By: ABP Desam | Updated at : 04 Apr 2023 02:31 PM (IST)
సజ్జల రామకృష్ణారెడ్డి (ఫైల్ ఫోటో)
సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులను సమన్వయం చేసుకుంటూ భారీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రజల్లోకి మరింత విస్తృతంగా వెళ్లేందుకు భారీ స్థాయిలో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన చెప్పారు. జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం ఈ నెల 7 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందని చెప్పారు. లక్షలాది మంది కార్యకర్తలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, వలంటీర్లు, గృహ సారథులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని స్పష్టం చేశారు.
మొత్తం యంత్రాగం అంతా శాసన సభ్యులు, రీజినల్ కో ఆర్డినేటర్ల నేతృత్వంలో జరుగుతుందని చెప్పారు. ‘జగనన్నే మా భవిష్యత్.. మా నమ్మకం నువ్వే జగన్’ అనేది జనంలోంచి వచ్చిన నినాదం అని చెప్పారు. ప్రజల జీవితాల్లో మార్పు రావడమే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు. మేనిఫెస్టో అమలు దగ్గర్నుంచి లక్ష్యం చేరే వరకు పేదల కుటుంబాల్లో వెలుగు కోసమే సీఎం జగన్ ప్రయత్నం చేస్తుంటారని అన్నారు. గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం తో మార్పు కనిపిస్తోంది అనేది ప్రజల మాటల్లో అర్థం అయిందని చెప్పారు.
Top 10 Headlines Today: ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ, విమర్శలతో విరుచుకుపడుతున్న వైసీపీ
చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్ఆర్సీపీ ఘాటు విమర్శలు
ఉచితాలతో ఎన్నికల శంఖారావం పూరించిన టీడీపీ- ఇప్పుడు అదే అసలైన టాస్క్
Weather Latest Update: ఆ ప్రాంతాల ప్రజలకు ఎండల నుంచి కాస్త ఉపశమనం- మూడు రోజులు వర్షాలే వర్షాలు
కేంద్ర హోం మంత్రి అమిత్షాతో సీఎం జగన్ భేటీ- 40 నిమిషాలు సాగిన సమావేశం
Wrestlers Protest: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవమిదేనా: మంత్రి కేటీఆర్
Telangana Decade Celebration: గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బద్ధంగా దశాబ్ధి వేడుకలు: మంత్రి ఎర్రబెల్లి
Telangana News: ఇంట్లోనే కూర్చొని రీల్స్ చేస్తుంటారా - అయితే ఈ అదిరిపోయే ఆఫర్ మీ కోసమే!
Bro Movie Update: మామా అల్లుళ్ల పోజు అదిరింది ‘బ్రో’- పవన్, సాయి తేజ్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్!