అన్వేషించండి

Stone Attack: సీఎంపై రాయిదాడి ఘటనలో ఎన్నో అనుమానాలు, అదే టైంలో కరెంట్ ఎందుకు పోయిందో?

AP News Latest: ముఖ్యమంత్రి కోసం భద్రత కట్టుదిట్టంగా ఉన్నప్పటికీ రాయి దాడి ఎలా జరిగిందనే దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సీఎం పర్యటన ఉన్నా కూడా కరెంటు తీసేయడం పట్ల కూడా విమర్శలు వస్తున్నాయి.

Vijayawada News: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విజయవాడలో జరిగిన రాయి దాడి ఘటన ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్‌ నగర్‌లో ఎన్నికల రోడ్ షో చేస్తుండగా రాయి దాడి జరిగింది. జగన్ ఉన్న వాహనం చుట్టూ ఉన్న జనంలోని ఓ వ్యక్తి ముఖ్యమంత్రిని గురి చూసి రాయితో కొట్టాడని భావిస్తున్నారు. దీంతో సీఎం ఎడమ కంటి పై భాగంలో గాయం అయింది. దాడి కోసం వినియోగించిన వస్తువు క్యాట్ బాల్ అయి ఉంటుందని భావిస్తున్నారు. సీఎం పక్కనే ఉన్న వైసీపీ సెంట్రల్‌ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్‌కు కూడా రాయి తగిలి స్వల్ప గాయం అయింది.

ముఖ్యమంత్రి కోసం భద్రత కట్టుదిట్టంగా ఉన్నప్పటికీ రాయి దాడి ఎలా జరిగిందనే దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సీఎంకు భద్రత కోసం ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ (ఐఎస్‌డబ్ల్యూ), సీఎం సెక్యూరిటీ గ్రూపు (సీఎంఎస్‌జీ), క్లోజ్‌ ప్రాక్సిమిటీ గ్రూప్‌, ఎస్కార్ట్‌, ఇన్నర్‌ కార్డన్‌, ఔటర్‌ కార్డన్‌ లాంటి రకరకాల భద్రతా వ్యవస్థలు ఉంటాయి. వీళ్లే వందల సంఖ్యలో ఉంటారు. వీరు కాక, ముఖ్యమంత్రి వచ్చిన ప్రదేశానికి చెందిన స్థానిక పోలీసులు కూడా భద్రత కల్పిస్తుంటారు. ఈ స్థాయి భద్రతలోనూ సీఎంపైకి గురి చూసి బలంగా రాయి విసిరి, గాయం చేయగలిగారంటే భద్రతాపరమైన లోపాలపై ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. 

మరో ముఖ్యమైన అంశం.. ఆ ప్రాంతంలో పవర్ కట్ ఉండడం. ఆ ప్రాంతం గుండా ముఖ్యమంత్రి పర్యటన అనేది ముందస్తుగా ఫిక్స్ అయిన కార్యక్రమం. అలాంటప్పుడు అక్కడ పవర్ కట్ ఎలా చేస్తారనే ప్రశ్న ఉదయిస్తుంది. సీఎం పర్యటన ఉంటే విద్యుత్తు సరఫరాకు అంతరాయం రాకుండా ముందే చూసుకోవాల్సి ఉంది. 

ముఖ్యమంత్రి బహిరంగ ప్రదేశాల్లో జనాల మధ్యలో ఉండగా.. ఆయన చుట్టూ ఉండే సెక్యూరిటీతో పాటు కాస్త దూరంగా ఉండే భద్రతా సిబ్బంది కళ్లు అదే పనిగా ప్రజలపైనే ఉంటాయి. జగన్‌పైకి రాయి వేసినప్పుడు వారు ఎందుకు గమనించలేదనే అనుమానం వ్యక్తం అవుతోంది. అయితే, వీరు పసిగట్టకుండా ఉండేందుకే కరెంటు కట్ చేశారని కూడా ఓ వాదన ఉంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Embed widget