అన్వేషించండి

AP Liquor Scam: మిథున్ రెడ్డి పావు మాత్రమే, ఏపీ లిక్కర్ స్కామ్ మాస్టర్ మైండ్ జగన్: మాణికం ఠాగూర్

AP Liquor Scam case | ఏపీ లిక్కర్ స్కామ్ వైఎస్ జగన్ మోహ్ రెడ్డి ఓ ప్లాన్ ప్రకారం చేసిన సైంటిఫిక్ కరప్షన్ అని రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణికం ఠాగూర్ అన్నారు.

YS Jagan Mohan Reddy in AP Liquor Scam | అమరావతి: ఏపీ లిక్కర్ స్కాంలో వైఎస్సార్ సీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఓ పావు మాత్రమేనని, మాస్టర్ మైండ్ వైఎస్ జగన్, భారతి అని కాంగ్రెస్ నేత మాణికం ఠాగూర్ ఆరోపించారు. వైఎస్ జగన్ లిక్కర్ మాఫియా ఆంధ్రప్రదేశ్‌లో కోటి పేద కుటుంబాల జీవితాలను నాశనం చేసిందని ఏపీ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణికం ఠాగూర్ తీవ్ర ఆరోపణలు చేశారు. విశ్వసనీయ మద్యం బ్రాండ్ల స్థానంలో తక్కువ గ్రేడ్ మద్యంతో పాటు హానికరమైన బ్రాండ్లు వచ్చాయన్నారు. అదంతా ₹3,200 కోట్ల డబ్బుల కోసమే అని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అదే డబ్బును ఎన్నికల్లో ఓట్లను కొనేందుకు ఖర్చు చేశారని పేర్కొన్నారు.

లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన మిధున్ రెడ్డి కేవలం ఓ పావు మాత్రమే. అసలు సూత్రధారులు ఎవరంటే మిస్టర్ & మిసెస్ జగన్. ఇది అనుకోకుండా జరిగిన స్కామ్ కాదు. ఇది జగన్ ఓ పద్దతి ప్రకారం ప్లాన్ చేసిన అవినీతి. ఇది జగన్ టాప్-డౌన్ ఆపరేషన్.. సైంటిఫిక్ కరప్షన్ - మాణికం ఠాగూర్

- లిక్కర్ బ్రాండ్లు ఒడిసి పట్టుకున్నారు 
- పంపిణీ నెట్‌వర్క్ ఫిక్స్ చేసుకున్నారు
- కిక్‌బ్యాక్‌లు ముందస్తుగా చర్చించి నిర్ణయం తీసుకున్నారు
- నకిలీ సంస్థలు క్రియేట్ చేశారు
- దోపిడీని చట్టబద్ధం చేయడానికి లిక్కర్ పాలసీ విధానాన్ని తీసుకొచ్చారు

 

లిక్కర్ స్కామ్ ఎలా వర్కౌట్ అయిందంటే..
1. జగన్ పార్టీ వైసీపీ నేతలు మద్యం సరఫరాదారులతో సమన్వయం చేసుకున్నారు.
2. ఇదివరకే ఉన్న లిక్కర్ బ్రాండ్స్, విశ్వసనీయ మద్యం బ్రాండ్‌లను రాష్ట్రంలో లేకుండా చేశారు. 
3. వారి బినామీల యాజమాన్యంలో వారి సొంత, తెలిసిన బ్రాండ్లును ఏపీలోకి తీసుకొచ్చారు
4. వైసీపీ తెచ్చిన బ్రాండ్లను రాష్ట్ర రిటైల్ ద్వారా అధిక ధరలకు విక్రయాలు జరిపారు

లాభం మార్జిన్..
- కల్తీ బ్రాండ్స్ అయినా ధరలు కృత్రిమంగా పెంచారు.
- నకిలీ ఇన్‌వాయిస్‌లు & సేవా ఒప్పందాల ద్వారా కమీషన్లు ఇచ్చారు.
- మనీ లాండరింగ్ చేయడానికి హైదరాబాద్, బెంగళూరుతో పాటు విశాఖపట్నంలలో షెల్ కంపెనీలను ప్రారంభించారు.

- రవా, గిడ్డంగుల (warehousing) ఒప్పందాలను కూడా ప్రాక్సీ సంస్థలకు ఇచ్చారు. వీటిని లాజిస్టిక్స్ ఖర్చులుగా చూపించారు. నిజానికి అవి ప్రజా ధనాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు మార్గాలు.

3 సమూహాలకు ప్రయోజనం చేకూర్చడానికి 
1. మిస్టర్ అండ్ మిసెస్ జగన్
2. కొందరు మంత్రులు
3. వారితో సన్నిహితంగా మెలిగే కాంట్రాక్టర్లు

2020 నుంచి 2024 మధ్య కనీసం ₹3,200 కోట్లు మళ్లించారని SIT అధికారులు చెబుతున్నారు. 2024 ఎన్నికల ప్రచారంలోకి ఈ నగదు వినియోగించారు. ఎన్నికల సమయంలో నియోజకవర్గాలలో నగదు, ఉచిత మద్యం పంపిణీ చేశారు. ఓటు కొనుగోలు, బూత్ నిర్వహణ కోసం వాడారు

చాలా వరకు నకిలీ మద్యం బ్రాండ్‌లకు తయారీ మౌలిక సదుపాయాలు కూడా లేవు. కానీ వారు లైసెన్స్‌లు తీసుకున్నారు. షాడీ బాట్లింగ్ యూనిట్ల నుండి నిర్వహించారు. కొన్ని రోజులు అలాగే ఉండటానికి రోజుకు లక్షలు లంచాలు ఇచ్చారు. ఈ క్రమంలో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి పేరు చీఫ్ ఆపరేటర్‌గా రికార్డులో ఉంది. ఎక్సైజ్ శాఖ, రాజకీయ కార్యాలయాల మధ్య సమన్వయం చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. 

వేల కోట్ల స్కామ్ కేసులలో ప్రధాన నిందితుడు

ఇది జగన్ మొదటి స్కామ్ కాదు. సీబీఐ దాఖలు చేసిన ₹43,000 కోట్ల అక్రమ ఆస్తుల కేసులో ఆయన ప్రధాన నిందితుడు. జగన్ 2012లో అరెస్టు అయ్యి 16 నెలలకు పైగా జైలు జీవితం గడిపారు. జగన్‌కు అవినీతి కొత్త కాదు. ఆయన విధానం అదే. మద్యం కుంభకోణం జగన్ అవినీతిలో తాజా పరిణామం.  ఇసుక మాఫియా,  మైనింగ్, భూ కేటాయింపు కుంభకోణాలు, అమరావతి చుట్టూ ఇన్‌సైడర్ ట్రేడింగ్, తాజాగా ప్రజారోగ్యాన్ని తాకట్టు పెట్టి మద్యం ద్వారా దోపిడీ చేశారు. బాధితులు ఎవరంటే పేదలు, ఓటర్లు’ అని మాణికం ఠాగూర్ మాజీ సీఎం జగన్ పై సంచలన ఆరోపణలు చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా - స్వయంగా ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పిన జనసేనాని!
కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా - స్వయంగా ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పిన జనసేనాని!
YS Jagan: మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
Visakha Utsav: సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
Abhishek Sharma : అభిషేక్‌ శర్మ ధమాకా! యువరాజ్ సింగ్ రికార్డు బ్రేక్‌! భారత్ ఇన్నింగ్స్‌ హైలైట్స్‌ ఇవే!
అభిషేక్‌ శర్మ ధమాకా! యువరాజ్ సింగ్ రికార్డు బ్రేక్‌! భారత్ ఇన్నింగ్స్‌ హైలైట్స్‌ ఇవే!

వీడియోలు

Medaram Jathara Pagididda Raju History | పడిగిద్ద రాజు దేవాలయం కథేంటి.? | ABP Desam
Medaram Jatara Day 1 Speciality | మేడారం జాతర మొదటి రోజు ప్రత్యేకత ఇదే | ABP Desam
MI vs DC WPL 2026 | ముంబై ఢిల్లీ విజయం
Rohit, Virat BCCI Contracts Changes | విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్?
Ishan Kishan Ind vs NZ T20 | ఇషాన్ కిషన్ పై సూర్య సంచలన ప్రకటన

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా - స్వయంగా ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పిన జనసేనాని!
కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా - స్వయంగా ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పిన జనసేనాని!
YS Jagan: మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
Visakha Utsav: సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
Abhishek Sharma : అభిషేక్‌ శర్మ ధమాకా! యువరాజ్ సింగ్ రికార్డు బ్రేక్‌! భారత్ ఇన్నింగ్స్‌ హైలైట్స్‌ ఇవే!
అభిషేక్‌ శర్మ ధమాకా! యువరాజ్ సింగ్ రికార్డు బ్రేక్‌! భారత్ ఇన్నింగ్స్‌ హైలైట్స్‌ ఇవే!
TamilNadu Politics: తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
KTR News: దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
Bangladesh: ప్రపంచకప్ మ్యాచ్‌లు ఇండియాలో ఆడకపోతే స్కాట్లాండ్‌కు చోటు - బంగ్లాదేశ్‌కు తేల్చి చెప్పిన ఐసీసీ
ప్రపంచకప్ మ్యాచ్‌లు ఇండియాలో ఆడకపోతే స్కాట్లాండ్‌కు చోటు - బంగ్లాదేశ్‌కు తేల్చి చెప్పిన ఐసీసీ
IND vs NZ 1st ODI: భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
Embed widget