అన్వేషించండి

Pawan Kalyan: నెక్స్ట్ ఏం చేద్దాం? నేతలతో జనసేనాని పవన్ కళ్యాణ్ సమీక్ష

Pawan Kalyan: ఏపీలో రాజకీయ పరిస్థితులు, వారాహి యాత్ర 5వ దశ, జనసేన - టీడీపీ సమన్వయ కమిటీల ఉమ్మడి సమావేశ నిర్వహణ అంశాలపై పవన్ కల్యాణ్, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సుదీర్ఘంగా చర్చించారు.

Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, వారాహి యాత్ర 5వ దశ నిర్వహణ, జనసేన - తెలుగుదేశం సమన్వయ కమిటీల ఉమ్మడి సమావేశ నిర్వహణ అంశాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్, రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సుదీర్ఘంగా చర్చించారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఈ భేటీ జరిగింది. కార్యక్రమానికి పలువురు జనసేన నాయకులు హాజరయ్యారు. 

రైతుల సమస్యలపై చర్చ
రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులు, సాగు నీటి నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం వల్ల కృష్ణా పశ్చిమ డెల్టాలో 4 లక్షల ఎకరాలు ఎండిపోయిన అంశం చర్చకు వచ్చింది. రైతుల పక్షాన నిలవాలని, అందుకు చేపట్టే పోరాటంపై ప్రణాళిక సిద్ధం చేయాలని జనసేన నేతలకు పవన్ సూచించారు. ఉద్యోగులకు జీతాలు కూడా సకాలంలో ఇవ్వలేని స్థితిలో ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, జన సైనికులు, వీర మహిళలపై అక్రమంగాపెడుతున్న కేసులు ఈ  భేటీలో ప్రస్తావనకు వచ్చాయి.

త్వరలోనే ఐదో దశ వారాహి యాత్ర
గత నెలలో పవన్ నాలుగో విడుత వారాహి యాత్ర జరిగింది. సెప్టెంబర్ 21న అవనిగడ్డ నుంచి యాత్ర ప్రారంభమై 26వ తేదీ వరకు నాలుగు నియోజకవర్గాల్లో నిర్విరామంగా జరిగింది. మూడో విడత యాత్ర విశాఖపట్నంలో జరిగింది. ఉభయగోదావరి జిల్లాలో రెండు విడతలుగా పవన్ వారాహి విజయయాత్ర చేపట్టారు. తాజాగా ఐదో విడత యాత్రకు పవన్ సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. యాత్ర షెడ్యూల్, ఎప్పుడు, ఎక్కడ ఉంటుందనే విషయాలు త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నాయి.

పలువురికి పదవులు
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలిగా పడాల అరుణకు అవకాశం కల్పించారు. అలాగే పలు విభాగాలకు బాధ్యులను, ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడు, రెండు నియోజకవర్గాలకు ఇంచార్జిలను నియమించారు. మరికొందికి కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులుగా అవకాశం కల్పించారు. ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడిగా పంచకర్ల రమేష్ బాబు, క్రియాశీలక సభ్యుల శిక్షన విభాగం చైర్మన్‌గా ఈదర హరిబాబు, ప్రొటోకాల్ విభాగం చైర్మన్‌గా మల్లినీడి తిరుమల రావు, ఉంగుటూరు అసెంబ్లీ ఇన్ చార్జిగా పత్సమట్ల ధర్మరాజు, ఉండి ఇంచార్జిగా జుత్తిగ నాగరాజు, రాష్ట్ర కార్యదర్శులుగా ఆమంచి శ్రీనివాసులు, పిసిని చంద్రమోహన్, రత్నం అయ్యప్ప, గెడ్డం మహాలక్ష్మి, ప్రసాద్, చాగంటి మురళీ కృష్ణ, మండలి రాజేష్‌ను నియమించారు. సంయుక్త కార్యదర్శులుగా చిత్తలూరు సుందర రామిరెడ్డి, యడ్లపల్లి రాం సుధీర్, పాతూరు నారాయణ స్వామి మహేష్, మేడిశెట్టి సూర్య కిరణ్‌కు బాధ్యతలు అప్పగించారు.

జగన్‌పై విమర్శలు
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాఫ్ నాలెడ్జ్ ముఖ్యమంత్రి అని పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. సీఎం అనాలోచిత నిర్ణయాలతో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు కుదేలుయ్యాయని విమర్శించారు. గుంటూరులో సోమవారం మీడియా సమావేశంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. జగన్ నాలుగేళ్ల పాలనతో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు కుదేలయ్యాయని అన్నారు.  రైతులు చితికిపోయారని, వారికి అండగా నిలిచేందుకు టీడీపీతో కలిసి జనసేన పోరాటం చేస్తుందన్నారు. వ్యవసాయరంగం అధ;పాతాళానికి పడిపోయిందని, కృష్ణా పశ్చిమ డెల్టాకు రైతులకు సకాలంలో నీరివ్వక పోవడంతో 4 లక్షల ఎకరాల మేర పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. పులిచింతల, పట్టిసీమ నీరును ఉపయోగించుకోలేకపోతున్నారు. ఎందుకంటే సీఎంకు నీటిపారుదల శాఖపై పట్టు లేదని విమర్శించారు.

కోడి గుడ్డు మంత్రికి, సీఎం ఇన్ఫోసిస్ తో సంబంధం ఏంటి?
విశాఖలో ఇన్ఫోసిస్ డెవలప్ మెంట్ సెంటర్‌ను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించడంపై నాదెండ్ల సటైర్ వేశారు.  కోడి గుడ్డు మంత్రికి, సీఎం జగన్ కు ఇన్ఫోసిస్ కార్యాలయంతో సంబంధం ఏంటని నాదెండ్ల ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో ఉన్న ఇన్ఫోసిస్ ఉద్యోగులు వారంలో 2 రోజులైనా ఆఫీసుకు వచ్చి పని చేసుకుంటారని దీన్ని నిర్మించారు. 250 నుంచి 300 మంది ఉద్యోగులు వచ్చి ఇక్కడ వర్క్ చేసుకుంటారు. కానీ మీరేదే రాష్ట్రానికి ఇన్ఫోసిస్ తీసుకొచ్చారనేలా వైసీపీ నేతలు బిల్డప్ ఇస్తున్నారంటూ నాదెండ్ల మండిపడ్డారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

PM Kisan: రైతుల ఖాతాల్లో ఏటా రూ.6 వేలు.. పీఎం కిసాన్ యోజన అర్హతలు, దరఖాస్తు విధానం ఇదే!
రైతుల ఖాతాల్లో ఏటా రూ.6 వేలు.. పీఎం కిసాన్ యోజన అర్హతలు, దరఖాస్తు విధానం ఇదే!
Breaking News:సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా, మంత్రిమండలి రద్దు: సిద్ధరామయ్య ప్రకటన
సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా, మంత్రిమండలి రద్దు: సిద్ధరామయ్య ప్రకటన
 Nara Lokesh Big Announcement: మహిళలకు 33శాతం సీట్లు  మహానాడులో చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన లోకష్
మహిళలకు 33శాతం సీట్లు..!  మహానాడులో చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన నారాలోకేష్
Nara Lokesh On Women Reservation: రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు- నారా లోకేష్ కీలక ప్రకటన
రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు- నారా లోకేష్ కీలక ప్రకటన

వీడియోలు

RR vs GT IPL 2026 Preview | RR vs GT ఐపీఎల్ మ్యాచ్ ప్రివ్యూ
Archer Comments on Vaibhav Suryavanshi | వైభవ్ సూర్యవంశీ పై జోఫ్రా ఆర్చర్ కామెంట్స్
Bhuvneshwar Kumar Comments on Virat Kohli | విరాట్ పై భువి ఫన్నీ కామెంట్స్
Ashwin Angry Comments on SRH Defeat | SRH ప్లేయర్స్‌ పై అశ్విన్ తీవ్ర ఆగ్రహం
Ambati Rayudu Comments on Yashasvi Jaiswal | యశస్వి జైస్వాల్‌ కు రాయుడు సలహా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
Vijay TVK party Tamil Nadu 2026: విజయ్ ఆపరేషన్ అన్నాడీఎంకే - సొంత మెజార్టీ కోసం దళపతి స్కెచ్.. మిత్రపక్షాలు తిరగబడతాయా?
విజయ్ ఆపరేషన్ అన్నాడీఎంకే - సొంత మెజార్టీ కోసం దళపతి స్కెచ్.. మిత్రపక్షాలు తిరగబడతాయా?
Hypersonic Travel:6 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే...! హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీలో జపాన్ సంచలనం!
6 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే...! హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీలో జపాన్ సంచలనం!
Janasena vs Nageshwar: మా రక్తం మరుగుతోంది ! పవన్ కళ్యాణ్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్! ABP దేశంతో తెలంగాణ జనసేన అధ్యక్షుడు
మా రక్తం మరుగుతోంది ! పవన్ కళ్యాణ్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్! ABP దేశంతో తెలంగాణ జనసేన అధ్యక్షుడు
YS Jagan national politics shift: SIRపై వ్యతిరేకత- ఇండీ కూటమి వాదనకే సపోర్ట్ - జగన్ డిసైడ్ అవుతున్నారా?
SIRపై వ్యతిరేకత- ఇండీ కూటమి వాదనకే సపోర్ట్ - జగన్ డిసైడ్ అవుతున్నారా?
Heatwave In AP And Telangana: వర్షాలు కురుస్తున్నా తగ్గని భానుడి ప్రతాపం.. తెలంగాణలో 12 జిల్లాల్లో, ఏపీలో 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
వర్షాలు కురుస్తున్నా తగ్గని భానుడి ప్రతాపం.. తెలంగాణలో 12 జిల్లాల్లో, ఏపీలో 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
Saravanan Leader OTT: ఓటీటీలోకి 'లీడర్'... లెజెండ్ శరవణన్ యాక్షన్ ఫిల్మ్ స్ట్రీమింగ్ షురూ - ఎందులోనంటే?
ఓటీటీలోకి 'లీడర్'... లెజెండ్ శరవణన్ యాక్షన్ ఫిల్మ్ స్ట్రీమింగ్ షురూ - ఎందులోనంటే?
Telangana govt land monetization: భాగ్యనగరంలో ప్రభుత్వ వేలం వెర్రి సామాన్యుడికి శాపం - హైదరాబాద్ ఇక సామాన్యుడికి దూరమేనా?
భాగ్యనగరంలో ప్రభుత్వ వేలం వెర్రి సామాన్యుడికి శాపం - హైదరాబాద్ ఇక సామాన్యుడికి దూరమేనా?
Embed widget