అన్వేషించండి

రాజధాని నాశనానికే సెంటుపట్టాల పంపిణీ- జగన్‌పై బొండా ఉమ ఫైర్

రాజధానిలో పేదల నివాసం కోసం ప్రత్యేకంగా స్థలం కేటాయించామని... ఆ స్థలంలో కాకుండా మరోచోట సెంటు పట్టాలు ఇవ్వడం ముమ్మాటికీ పేదల్ని దగా చేయడమేని అన్నారు బొండా ఉమ.

పేదల ముసుగులో రాజధాని నాశనానికే జగన్ రెడ్డి సెంటుపట్టాల పంపిణీకి తెరలేపారని తెలుగు దేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. ఎలాంటి మౌలిక వసతులు లేని ప్రాంతంలో ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాలిస్తే వాటితో ఒరిగేదేంటని ఆయన ప్రశ్నించారు. రాజధానికి భూములిచ్చిన రైతులు, మహిళలపై అధికారమదం, ఖాకీజులుం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి ముఖ్యమంత్రి పేదలపై కపట ప్రేమచూపుతూ, రాజకీయకుట్రలకు బీజం వేస్తున్నారని అన్నారు. 

పథకం ప్రకారం 4ఏళ్లలో ప్రజారాజధానిని నిర్వీర్యం చేసిన జగన్, కుట్ర రాజకీయాల్లో భాగంగానే పేదలకు పనికిరాని సెంటు పట్టాలిస్తున్నారని బొండా ఉమ వ్యాఖ్యానించారు. ప్రభుత్వమిచ్చే సెంటుపట్టాలు పేదలకు ఎందుకు ఉపయోగపడవని ఇప్పటికే సుప్రీంకోర్టు చెప్పిందన్నారు.

డీఎస్పీని వదిలిపెట్టం...
రాజధాని నిర్మాణానికి ఎవర్ని అడిగి భూములిచ్చారంటూ మహిళల్ని ప్రశ్నించి అనుచితంగా ప్రవర్తించిన డీఎస్పీ పోతురాజుని వదిలిపెట్టమని బొండా ఉమ హెచ్చరించారు. ఎవర్ని అడిగి భూములిచ్చారని మహిళల్ని, రైతుల్ని అడగటానికి పోతురాజు ఎవరని ప్రశ్నించారు. పోతురాజు లాంటి పోలీసోళ్లను అడ్డంపెట్టుకొని పరదాలచాటున నక్కి భయంభయంగానే ముఖ్యమంత్రి ఇళ్లపట్టాలిస్తున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చే సెంటు పట్టాలు మాకొద్దు మేం రాం అంటున్నారని ఆరోపించారు. అలాంటి వారిని వైసీపీ నేతలు బెదిరించి, భయపెట్టి రాజధానికి తీసుకొచ్చేపనిలో నిమగ్నమయ్యారని, రాజధాని ప్రాంతంలో విధి నిర్వహణకు వచ్చిన ఇద్దరు కానిస్టేబుళ్లు చనిపోవడానికి ముఖ్యమంత్రే కారణమని బోండా అన్నారు.

టీడీపీ హయాంలో ఇలా...
టీడీపీ ప్రభుత్వం పేదల నివాసానికి రాజధానిలో ప్రత్యేకంగా స్థలం కేటాయించిందని బోండా గుర్తు చేశారు. మొత్తం నిర్మాణాలకు కేటాయించిన భూమిలో 5శాతం భూమిని పేదలకు ఉచితంగా ఇస్తూ ప్రత్యేక జోన్ ఏర్పాటు చేసిందని వివరించారు. నివాస స్థలాలు ఉండాల్సిన జోన్‌లో కాకుండా మరో ప్రాంతంలో జగన్ పేదలకు స్థలాలు ఇవ్వడం ముమ్మాటికీ వారిని మోసగించడమేనని చెప్పారు. జగన్ పేదలకు ఇస్తున్న సెంటు పట్టా భూముల్లో ఎలాంటి మౌలిక వసతులు లేవని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు, రోడ్లు, డ్రైనేజ్, తాగునీరు, విద్యుత్ వంటిసౌకర్యాలు లేకుండా ప్రజలు ఎక్కడ, నివాసం ఉంటారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

రాజధాని నిర్మాణాన్ని నవనగరాలుగా నిర్మించాలన్న ఆలోచనతో మాస్టర్ ప్లాన్ రూపొందించారని తెలిపారు బొండా ఉమ. పేదల నివాసం కోసం ప్రత్యేకంగా కేటాయించిన స్థలంలో కాకుండా, మరోచోట సెంటు పట్టాలు ఇవ్వడం ముమ్మాటికీ పేదల్ని దగా చేయడమేని అన్నారు. రోడ్లనిర్మాణం, విద్యుత్ సౌకర్యాం వంటివాటిని టీడీపీ ప్రభుత్వమే పూర్తి చేసిందని, రాజధాని ప్రాంతంలోని పేదల కోసం 5వేల టిడ్కోఇళ్లు కూడా నిర్మించారని తెలిపారు. 

రాష్ట్రంలో జగన్ రెడ్డి చెప్పిందే చట్టమా?
రాష్ట్రలో చట్టం, న్యాయం, రూల్ ఆఫ్ లా ఎక్కడా అమలు కావడం లేదని బొండా అన్నారు. కర్నూలు జిల్లాలో సీబీఐ అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి అవినాశ్ రెడ్డి ఆసుపత్రిలో దాక్కుంటే, రాష్ట్ర పోలీసు లు, గూండాలు, రౌడీలతో కలిసి అతనికి రక్షణగా నిలవడమేంటిని ప్రశ్నించారు. ఆసుప త్రిలోనే ఉన్న హంతకుడు అవినాశ్ రెడ్డికి కాపలాగా ఉండమని ఖాకీలకు ఏ చట్టం చెప్పిందని బోండా అన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
Pithapuram Roads: పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురంలో రోడ్లకు మహర్దశ - 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం
పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురంలో రోడ్లకు మహర్దశ - 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly Monsoon Sessions: ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
Vijay vs Udhayanidhi Stalin: తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Anchor Charmilla: చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Embed widget