అన్వేషించండి

Viveka Murder Case: వివేకా హత్య కేసును సీబీఐ మళ్లీ దర్యాప్తు చేయాలి: ప్రజాప్రతినిధులకు సునీత లేఖ

YS Sunitha Letter over Viveka Murder Case | తన తండ్రి వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ రీఓపెన్ చేసి దర్యాప్తు చేపట్టేలా చేయాలని కోరుతూ ప్రజాప్రతినిధులకు వైఎస్ సునీత లేఖ రాశారు.

Andhra Pradesh News | అమరావతి: ఏపీ మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు (Viveka Murder Case)లో  న్యాయం జరిగేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)పై మళ్లీ ఒత్తిడి తెచ్చేలా చూడాలని ఆయన కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత పార్లమెంట్‌ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కోరారు. తన తండ్రి వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తును మళ్లీ ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ, ఆమె  దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులకు ఓ బహిరంగ లేఖ రాశారు. వివేకా చనిపోయారన్న విషయం ప్రపంచానికి తెలియడానికి చాలా సమయం ముందే వైఎస్ జగన్‌కు తెలిసిందని దర్యాప్తులో తేలిందన్నారు.

కుట్రదారులను గుర్తించకుండా దర్యాప్తు ముగించారు

ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న కడప ఎంపీ, వైఎస్సార్ సీపీ నేత వైఎస్‌ అవినాష్ రెడ్డి తన తండ్రి వివేకాను హత్య చేసిన వారితో నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు కాల్‌ డేటా రికార్డుల ఆధారంగా సీబీఐ ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో తెలిపిందని సునీత గుర్తుచేశారు. అయినా, ఆ కోణంలో విచారణ చేయకుండానే సీబీఐ తాత్కాలికంగా దర్యాప్తును ముగించిందని ఆమె విమర్శించారు. అసలు కుట్రదారులెవరో గుర్తించకుండానే దర్యాప్తు ముగిసినట్టు ప్రకటించడం బాధారం అన్నారు.  "ఒక సోదరిగా నేను న్యాయం కోసం చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వండి" అని రాఖీ పౌర్ణమి సందర్భంగా సునీతా రెడ్డి ప్రజాప్రతినిధులను కోరారు.

ఆరేళ్లు అయినా న్యాయం జరగలేదు..
"నా తండ్రి వివేకానందరెడ్డి హత్యకేసులో న్యాయం కోసం గత ఆరు సంవత్సరాలుగా నిరంతరం పోరాడుతున్నాను. నా తండ్రి సాయం, మా కుటుంబ మద్దతుతో ఏర్పడిన పార్టీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే నన్ను వేధించింది. ప్రజాస్వాయ్యం ఖూనీ జరుగుతోంది. మాజీ ప్రజాప్రతినిధి, మా సీఎం సోదరుడు హత్య కేసులో ఇప్పటికీ న్యాయం దక్కలేదు. హత్య చేసిన నిందితులను పట్టుకున్నా, వివేకానందరెడ్డి హత్యకు కుట్ర పన్నిన వారిని మాత్రం వదిలేశారు. ఈ పోరాటంలో నాకు మీ సహాయం కావాలి"

ఎన్నికల్లో ఆయుధంగా వాడుకున్నారు..
"2019 ఎన్నికల సమయంలో నా తండ్రి వివేకానందరెడ్డి హత్యను వైఎస్సార్ సీపీ ఓ రాజకీయ ఆయుధంగా వాడుకుంది. హంతకులను పట్టుకుంటానని హామీ ఇచ్చిన నా సోదరుడు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి కేసు కీలకమైన దశలో ఉన్న సమయంలో దర్యాప్తు చేస్తున్న సిట్‌ను మార్చేశారు. సీబీఐ విచారణ అవసరం లేదని చెప్పి, అలా చేస్తే ఎంపీ అవినాష్ పార్టీ మారుతాడని సాకులు చెప్పారు. నాకు న్యాయం జరగదని అప్పుడే అర్థమైంది" అని ప్రజాప్రతినిధులకు రాసిన లేఖలో వైఎస్ సునీత స్పష్టం చేశారు.

గుండెపోటు అన్నారు.. వెళ్లి చూస్తే గాయాలు
నా తండ్రి హత్య జరిగిన రోజు ‘సాక్షి’ ఛానెల్ గుండెపోటుతో చనిపోయారని వార్త ప్రసారం చేసింది. తీరా మేం పులివెందులుకు వెళ్లి చూస్తే ఆయన శరీరంపై గాయాలు కనిపించడంతో అనుమానం వచ్చింది. ఆయనను సరిగ్గా చూపించకుండా బ్యాండేజీలు చుట్టారు. తరువాత అధికారం మారినా న్యాయం జరగలేదు. హత్య కేసుతో సంబంధం ఉన్న అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడంలో పోలీసులు సహకరించలేదు. దాంతో కేసు నీరుగార్చే కుట్ర జరిగింది" అని వైఎస్ సునీత తన లేఖలో ప్రస్తావించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Andhra Pradesh Rajya Sabha Elections:అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
B.Tech Student Missing: హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి
హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి
UGC Net Exam schedule: యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలివే
యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలివే
TDP Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Dimple Hayathi On Peddi: హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
Shani Dev Story: నేను శని దేవుడిని.. శిక్షించేవాడిని మాత్రమే కాదు న్యాయంగా నడిపించేవాడిని!
నేను శని దేవుడిని.. శిక్షించేవాడిని మాత్రమే కాదు న్యాయంగా నడిపించేవాడిని!
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
WagonR నుంచి Creta వరకు.. మార్కెట్లో జోష్‌ పెంచిన Flex Fuel వాహనాలు ఇవే
WagonR నుంచి Creta వరకు.. మార్కెట్లో జోష్‌ పెంచిన Flex Fuel వాహనాలు ఇవే
Embed widget