అన్వేషించండి

Amaravati :రాజధాని అమరావతిలో మళ్లీ నిర్మాణ పనులు - కేంద్రం తల్చుకుంటే ఊపందుకున్నట్లే !

అమరావతిలో నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఓ కాంట్రాక్టర్‌కు పెండింగ్ బకాయిలు చెల్లించి నిర్మాణాలు ప్రారంభించేలా ప్రభుత్వం చేయగలిగింది.

అమరావతిలో నిర్మాణాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. హైకోర్టు తీర్పు తర్వాత ప్రభుత్వం పనులు ప్రారంభించాలని నిర్ణయించింది. 70 శాతానికిపైగా పూర్తయిన ఏఐఎస్‌, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస సముదాయాల నిర్మాణ పనులు.. అలాగే హైకోర్టు న్యాయమూర్తుల నివాస భవనాల నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి.  వీటిని ఈ ఏడాది నవంబరు నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు.  ఇప్పటికే బ్యాంకుల కన్సార్షియం నుంచి ఓ విడత రుణం అందింది. రూ.200 కోట్లు ఇచ్చేందుకు కన్సార్షియం ముందుకొచ్చింది. ఇందులో ఇప్పటికే రూ.95 కోట్ల వరకు వచ్చాయి.మిగిలిన మొత్తం కూడా త్వరలో వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే నిర్మాణాలు ప్రారంభించాలంటే ముందు కాంట్రాక్టర్లకు బకాయిలు  చెల్లించాలి. బ్యాంకుల నుంచి వచ్చే రుణం మేరకు వారికి చెల్లించే ఏర్పాట్లు చేస్తున్నారు. 

తక్కువ నిధులతో అందుబాటులోకి వచ్చే భవనాల జాబితాను తీసుకుని ఆ మేరకు పనులను ప్రారంభిస్తున్నట్లుగా తెలుస్తోంది.  త్వరలో మిగిలిన రూ.105 కోట్లు అందనుందని అధికారులు భావిస్తున్నారు. ఈ నిధులతో ప్రస్తుతం పనుల వేగం పెంచాలని నిర్ణయించారు. ఇచ్చే రుణం అఖిల భారత సర్వీసు అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్లకే సరిపోతుంది. మిగిలిన టైప్‌ 1, 2, నాలుగో తరగతి ఉద్యోగుల నివాస సముదాయాల నిర్మాణాలు 65 శాతం పూర్తయ్యాయి. వీటి పనులు తిరిగి ప్రారంభించేందుకు మరో మార్గంలో రుణం కోసం సీఆర్‌డీఏ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇటీవల కేంద్ర బడ్జెట్‌ 2022-23లో అమరావతి రాజధాని ప్రొవిజన్ ఇచ్చి మరీ నిధులను కేటాయించింది. ఇందులో అమరావతిలో ఏయే నిర్మాణాల కోసం నిధులు కేటాయిస్తున్నారో అన్న విషయం కూడా ప్రస్తావించింది. దీంతో ఈ నిధులను ఏపీ ప్రభుత్వం అమరావతిలో నిర్మాణాల కోసమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా తమకు కేటాయించిన భూముల్లో నిర్మాణాల గురించి సమీక్ష చేస్తున్నట్లుగా తెలుస్తోంది.  అమరావతిలో కేంద్రప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థలకు 2016 నుంచి 2019 మధ్యలో సీఆర్​డీఏ భూములు కేటాయించింది. 24 కేంద్రప్రభుత్వ సంస్థలకు 208 ఎకరాలు, 18 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు 27 ఎకరాల్ని ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఎకరం రూ. 4 కోట్ల చొప్పున కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో కొన్నింటికి ఉచితంగా మరికొన్నింటికి తక్కువ ధరకు గత ప్రభుత్వం భూములు కేటాయించింది. 

జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా... తుళ్లూరు-రాయపూడి మధ్య తమకు కేటాయించిన స్థలానికి ఇటీవల ప్రహరీ నిర్మించింది. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ కొంతమేర నిర్మాణాలు చేపట్టింది. మిగతా సంస్థలేవీ నిర్మాణాలు మొదలుపెట్టలేదు. ప్రధాని మోదీ స్వయంగా వచ్చి అమరావతికి శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో పరిపాలనా వ్యవహారాలన్నీ అమరావతి నుంచే సాగుతున్నాయి. అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థల నిర్మాణాలు ప్రారంభించాలన్న డిమాండ్ పెరుగుతోంది. వాటి నిర్మాణాలు కూడా ప్రారంభమైతే రాజధానిపై భరోసా ఏర్పడుతుందని భావిస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

SIR in Andhra Pradesh: ఓటర్ల జాబితా సవరణకు నేటితో యుగియనున్న గడువు.. 39.8 లక్షల అన్ కలెక్టబుల్ ఎన్యూమరేషన్ పత్రాలు
ఓటర్ల జాబితా సవరణకు నేటితో యుగియనున్న గడువు.. 39.8 లక్షల అన్ కలెక్టబుల్ ఎన్యూమరేషన్ పత్రాలు
Yarlagadda Venkatrao: ప్రత్యర్థులకు ప్రభుత్వం కాంట్రాక్టులు, టీడీపీ కార్యకర్తల్లో అసంతృప్తి: ఎమ్మెల్యే యార్లగడ్డ
ప్రత్యర్థులకు ప్రభుత్వం కాంట్రాక్టులు, టీడీపీ కార్యకర్తల్లో అసంతృప్తి: ఎమ్మెల్యే యార్లగడ్డ
Andhra Pradesh RTGS: భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
Supreme Court: పోలవరం వివాదం.. సుప్రీంకోర్టులో తెలంగాణకు చుక్కెదురు, ఏపీకి నోటీసులు ఇచ్చేందుకు నిరాకరణ
పోలవరం వివాదం.. సుప్రీంకోర్టులో తెలంగాణకు చుక్కెదురు, ఏపీకి నోటీసులు ఇచ్చేందుకు నిరాకరణ

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Leopard News: తిరుపతి శివారులో చిరుత సంచారం.. వణికిపోతున్న స్థానికులు, అధికారులపై ఆగ్రహం
తిరుపతి శివారులో చిరుత సంచారం.. వణికిపోతున్న స్థానికులు, అధికారులపై ఆగ్రహం
AP Local Body Elections November: నవంబర్‌లో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు! చంద్రబాబు, పవన్ కల్యాణ్ ముందస్తు సీట్ల ప్లాన్ ఇదే!
నవంబర్‌లో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు! చంద్రబాబు, పవన్ కల్యాణ్ ముందస్తు సీట్ల ప్లాన్ ఇదే!
Kaleshwaram NDSA Report Medigadda: మేడిగడ్డ వద్ద ఎత్తిపోయకపోవడంతోనే పట్టిసీమకు గోదావరి -ఈ వాదనలో నిజం ఎంత?
మేడిగడ్డ వద్ద ఎత్తిపోయకపోవడంతోనే పట్టిసీమకు గోదావరి -ఈ వాదనలో నిజం ఎంత?
Yarlagadda Venkatrao: ప్రత్యర్థులకు ప్రభుత్వం కాంట్రాక్టులు, టీడీపీ కార్యకర్తల్లో అసంతృప్తి: ఎమ్మెల్యే యార్లగడ్డ
ప్రత్యర్థులకు ప్రభుత్వం కాంట్రాక్టులు, టీడీపీ కార్యకర్తల్లో అసంతృప్తి: ఎమ్మెల్యే యార్లగడ్డ
Iran Missile Attacks: హర్మూజ్‌లో విధ్వంసం! UAE ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ మిస్సైల్స్ అటాక్.. భారతీయుడు మృతి
హర్మూజ్‌లో విధ్వంసం! UAE ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ మిస్సైల్స్ అటాక్.. భారతీయుడు మృతి
Best Roti For Health: మొక్కజొన్న-జొన్న-మిల్లెట్ లేదా గోధుమ ఏ రోటీ వేగంగా జీర్ణమవుతుంది? ఏది ఎక్కువ శక్తినిస్తుంది?
మొక్కజొన్న-జొన్న-మిల్లెట్ లేదా గోధుమ ఏ రోటీ వేగంగా జీర్ణమవుతుంది? ఏది ఎక్కువ శక్తినిస్తుంది?
Corona Cases: ఆంధ్రప్రదేశ్ నుంచి యూపీ వరకు వెలుగులోకి కరోనా కేసులు! కోవిడ్-19 తిరగబెట్టిందా?
ఆంధ్రప్రదేశ్ నుంచి యూపీ వరకు వెలుగులోకి కరోనా కేసులు! కోవిడ్-19 తిరగబెట్టిందా?
Andhra Pradesh RTGS: భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
Embed widget