అన్వేషించండి

Andhra Pradesh: వేధించిన సిఐడి అధికారులను సస్పెండ్ చేయాలి: రఘురామకృష్ణరాజు

Undi MLA: జగన్ ప్రభుత్వ హయాంలో వేధింపులకు గురిచేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. వేధింపులకు సంబంధించిన ఆధారాలను గుంటూరు ఎస్పీ కార్యాలయంలో అందించారు.

MLA Raghurama Krishna Raju : వైసీపీ ప్రభుత్వ హయాంలో తనను అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేసిన సిఐడి అధికారులను సస్పెండ్ చేయాలని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. గురువారం గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చిన రఘురామకృష్ణంరాజు అనంతరం మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తనను చంపేందుకు కుట్రపన్నారని వ్యాఖ్యానించిన రఘురామ కృష్ణంరాజు.. మీడియా వల్లే తాను బతికిపోయినట్లు వెల్లడించారు. ఈ వ్యవహారంపై తాను గుంటూరు జిల్లా పరిధిలోని నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదుకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చిన రఘురాం కృష్ణంరాజు మీడియాతో మాట్లాడారు.

తాను ఇచ్చిన ఫిర్యాధు మేరకు మాజీ సిఐడి డీజీ సునీల్ కుమార్, విజయ పాల్, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జిజిహెచ్ సూపరిండెంట్ ప్రభావతి మీద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు, పురోగతిని తెలుసుకోవడానికి వచ్చినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి తన వద్ద ఉన్న సమాచారాన్ని పోలీసులు అందించేందుకు వచ్చానని, ఈ మేరకు పోలీసులకు ఆధారాలను అందించినట్లు రఘురామకృష్ణమరాజు తెలియజేశారు.

సిఐడి అధికారులపై కేసు నమోదు అయింది కాబట్టి వారిని సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా రఘురామ కృష్ణరాజు డిమాండ్ చేశారు. తనని అరెస్టు చేసినప్పుడు అధికారులు బయటకు వెళ్ళగానే ఐదుగురు వచ్చి తనను కొట్టారని, తనను చిత్రహింసలకు గురిచేసి ఏమీ తెలియనట్టు నటించారని వెల్లడించారు. అప్పటి జిల్లా కలెక్టర్ తీసుకున్న చర్యలు కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు రఘురామ వివరించారు. తన ఫిర్యాదుపై ఎటువంటి ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు తెలియజేసినట్టు పేర్కొన్నారు. 307 కేసులో డీజీ స్థాయి అధికారులు, మాజీ సీఎం జగన్ ఉండడం వల్లే ఇప్పటి వరకు విచారణ జరగలేదన్నారు.

హత్యాయత్నం కేసు నమోదు అయినప్పుడు అధికారులను సస్పెండ్ చేయాలని, ఈ కేసులో ఇప్పటి వరకు వారిని ఎందుకు సస్పెండ్ చేయలేదన్నారు ఉండి ఎమ్మెల్యే. కొద్దిరోజుల తర్వాత అయినా సస్పెండ్ చేస్తారని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. పివి సునీల్ కుమార్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో పోల్చితే తానే తానే దళిత బంధువును అని వెల్లడించారు. దళితులపై దాడి జరిగినప్పుడు తానే స్పందించినట్లు స్పష్టం చేశారు. వాళ్ళు ఎప్పుడు స్పందించిన దాఖలాలు లేవన్నారు.

కేసు నమోదైన వారందరినీ అరెస్టు చేస్తారని నమ్ముతున్నట్లు వివరించారు ఆర్‌ఆర్‌ఆర్‌. డిజి స్థాయి అధికారులు కాబట్టే అరెస్టులో జాప్యం అవుతుందని తాను భావిస్తున్నట్లు వివరించారు. ఈ కేసులో అప్పటి గుంటూరు కలెక్టర్ ని కూడా ప్రశ్నించాలన్నారు. డాక్టర్ శ్రీకాంత్ అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఎందుకు రాశాడో తేలాల్సి ఉందని వివరించారు. సాక్షిగా బోరుగడ్డ అనిల్ సంతకం తీసుకున్నారని, వీరంతా అప్పటికే సిద్ధంగా ఉన్నారంటే కుట్ర ప్రకారమే జరిగిందన్నారు. తనపై రాజ ద్రోహం కేసు పెట్టారని రఘురామ ఆరోపించారు. 

సునీల్ కుమార్ బెదిరించారన్న రఘురామకృష్ణంరాజు..

అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డిని విమర్శిస్తే తనను చంపేస్తానంటూ సునీల్ కుమార్ బెదిరించారని కూడా రఘురామకృష్ణంరాజు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు పోలీసులు చేసిన గాయాలపై కోర్టుకు గుంటూరు జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి తప్పుడు నివేదిక ఇచ్చారని పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నట్టు రఘురామకృష్ణంరాజు వెల్లడించారు. ఒక ఎంపీగా తనపై జరిగిన వ్యవహారంపై ఫిర్యాదు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడం లేదన్నారు. ఇప్పటికైనా పోలీసులు వేగవంతంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తనకు న్యాయం జరుగుతుందన్న ఆశాభావాన్ని రఘురామకృష్ణంరాజు వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన కస్టోడియల్ టార్చర్ పై గతంలోనే రఘురాం కృష్ణంరాజు ఫిర్యాదు చేయగా తాజాగా గురువారం దీనికి సంబంధించిన పలు కీలక ఆధారాలను సమర్పించేందుకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Also Read: ఆచూకీ తెలియని నర్సాపురం ఎంపీడీవో - కుటుంబసభ్యులతో మాట్లాడిన చంద్రబాబు

Also Read: ఈ ఊళ్లో మహాత్మాగాంధీనే గ్రామ దేవత! గాంధీ ‘గాంధమ్మ’ అయ్యారు 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు
Vijaya Sai Reddy New Political Party: కొత్త పార్టీ పెడుతున్నా! తిరుమలలో విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! 
కొత్త పార్టీ పెడుతున్నా! తిరుమలలో విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! 
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
BC Reservations: బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Embed widget