చేసి ఎమ్మెల్యేలకు మనీ ఇస్తున్నారు. పైకి చినబాబు, పెద్దబాబుకు వెళ్తుంది. సిద్ధార్థ కౌశల్ లాంటి యంగ్ ఐపీఎస్ అధికారి వేధింపులు తట్టుకోలేక రాజీనామా చేసి వెళ్లిపోతున్నారు. నేరాలు చేసేవాళ్లకు బదులు, పోలీసులు రాష్ట్రాన్ని వదిలి వెళ్తున్న దుస్థితి ఏపీలో ఉంది.‘ 

ఇన్నేళ్ల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబుకు ప్రతిపక్షం పాత్ర ఏంటో కూడా తెలియదా. ప్రజల పక్షాన పోరాడాల్సిన బాధ్యత మాపై ఉంది. గుడివాడలో కృష్ణా జిల్లా చైర్ పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ సైకోలు, చంద్రబాబు శాడిస్ట్ గ్యాంగ్ దాడి చేసింది. బీసీ మహిళ అయిన హారిక చేసిన తప్పేంది. ఆమెను నోటికొచ్చిన మాటలు ఎందుకన్నారు. చంద్రబాబు మోసాలను, హామీల అమలుపై ప్రశ్నిస్తే వైసీపీ మహిళా నేతకు ఇలాంటి పరిస్థితి తలెత్తింది. కారు అద్దాలు పగలగొడుతుంటే గంటలపాటు ఆమె తన భర్తతో పాటు భయంభయంగా వాహనంలోనే కూర్చున్నారు. పోలీసుల సమక్షంలోనే ఇది జరుగుతున్నా వారు ప్రేక్షకపాత్ర పోషించారు. 

రైతులను పరామర్శించినా కేసులే..

మిర్చి ధరలు పడిపోయాయని ఫిబ్రవరిలో గుంటూరు మిర్చియార్డుకు వెళ్లాను. గతంలో మా ప్రభుత్వంలో మిర్చి క్వింటాలు ధర రూ.21 నుంచి 27 వేలు. ఇప్పుడు మిర్చి ధర 8 నుంచి 10 వేలకు పడిపోయింది. రైతులకు అండగా మిర్చి యార్డుకు వెళ్లడం తప్పా. పోలీసులు సహకరించవద్దు అని నాకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను తొలగించారు. చంద్రబాబు ఆదేశాలతో మాకు సహకరించకపోగా, రైతులకు సంఘీభావం తెలిపినందుకు తిరిగి మాపైనే కేసులు పెట్టారు.

సంఘీభావం తెలిపినా నాపై అక్రమ కేసులు

సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో స్థానిక ఎమ్మెల్యే చేతిలో వైసీపీ నేత కురుమ లింగయ్య హత్యకు గురైతే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే.. భద్రత కరువైంది. హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతింది. రామగిరిలో పర్యటన తరువాత వైసీపీ ఇంచార్జ్ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీద అక్రమ కేసులు పెట్టారు. పార్టీకి చెందిన వారికి సమస్య వస్తే పరామర్శించడం కూడా తప్పేనా.. పొగాకు ధరలు పడిపోవడంతో పొదిలికి వెళ్తే వేధించారు. 160కి పడిపోయింది. అసలు కొనేనాథుడు లేదు. గతంలో 180 పైచిలుకు ఉండే ధర రూ.80 కి పడిపోయింది. ఎక్కడ పరామర్శకు వెళ్లినా, రైతులకు సంఘీభావం తెలిపినా అక్రమ కేసులు పెడుతున్నారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jagruthi Kavitha: గుంపు మేస్త్రీ ,గుంటనక్క కలిసి ట్యాపింగ్ డ్రామాలుడుతున్నారు - కవిత తీవ్ర వ్యాఖ్యలు
గుంపు మేస్త్రీ ,గుంటనక్క కలిసి ట్యాపింగ్ డ్రామాలుడుతున్నారు - కవిత తీవ్ర వ్యాఖ్యలు
IND vs NZ 1st ODI: భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి EPFO 3.0 పోర్టల్.. మనీ విత్‌‌డ్రా ఈజీ
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి EPFO 3.0 పోర్టల్.. మనీ విత్‌‌డ్రా ఈజీ
Sandhya Nama Upasate Trailer : క్వారంటైన్ కలిపింది ఇద్దరినీ - బంధం... భయం... ఎమోషన్... కట్ చేస్తే సంధ్యానామ ఉపాసతే
క్వారంటైన్ కలిపింది ఇద్దరినీ - బంధం... భయం... ఎమోషన్... కట్ చేస్తే సంధ్యానామ ఉపాసతే

వీడియోలు

MI vs DC WPL 2026 | ముంబై ఢిల్లీ విజయం
Rohit, Virat BCCI Contracts Changes | విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్?
Ishan Kishan Ind vs NZ T20 | ఇషాన్ కిషన్ పై సూర్య సంచలన ప్రకటన
India vs New Zealand T20 Preview | నేడు భారత్ - న్యూజిలాండ్ మొదటి టీ20
Medaram Jatara Houseflies Mystery | మేడారం మహాజాతరలో కనిపించని ఈగలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagruthi Kavitha: గుంపు మేస్త్రీ ,గుంటనక్క కలిసి ట్యాపింగ్ డ్రామాలుడుతున్నారు - కవిత తీవ్ర వ్యాఖ్యలు
గుంపు మేస్త్రీ ,గుంటనక్క కలిసి ట్యాపింగ్ డ్రామాలుడుతున్నారు - కవిత తీవ్ర వ్యాఖ్యలు
IND vs NZ 1st ODI: భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి EPFO 3.0 పోర్టల్.. మనీ విత్‌‌డ్రా ఈజీ
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి EPFO 3.0 పోర్టల్.. మనీ విత్‌‌డ్రా ఈజీ
Sandhya Nama Upasate Trailer : క్వారంటైన్ కలిపింది ఇద్దరినీ - బంధం... భయం... ఎమోషన్... కట్ చేస్తే సంధ్యానామ ఉపాసతే
క్వారంటైన్ కలిపింది ఇద్దరినీ - బంధం... భయం... ఎమోషన్... కట్ చేస్తే సంధ్యానామ ఉపాసతే
Amaravati News: అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు.. ఏపీ సర్కార్ ఇకపై అన్నీ ఇక్కడే చేస్తుందా?
అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు.. ఏపీ సర్కార్ ఇకపై అన్నీ ఇక్కడే చేస్తుందా?
Sunita Williams Retires: నాసా నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సునీతా విలియమ్స్, ఆమెకు పెన్షన్ ఎంత వస్తుంది?
నాసా నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సునీతా విలియమ్స్, ఆమెకు పెన్షన్ ఎంత వస్తుంది?
KTR News: దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
AR Rahman: భగవద్గీత, ఖురాన్ చదవరు కానీ మా నాన్నను తిడతారు... తండ్రికి సపోర్టుగా ఏఆర్ రెహమాన్ పిల్లలు
భగవద్గీత, ఖురాన్ చదవరు కానీ మా నాన్నను తిడతారు... తండ్రికి సపోర్టుగా ఏఆర్ రెహమాన్ పిల్లలు
Embed widget