అన్వేషించండి

Amaravati :రాజధాని అమరావతిలో మళ్లీ నిర్మాణ పనులు - కేంద్రం తల్చుకుంటే ఊపందుకున్నట్లే !

అమరావతిలో నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఓ కాంట్రాక్టర్‌కు పెండింగ్ బకాయిలు చెల్లించి నిర్మాణాలు ప్రారంభించేలా ప్రభుత్వం చేయగలిగింది.

అమరావతిలో నిర్మాణాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. హైకోర్టు తీర్పు తర్వాత ప్రభుత్వం పనులు ప్రారంభించాలని నిర్ణయించింది. 70 శాతానికిపైగా పూర్తయిన ఏఐఎస్‌, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస సముదాయాల నిర్మాణ పనులు.. అలాగే హైకోర్టు న్యాయమూర్తుల నివాస భవనాల నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి.  వీటిని ఈ ఏడాది నవంబరు నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు.  ఇప్పటికే బ్యాంకుల కన్సార్షియం నుంచి ఓ విడత రుణం అందింది. రూ.200 కోట్లు ఇచ్చేందుకు కన్సార్షియం ముందుకొచ్చింది. ఇందులో ఇప్పటికే రూ.95 కోట్ల వరకు వచ్చాయి.మిగిలిన మొత్తం కూడా త్వరలో వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే నిర్మాణాలు ప్రారంభించాలంటే ముందు కాంట్రాక్టర్లకు బకాయిలు  చెల్లించాలి. బ్యాంకుల నుంచి వచ్చే రుణం మేరకు వారికి చెల్లించే ఏర్పాట్లు చేస్తున్నారు. 

తక్కువ నిధులతో అందుబాటులోకి వచ్చే భవనాల జాబితాను తీసుకుని ఆ మేరకు పనులను ప్రారంభిస్తున్నట్లుగా తెలుస్తోంది.  త్వరలో మిగిలిన రూ.105 కోట్లు అందనుందని అధికారులు భావిస్తున్నారు. ఈ నిధులతో ప్రస్తుతం పనుల వేగం పెంచాలని నిర్ణయించారు. ఇచ్చే రుణం అఖిల భారత సర్వీసు అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్లకే సరిపోతుంది. మిగిలిన టైప్‌ 1, 2, నాలుగో తరగతి ఉద్యోగుల నివాస సముదాయాల నిర్మాణాలు 65 శాతం పూర్తయ్యాయి. వీటి పనులు తిరిగి ప్రారంభించేందుకు మరో మార్గంలో రుణం కోసం సీఆర్‌డీఏ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇటీవల కేంద్ర బడ్జెట్‌ 2022-23లో అమరావతి రాజధాని ప్రొవిజన్ ఇచ్చి మరీ నిధులను కేటాయించింది. ఇందులో అమరావతిలో ఏయే నిర్మాణాల కోసం నిధులు కేటాయిస్తున్నారో అన్న విషయం కూడా ప్రస్తావించింది. దీంతో ఈ నిధులను ఏపీ ప్రభుత్వం అమరావతిలో నిర్మాణాల కోసమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా తమకు కేటాయించిన భూముల్లో నిర్మాణాల గురించి సమీక్ష చేస్తున్నట్లుగా తెలుస్తోంది.  అమరావతిలో కేంద్రప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థలకు 2016 నుంచి 2019 మధ్యలో సీఆర్​డీఏ భూములు కేటాయించింది. 24 కేంద్రప్రభుత్వ సంస్థలకు 208 ఎకరాలు, 18 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు 27 ఎకరాల్ని ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఎకరం రూ. 4 కోట్ల చొప్పున కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో కొన్నింటికి ఉచితంగా మరికొన్నింటికి తక్కువ ధరకు గత ప్రభుత్వం భూములు కేటాయించింది. 

జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా... తుళ్లూరు-రాయపూడి మధ్య తమకు కేటాయించిన స్థలానికి ఇటీవల ప్రహరీ నిర్మించింది. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ కొంతమేర నిర్మాణాలు చేపట్టింది. మిగతా సంస్థలేవీ నిర్మాణాలు మొదలుపెట్టలేదు. ప్రధాని మోదీ స్వయంగా వచ్చి అమరావతికి శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో పరిపాలనా వ్యవహారాలన్నీ అమరావతి నుంచే సాగుతున్నాయి. అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థల నిర్మాణాలు ప్రారంభించాలన్న డిమాండ్ పెరుగుతోంది. వాటి నిర్మాణాలు కూడా ప్రారంభమైతే రాజధానిపై భరోసా ఏర్పడుతుందని భావిస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Kawasaki Ninja ZX 4RR: మార్కెట్లోకి కొత్త నింజా బైక్ - రేటు చూస్తే మాత్రం షాకే!
మార్కెట్లోకి కొత్త నింజా బైక్ - రేటు చూస్తే మాత్రం షాకే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Kawasaki Ninja ZX 4RR: మార్కెట్లోకి కొత్త నింజా బైక్ - రేటు చూస్తే మాత్రం షాకే!
మార్కెట్లోకి కొత్త నింజా బైక్ - రేటు చూస్తే మాత్రం షాకే!
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
Mulugu News: 'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టేసింది' - 2 నెలల్లోనే 20 మంది మృతి, గ్రామస్థుల్లో భయం భయం
'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టేసింది' - 2 నెలల్లోనే 20 మంది మృతి, గ్రామస్థుల్లో భయం భయం
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Laptop Battery Saving Tips: ల్యాప్‌టాప్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా? - ఇలా చేస్తే ఎక్కువ సేపు వస్తుంది!
ల్యాప్‌టాప్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా? - ఇలా చేస్తే ఎక్కువ సేపు వస్తుంది!
Embed widget