అన్వేషించండి

MP Raghu Rama: విశాఖలో భూకబ్జాలు...రాష్ట్రంలో రివర్స్ రూలింగ్...ఏపీ ప్రభుత్వంపై ఎంపీ రఘురామ కామెంట్స్

ఏపీ పాలిటిక్స్‌లో ఎంపీ రఘురామ కృష్ణ రాజు హాట్ టాఫిక్. ఎంపీ విజయసాయి బెయిల్ రద్దుపై రఘురామ వేసిన పిటిషన్ పై ఇవాళ విచారణ జరిగింది. ఇదిలా ఉంటే ఆయన తాజాగా ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

ఏపీలో రివర్స్ పాలన నడుస్తోందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజు ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ విశాఖ నగరంలో కబ్జాలు పెరిగిపోయాయని ఆరోపించారు. అలాగే ఏపీ నుంచి హైదరాబాద్‌కు వలసలు సైతం పెరిగాయన్నారు. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు విడిచి పోతున్నాయని, కొత్తగా పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదన్నారు. ఏపీలో శాంతిభద్రతలు లేవని ఎంపీ రఘురామ కృష్ణ రాజు ఘాటుగా వ్యాఖ్యానించారు. రాజకీయ నేతల మెప్పు కోసం అధికారులు తప్పు చేస్తే శిక్ష అనుభవించక తప్పదని ఎంపీ రఘురామ కృష్ణ రాజు అన్నారు. ఢిల్లీలో మాట్లాడిన ఆయన కర్నూలు జిల్లాలోని ఓ పాఠశాల ఆవరణలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం నిర్మించిన అంశంలో ఐఏఎస్ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని ఆయన ప్రస్తామించారు. అధికారులు తప్పును తప్పుగా చెప్పాలన్నారు. అలా కాకుండా అత్యుత్సాహం వ్యవహరిస్తే భవిష్యత్ తప్పనిసరిగా శిక్ష తప్పదని హెచ్చరించారు. 

విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ వాయిదా

విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని ఎంపీ రఘురామ కృష్ణరాజు వేసిన పిటిషన్‌పై హైదరాబాద్‌ సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. జగన్‌ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులకు సంబంధించి కౌంటరు దాఖలు చేయాలని ఎంపీ విజయసాయిరెడ్డిని సీబీఐ కోర్టు ఆదేశించింది. కౌంటరు దాఖలు చేయడానికి కేంద్ర దర్యాప్తు సంస్థ గడువు కోరింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను ఈనెల 13 వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాది సీబీఐ కోర్టును కోరారు. 

విజయసాయి రెడ్డి ఎంపీ హోదాలో కేంద్ర హోంమంత్రి, ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యాలయాల్లో అధికారులను తరచూ కలుస్తూ, తనకు కేంద్ర మంత్రులతో సంబంధాలున్నాయనే విధంగా సాక్షులను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేస్తు్న్నట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి ఎంపీ కాగానే జగన్‌ లెక్కకు మించిన ఆదాయం కేసులో ప్రధాన దర్యాప్తు అధికారి ఉన్న అధికారిని సీబీఐ జేడీగా నియమించవద్దని అభ్యంతరం వ్యక్తంచేశారని పిటిషన్ లో పేర్కొన్నారు. ఇది విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకోవడమేనని ఎంపీ రఘురామ తన పిటిషన్‌లో ఆరోపించారు.

 

Also Read: YSR Nethanna Nestham Scheme: నేతన్న నేస్తం మూడో విడత సాయం విడుదల... 80 వేల లబ్ధిదారుల అకౌంట్లలో రూ.192 కోట్లు జమ

Also Read:   Candidates Criminal Record: నేతల నేర చరిత్ర 48 గంటల్లోగా ప్రకటించండి.. రాజకీయ పార్టీలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశం

Also Read: AP Inter College Reopen: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త కరోనా నిబంధలు వచ్చేశాయి... ఈ రూల్స్ పాటించకుంటే సమస్యలు తప్పవు

                  

టాప్ హెడ్ లైన్స్

Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Kesineni Chinni daughter Issue: ఏపీ రాజకీయాల్లో కేశినేని చిన్నీ కుమార్తె సోషల్ మీడియా పోస్టు కలకలం! సాయంత్రానికి స్నిగ్ధ వివరణ!
ఏపీ రాజకీయాల్లో కేశినేని చిన్నీ కుమార్తె సోషల్ మీడియా పోస్టు కలకలం! సాయంత్రానికి స్నిగ్ధ వివరణ!
Bonda Uma Issue: బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
"63 కోర్ట్ ధిక్కార కేసులు భూ మాఫియావే!" - హైకోర్టు తీర్పుపై HYDRA క‌మిష‌న‌ర్ రంగనాథ్ వివరణ
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Blood Pressure Tablets : బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
Tollywood Stars Injured: జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
Mudragada Kapu Reservation Legacy: కాపు రిజర్వేషన్లపై వైసీపీ నేతల భారీ ప్రకటనలు - పార్టీ విధానాన్ని మార్పించగలరా?
కాపు రిజర్వేషన్లపై వైసీపీ నేతల భారీ ప్రకటనలు - పార్టీ విధానాన్ని మార్పించగలరా?
Tammineni Sitaram Forgery Case: తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
Embed widget