అన్వేషించండి

Tigers Wandering: పల్నాడును వణికిస్తున్న పులులు, పట్టుకునేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు

దుర్గి మండలం మాచర్ల, వినుకొండ ఫారెస్ట్ రేంజ్ ప్రాంతంలో ప్రజలు అయితే కంటి‌ మీద కునుకు తీయడానికే భయపడుతున్నారు.

గుంటూరు... పల్నాడు ప్రాంతంలో పులుల కదలికలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దుర్గి మండలం మాచర్ల, వినుకొండ ఫారెస్ట్ రేంజ్ ప్రాంతంలో ప్రజలు అయితే కంటి‌ మీద కునుకు తీయడానికే భయపడుతున్నారు. పులి‌ దాడి చేసి ఆవును చంపిన గజాపురం అడవీ ప్రాంతం డీప్ ఫారెస్ట్ లోకి వెళ్ళి అటవీ శాఖ అధికారులు పులి‌ కదలికలపై నిఘా కెమెరా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. డీఎఫ్ఓ రామచంద్రరావు ఆధ్వర్యంలో పలు వాహనాలలో ఫారెస్ట్ సిబ్బంది అటవీ ప్రాంతానికి వెళ్లారు. గతంలో కాకినాడ జిల్లాతో పాటు పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో కొన్నిచోట్ల పులల సంచారించడం తెలిసిందే. బెంగాల్ టైగర్ వచ్చిందని సైతం స్థానికంగా ప్రచారం జరిగింది. 

ట్రాప్ కెమెరాలు ఏర్పాటు
దుర్గి మండలం గజాపురం అటవీ ప్రాంతంలో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. గత నెల 21వ తేదీన గజాపురం వద్దే ఆవుపై పులులు దాడి చేశాయి.  కాకిరాల బీట్ లో సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. ‌పులులు నీటి తావుల వద్దకు వచ్చే అవకాశం ఉండటంతో ఫారెస్ట్ అధికారులు అక్కడ ట్రాప్ కెమెరాలను పెట్టారు.

పల్నాడు అటవీ ప్రాంతంలో పులుల సంచారం 
పల్నాడుజిల్లాలలో టైగర్ టెన్షన్ మొదలైంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ అభయారణ్యంలోని పులులు పల్నాడు జిల్లా అటవీ ప్రాంతంలోకి ప్రవేశించాయని అధికారులు చెబుతున్నారు. దీంతో జనావాసాల్లోకి వస్తాయనే భయంతో ఉన్నారు. అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు చేయడంతో మరింక కంగారు పడుతున్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ అటవీ ప్రాంతంలో పులుల సంతతి వృద్ధి చెందింది. వాటి సంఖ్య 73కి పెరిగింది. దీంతో అవి తిరిగేందుకు ఆ ప్రాంతం సరిపోవడం లేదు. అందుకే అవి పల్నాడు జిల్లా అటవీ ప్రాంతంలోకి ప్రవేశించాయి. 

దుర్గి, మండలంలోకి రెండు పులులు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. బొల్లాపల్లి, కారంపూడి ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. ఇవి మ్యాన్‌ ఈటర్స్ కావని కంగారు పడాల్సిన అవసరం లేదంటున్నా ప్రజల్లో మాత్రం భయాందోళన కనిపిస్తున్నాయి. టైగర్స్‌ను ఇబ్బంది పెట్టి వాటిని గందరగోళ పరచొద్దని అధికారులు హితవు పలుకుతున్నారు. 

పల్నాడు అటవీ ప్రాంతంలోకి వచ్చిన పులులు జనావాసాల్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు అధికారులు చెబుతున్నారు. అయితే సుమారు 45 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం ఉన్నందున కంచె వేసేందుకు వీల్లేదని అంటున్నారు. అందుకే అటవీ జంతువులు గ్రామాల్లోకి రాకుండా పెద్ద పెద్ద గుంతలు తవ్వినట్టు చెబుతున్నారు. అందులో నీళ్లు కూడా పోయిస్తున్నామన్నారు. 

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
AP Aqua Farmers: ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గిస్తూ జీవో జారీ
AP Aqua Farmers: ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గిస్తూ జీవో జారీ
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Embed widget