అన్వేషించండి

YS Jagan In AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం, ఛార్జ్‌షీట్లో జగన్ పేరు

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. లిక్కర్ స్కామ్ కేసు ఛార్జిషీట్లో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరును పలుమార్లు ప్రస్తావించారు.

వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో సీట్ అధికారులు 305 పేజీలతో ప్రాథమిక ఛార్జిషీట్ శనివారం సాయంత్రం దాఖలు చేశారు. అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలిసే లిక్కర్స్ కం జరిగిందని సెట్ అధికారులు చాట్ చేసి ఇంట్లో పేర్కొన్నారు. లిక్కర్ స్టాండ్ చార్జిషీట్లో మాజీ సీఎం జగన్ పేరు పలుమార్లు ప్రస్తావించారు. నిందితులంతా జగన్ అత్యంత సన్నిహితులు, పరిచయస్థలేనని పేర్కొన్నారు. అయితే ఈ ప్రాథమిక ఛార్జ్ సీట్లో జగన్ పేరు అందితుడిగా చేర్చలేదు. తాజాగా మరో ఎనిమిది మందిని లిక్కర్ స్కాం కేసులో నిందితులుగా చేర్చారు. 

కొత్త లిక్కర్ పాలసీ విధానం రూపకల్పన, ముడుపుల కోసం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, దాని అమలు, ఈ సొమ్ము ఎలా వసూలు చేశారు, ఎక్కడికి తరలించారు అనే అంశాలను ప్రాథమిక ఛార్జిషీట్లో సిట్ అధికారులు ప్రస్తావించారు. ఈ కేసులో ఇదివరకే 40 మంది వ్యక్తులు, కొన్ని సంస్థలు నిందితులుగా ఉండగా, మరో 8 మందిని లిక్కర్ కేసులో నిందితులుగా చేర్చారు. మొత్తం 16 మందిపై ఈ కేసులో అభియోగాలు ఉన్నాయి. జగన్ కు తెలిసే లిక్కర్ పాలసీ స్కామ్ జరిగిందని ప్రాథమిక ఛార్జ్ షీట్లో పేర్కొనడం చూస్తే.. రెండో ఛార్జిషీట్లో మరిన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. 

మరో ఎనిమిది మందిని నిందితులుగా చేర్చిన సిట్

1. సైమన్ ప్రసన్
2. కొమ్మారెడ్డి అవినాష్
3.  అనిల్ రెడ్డి
4. సుజల్ బెహ్రన్
5. మోహన్
6. రాజీవ్
7. బొల్లారం శివ
8. ముప్పిడి అవినాష్

ప్రీమిలినరీ ఛార్జ్ షీట్ ను సిట్ అధికారులు కోర్టుకు సమర్పించారు. 300 పేజీల పైగా ఛార్జ్ షీట్ లో 100కు పైగా ఫోరెన్సిక్ రిపోర్టులు జత చేశారు. ఇప్పటివరకూ రూ.62 కోట్లు సీజ్ చేసినట్లు ప్రస్తావించారు. 100 కు పైగా ఎలక్ట్రానిక్ పరికరాలు అప్పగించారు. 268 మంది సాక్షుల వివరాలను ఛార్జ్‌షీట్లో సిట్ పొందుపరిచింది. మరో 20 రోజుల్లో రెండో ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు సిట్ చర్యలు చేపట్టింది. రెండో ఛార్జ్ షీట్‌లో ఇంకా ఎవరి పేర్లు చేర్చుతారని చర్చ జరుగుతుంది.

లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు
కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక గతేడాది ఏపీ సీఐడీలో మద్యం కుంభకోణంపై కేసు నమోదైంది. లిక్కర్ పాలసీ స్కామ్ కేసును దర్యాప్తు చేసేందుకు విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ ఎస్‌వీ రాజశేఖరబాబు ఆధ్వర్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 5న ఏపీ ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది. కేసు దర్యాప్తులో భాగంగా పలువుర్ని విచారించిన సిట్ ఏప్రిల్‌ 22న లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడు రాజ్‌ కెసిరెడ్డిని అరెస్టు చేసింది. తర్వాత కేసులో కీలకంగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్‌ ఆఫీసర్ ధనుంజయరెడ్డి, భారతి సిమెంట్స్‌ డైరెక్టర్‌ గా వ్యవహరిస్తున్న గోవిందప్ప బాలాజీ, మాజీ సీఎం జగన్‌ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎస్‌పీవై డిస్టిలరీస్‌ మాజీ డైరెక్టర్‌ సజ్జల శ్రీధర్‌రెడ్డితో పాటు రాజ్‌ కెసిరెడ్డి అనుచరులైన పైలా దిలీప్, బూనేటి చాణక్య, అనంతరం చెవిరెడ్డి భాస్కరరెడ్డి స్నేహితుడు వెంకటేశ్‌ నాయుడు, పీఏలు బాలాజీ యాదవ్‌, నవీన్‌ కృష్ణలను సిట్ అధికారులు అరెస్టు చేశారు. విచారణకు హాజరైన ఎంపీ మిథున్‌రెడ్డిని శనివారం (జులై 19న) అరెస్టు చేయడంతో ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టులు 12కి చేరాయి.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
BC Reservations: బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget