అన్వేషించండి

ఉద్యమంపై డైలమాలో ఉద్యోగ సంఘాలు- నేడు మరోసారి సమావేశం

ఏపీలో ఉద్యోగుల ఉద్యమంపై క్లారిటీ రాలేదు. సమస్యల పరిష్కారం కోరుతూ ఇవాళ్టి నుంచి ఆందోళనలకు పిలుపునిచ్చింది ఏపీ జేఏసీ అమరావతి..

ముందుగా ప్రకటించిన విధంగా నేటి నుంచి ఉద్యోగులు ఉద్యమ కార్యచరణ చేపట్టారు. అయితే ప్రభుత్వం నుంచి ఊహించని స్పందన రావడంతో డైలమాలో పడ్డారు జేఏసీ నేతలు. ఇవాళ అత్యవసరంగా ఈసీ సమావేశం నిర్వహిస్తున్నారు ఏపీ జేఏసీ అమరావతి నేతలు.
ఉద్యోగుల ఆర్థికపరమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ ఇవాళ్టి నుంచి ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది ఏపీ జేఏసీ అమరావతి. ఇప్పటికే జిల్లాలవారీగా ఉద్యమం కొరకు ఉద్యోగులను సన్నద్ధం చేశారు జేఏసీ నేతలు. అయితే మొన్న జరిగిన కేబినెట్ సబ్ కమిటీ భేటీలో ప్రభుత్వం చాలా అంశాలపై స్పష్టత ఇచ్చింది. ఈ నెలాఖరుకల్లా సుమారు 3 వేల కోట్ల బకాయిలు చెల్లించేందుకు సబ్ కమిటీ ఒప్పుకుంది. అయితే కమిటీ నుంచి రాతపూర్వకంగా హామీ ఇవ్వాలనేది అమరావతి ఉద్యోగుల జేఏసీ డిమాండ్. లిఖితపూర్వకంగా హామీ వచ్చే వరకూ ఉద్యమం తప్పదని ప్రకటించారు జేఏసీ నేతలు.

కీలకంగా సీఎస్ నిర్ణయం..
నిన్న(బుధవారం) సీఎస్ జవహర్ రెడ్డిని కలిశారు జేఏసీ నేతలు. సబ్ కమిటీ హామీలపై రాతపూర్వకంగా స్పష్టత ఇవ్వాలని సీఎస్‌ను కోరినట్లు జేఏసీ చైర్మన్ బొప్పరాజు చెప్పారు. దీనికి సీఎస్ అంగీకరించినట్లు చెప్పారు. అయితే ఉద్యమంపై చర్చించేందుకు ఇవాళ(గురువారం) అత్యవసరంగా ఈసీ సమావేశం ఏర్పాటు చేసింది ఏపీ జేఏసీ అమరావతి. కాసేపట్లో జరిగే సమావేశంలో ఉద్యమం కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటామని ఛైర్మన్‌ బొప్పరాజు చెప్పారు.

ముందుగా జేఏసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇవాళ్టి నుంచి నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరుకావాలి. అయితే ఈసీ సమావేశం తర్వాత ఉద్యమంపై పూర్తి స్పష్టత ఇవ్వనుంది. మరోవైపు ఒక్క ఏపీజేఏసీ అమరావతి తప్ప మిగిలిన సంఘాలు ఉద్యమానికి దూరంగా ఉండటంతో ఎంతమంది ఉద్యోగులు ఆందోళనల్లో పాల్గొంటారనేది కూడా అనుమానంగానే ఉంది.

ఉద్యమం పై క్లారిటి....

నేటి నుంచి ఆందోళన కార్యక్రమాల నిర్వాహణపై అమరావతి జేఎసి ముందస్తుగా ప్రకటన చేసింది. అయితే ఇదే సమయంలో మంత్రివర్గం ఉపసంఘం సమావేశం నిర్వహించటం, ముఖ్య కార్యదర్శితో పలు దఫాలుగా చర్చలు నిర్వహించిన తరువాత నిర్ణయం ఎలా ఉంటుందన్న దానిపై ఇంకా క్లారిటి రావాల్సి ఉంది. ఈసీ సమావేశంలో పలు అంశాలపై చర్చించటం, ఇప్పటికే ఉద్యోగుల్లో ఉన్న అసహనం ఉన్న వేళ సమస్యల పై గట్టిగా పట్టుబట్టేందుకు, ఉన్న దారులన్నింటిని వెతికేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం కూడా ఉద్యోగులతో పలు దఫాలుగా చర్చలు జరిపినప్పటికి అవి ఆశించిన స్థాయిలో జరగలేదన్నది ఉద్యోగుల అభిప్రాయంగా ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వం ఆర్దిక ఇబ్బందులకు సంబందించిన అంశాలను పూర్తి వివరాలతో ఉద్యోగ సంఘాలకు చెందిన నాయకుల ముందు ఉంచింది. అంతే కాదు కరోనా తరువాత నుంచి రాష్ట్ర పరిస్దితులు ఇబ్బందికరంగా మారటంతో పాటుగా, ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు ఆర్దిక అంశాలు ,ఇబ్బందులు ఇలానే కొనసాగుతాయని కూడా ప్రభుత్వ సలహాదారు అయిన సజ్జల ఉద్యోగుల ముందు ఖరాఖండీగా స్పష్టం చేశారు. దీంతో ఇక ఆర్దిక పరమయిన అంశాలపై ఆశలు వదులుకోవాల్సిందేనన్న అభిప్రాయంతో ఉద్యోగులు నిరాశకు గురయ్యారని అంటున్నారు. రాబోయే రోజుల్లో ఉద్యమ కార్యచరణ, ఎలా ఉండాలి, ఇప్పటికే ప్రకటించిన ఉద్యమం ఏ దిశగా తీసుకువెళ్ళాలన్న దాని పై నేడు క్లారిటి వచ్చే అవకాశం ఉంది.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఎర్రకోటలో 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటలో 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Independence Day 2026: దేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు చెప్పిన శుభాకాంక్షలు ఇవే!
దేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు చెప్పిన శుభాకాంక్షలు ఇవే!
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
AP DWCRA: డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. లోన్ నిబంధనల్లో కీలక మార్పులు..
డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. లోన్ నిబంధనల్లో కీలక మార్పులు..

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: ఎర్రకోటలో 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటలో 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
Embed widget