అన్వేషించండి

CPI Narayana: బెయిల్‌పై ఏ నిందితుడు ఇన్నేళ్లు బయటలేడు- సీఎం జగన్ పై సీపీఐ నారాయణ తీవ్ర వ్యాఖ్యలు

CPI Bus Yatra: తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వమే కొనసాగుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. సీపీఐ బస్సు యాత్ర ఆదివారం గుంటూరు చేరుకుంది.

CPI Bus Yatra: తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వమే కొనసాగుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. సీపీఐ బస్సు యాత్ర ఆదివారం గుంటూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సభ నిర్వహించారు. సీపీఐ నారాయణ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ, తెలంగాణలో బీఆర్‌ఎస్ ముసుగులో బీజేపీ డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వమే కొనసాగుతోందని విమర్శించారు. ఎన్నికల్లో గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతానని జగన్ మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేశారని అన్నారు. 

సీఎం అయ్యాక వైఎస్ జగన్‌ తనపై ఉన్న కేసులకు భయపడి పోయారని అన్నారు. అందుకే ప్రధాని నరేంద్ర మోదీకి లొంగిపోయారని ఆరోపించారు. బీజేపీ బారి నుంచి దేశాన్ని, ప్రజలను కాపాడేందుకు పోరాటం చేస్తామన్నారు. దేశాన్ని దుర్మార్గుడైన మోదీ పాలిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం పోవాలన్నారు. మోదీ దత్త పుత్రుడు ఏపీ సీఎం జగన్ అన్నారు. పేరుకు వైసీపీ పార్టీ అని, కానీ బీజేపీ ముసుగుపార్టీ అన్నారు. మేక వన్నె పులుల్లా బీజేపీకి అనుకూలంగా ఉన్నారని అన్నారు. పైకి వైసీపీ ముద్ర లోపల బీజేపీ ముద్ర వేసుకుని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. 

దేశంలో మోదీని దించేందుకు 26 పార్టీలతో రాజకీయ వేదిక ఏర్పడిందని, ఆగస్టు 31 లేదా సెప్టెంబర్ 1న ముంబై వేదికగా సమావేశం జరగబోతోందన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు పోరాటం చేస్తామన్నారు. ఏపీ తెలంగాణల్లో అధికార పార్టీలు పైకి బీజేపీ వ్యతిరేకంగా ఉన్నా లోపల మాత్రం మిత్ర పక్షాలే అన్నారు. చేసిన తప్పుల నుంచి బయట పడడం కోసం బీజేపీకి మద్దతు ఇస్తున్నాయని అన్నారు. కేవలం కవిత కోసం కేసీఆర్, ఏపీలో తనను రక్షించుకోవడానికి జగన్ బీజేపీకి వత్తాసు పలుకుతున్నారని అన్నారు. ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్‌ బెయిల్‌పై బయట ఉన్నారని గుర్తు చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ నిందితుడూ ఇన్నేళ్లు బెయిల్‌పై బయట ఉండలేదని వ్యాఖ్యానించారు. 

బీజేపీవి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు
రామకృష్ణ మాట్లాడుతూ.. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాలపైకి సీబీఐని పంపుతున్నారని, ఐటీ తనిఖీలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అవసరం అయితే ఈడీ దాడులకు దిగుతున్నారని విమర్శించారు. అనుకూలంగా ఉన్న వారికి మరో రకంగా చూస్తున్నారని అన్నారు. సీఎం జగన్ ప్రధాని మోదీకి వత్తాసు పలకడం వల్లే ఇంతకాలం పాటు బెయిల్‌పై ఉండగలుతున్నారని విమర్శించారు. 

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య జరిగి నాలుగేళ్లు గడిచినా నేటికీ ఆ కేసు తేలలేదన్నారు. పులివెందులకు వెళ్లి చిన్న పిల్లాడిని అడిగినా వివేకాను హత్య చేసింది ఎవరనే విషయం చెబుతారన్నారు. సీబీఐ మాత్రం ఇంకా విచారణ కొనసాగిస్తుండటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. అమిత్ షా కనుసన్నలో ఈడీ, సీబీఐ పనిచేస్తున్నాయని అన్నారు. ఏపీలో అభివృద్ధి ఆగిపోయిందని విమర్శించారు. సీఎం సమావేశానికి రూ.50 లక్షలు ఇచ్చే పరిస్థితిలో లేదన్నారు. రాష్ట్రం దివాళా తీసిందన్నారు. రాష్ట్రాన్ని రక్షించండి - దేశాన్ని కాపాడండి నినాదంతో ప్రజల్లోకి వెళ్తామన్నారు. కేంద్రంలో మోదీని, ఏపీలో జగన్ మోహన్ రెడ్డిని గద్దె దించేందుకు పోరాటం చేస్తామన్నారు.

 

టాప్ హెడ్ లైన్స్

AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Breaking News: డీఎస్సీ తరహాలోనే యూనివర్సిటీల్లో నియామకాలు చేపడతాం: మంత్రి నారా లోకేష్
డీఎస్సీ తరహాలోనే యూనివర్సిటీల్లో నియామకాలు చేపడతాం: మంత్రి నారా లోకేష్
Vijaya Sai Reddy New Political Party: కొత్త పార్టీ పెడుతున్నా! తిరుమలలో విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! 
కొత్త పార్టీ పెడుతున్నా! తిరుమలలో విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! 
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Embed widget