అన్వేషించండి

రాజధాని నాశనానికే సెంటుపట్టాల పంపిణీ- జగన్‌పై బొండా ఉమ ఫైర్

రాజధానిలో పేదల నివాసం కోసం ప్రత్యేకంగా స్థలం కేటాయించామని... ఆ స్థలంలో కాకుండా మరోచోట సెంటు పట్టాలు ఇవ్వడం ముమ్మాటికీ పేదల్ని దగా చేయడమేని అన్నారు బొండా ఉమ.

పేదల ముసుగులో రాజధాని నాశనానికే జగన్ రెడ్డి సెంటుపట్టాల పంపిణీకి తెరలేపారని తెలుగు దేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. ఎలాంటి మౌలిక వసతులు లేని ప్రాంతంలో ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాలిస్తే వాటితో ఒరిగేదేంటని ఆయన ప్రశ్నించారు. రాజధానికి భూములిచ్చిన రైతులు, మహిళలపై అధికారమదం, ఖాకీజులుం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి ముఖ్యమంత్రి పేదలపై కపట ప్రేమచూపుతూ, రాజకీయకుట్రలకు బీజం వేస్తున్నారని అన్నారు. 

పథకం ప్రకారం 4ఏళ్లలో ప్రజారాజధానిని నిర్వీర్యం చేసిన జగన్, కుట్ర రాజకీయాల్లో భాగంగానే పేదలకు పనికిరాని సెంటు పట్టాలిస్తున్నారని బొండా ఉమ వ్యాఖ్యానించారు. ప్రభుత్వమిచ్చే సెంటుపట్టాలు పేదలకు ఎందుకు ఉపయోగపడవని ఇప్పటికే సుప్రీంకోర్టు చెప్పిందన్నారు.

డీఎస్పీని వదిలిపెట్టం...
రాజధాని నిర్మాణానికి ఎవర్ని అడిగి భూములిచ్చారంటూ మహిళల్ని ప్రశ్నించి అనుచితంగా ప్రవర్తించిన డీఎస్పీ పోతురాజుని వదిలిపెట్టమని బొండా ఉమ హెచ్చరించారు. ఎవర్ని అడిగి భూములిచ్చారని మహిళల్ని, రైతుల్ని అడగటానికి పోతురాజు ఎవరని ప్రశ్నించారు. పోతురాజు లాంటి పోలీసోళ్లను అడ్డంపెట్టుకొని పరదాలచాటున నక్కి భయంభయంగానే ముఖ్యమంత్రి ఇళ్లపట్టాలిస్తున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చే సెంటు పట్టాలు మాకొద్దు మేం రాం అంటున్నారని ఆరోపించారు. అలాంటి వారిని వైసీపీ నేతలు బెదిరించి, భయపెట్టి రాజధానికి తీసుకొచ్చేపనిలో నిమగ్నమయ్యారని, రాజధాని ప్రాంతంలో విధి నిర్వహణకు వచ్చిన ఇద్దరు కానిస్టేబుళ్లు చనిపోవడానికి ముఖ్యమంత్రే కారణమని బోండా అన్నారు.

టీడీపీ హయాంలో ఇలా...
టీడీపీ ప్రభుత్వం పేదల నివాసానికి రాజధానిలో ప్రత్యేకంగా స్థలం కేటాయించిందని బోండా గుర్తు చేశారు. మొత్తం నిర్మాణాలకు కేటాయించిన భూమిలో 5శాతం భూమిని పేదలకు ఉచితంగా ఇస్తూ ప్రత్యేక జోన్ ఏర్పాటు చేసిందని వివరించారు. నివాస స్థలాలు ఉండాల్సిన జోన్‌లో కాకుండా మరో ప్రాంతంలో జగన్ పేదలకు స్థలాలు ఇవ్వడం ముమ్మాటికీ వారిని మోసగించడమేనని చెప్పారు. జగన్ పేదలకు ఇస్తున్న సెంటు పట్టా భూముల్లో ఎలాంటి మౌలిక వసతులు లేవని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు, రోడ్లు, డ్రైనేజ్, తాగునీరు, విద్యుత్ వంటిసౌకర్యాలు లేకుండా ప్రజలు ఎక్కడ, నివాసం ఉంటారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

రాజధాని నిర్మాణాన్ని నవనగరాలుగా నిర్మించాలన్న ఆలోచనతో మాస్టర్ ప్లాన్ రూపొందించారని తెలిపారు బొండా ఉమ. పేదల నివాసం కోసం ప్రత్యేకంగా కేటాయించిన స్థలంలో కాకుండా, మరోచోట సెంటు పట్టాలు ఇవ్వడం ముమ్మాటికీ పేదల్ని దగా చేయడమేని అన్నారు. రోడ్లనిర్మాణం, విద్యుత్ సౌకర్యాం వంటివాటిని టీడీపీ ప్రభుత్వమే పూర్తి చేసిందని, రాజధాని ప్రాంతంలోని పేదల కోసం 5వేల టిడ్కోఇళ్లు కూడా నిర్మించారని తెలిపారు. 

రాష్ట్రంలో జగన్ రెడ్డి చెప్పిందే చట్టమా?
రాష్ట్రలో చట్టం, న్యాయం, రూల్ ఆఫ్ లా ఎక్కడా అమలు కావడం లేదని బొండా అన్నారు. కర్నూలు జిల్లాలో సీబీఐ అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి అవినాశ్ రెడ్డి ఆసుపత్రిలో దాక్కుంటే, రాష్ట్ర పోలీసు లు, గూండాలు, రౌడీలతో కలిసి అతనికి రక్షణగా నిలవడమేంటిని ప్రశ్నించారు. ఆసుప త్రిలోనే ఉన్న హంతకుడు అవినాశ్ రెడ్డికి కాపలాగా ఉండమని ఖాకీలకు ఏ చట్టం చెప్పిందని బోండా అన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News:నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
Amaravati Mega Metropolitan Region: అమరావతే మావిగన్ - చంద్రబాబు మెగా మెట్రో విజన్‌ వర్సెస్ వైసీపీ మైండ్ గేమ్‌!
అమరావతే మావిగన్ - చంద్రబాబు మెగా మెట్రో విజన్‌ వర్సెస్ వైసీపీ మైండ్ గేమ్‌!
Deepam 2 Scheme: ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్.. ఉచిత గ్యాస్ సిలిండర్లకు రూ.139.53 కోట్లు విడుదల
ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్.. ఉచిత గ్యాస్ సిలిండర్లకు రూ.139.53 కోట్లు విడుదల
Thalliki Vandanam Cybercrime: తల్లికి వందనం పథకంలో సైబర్ మోసం.. 28 మంది అకౌంట్లలో నగదు మాయం, ట్విస్ట్ ఏంటంటే
తల్లికి వందనం పథకంలో సైబర్ మోసం.. 28 మంది అకౌంట్లలో నగదు మాయం, ట్విస్ట్ ఏంటంటే

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Embed widget