అన్వేషించండి

Emergency Alert System India: నెట్‌వర్క లేకపోయినా మీ ఫోన్‌కు ఎమర్జెన్సీ అలర్ట్! ఇవాళ వచ్చిన మెసేజ్ అసలు లక్ష్యం ఇదే!

దేశవ్యాప్తంగా మొబైల్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం అత్యవసర హెచ్చరిక సందేశాలను పంపించింది. ప్రకృతి విపత్తుల సమయంలో పౌరులను తక్షణమే అప్రమత్తం చేసేందుకు NDMA, DoT కలిసి ఈ పరీక్ష నిర్వహించాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • భారత్ స్వదేశీ టెక్నాలజీతో విపత్తు హెచ్చరికల వ్యవస్థను పరీక్షిస్తోంది.
  • ఈ వ్యవస్థ దేశవ్యాప్తంగా లక్షలాది మొబైల్ ఫోన్లకు అత్యవసర హెచ్చరికలు పంపుతుంది.
  • నెట్‌వర్క్ రద్దీ ఉన్నా, సైలెంట్ మోడ్‌లో ఉన్నా అలర్ట్ నేరుగా స్క్రీన్‌పై కనిపిస్తుంది.
  • విపత్తుల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించడమే దీని ప్రధాన లక్ష్యం.

Emergency Alert System India: భారత్‌ సొంత టెక్నాలజీతో విపత్తు హెచ్చరికల వ్యవస్థలను సిద్ధం చేస్తోంది. శనివారం జరిగిన ఈ పరీక్షల్లో భాగంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది మొబైల్ ఫోన్లు ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో మారుమోగాయి. అసలు ఈ వ్యవస్థ ఎందుకు అవసరం? ఎలా పని చేస్తుంది? అనే వివరాలు తెలుసుకుందాం. 

శనివారం 11 గంటలకు చాలా మంది మొబైల్ వినియోగదారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వారి ఫోన్‌లకు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా పెద్ద శబ్దంతో కూడిన బీప్‌లు, వైబ్రేషన్‌లతో కూడిన సందేశం వచ్చింది. ఫోన్ స్క్రీన్‌పై అత్యవసర సేవల అలర్ట్ అని ఇంగ్లీష్ తెలుగులో హెచ్చరికలు కనిపించాయి. అయితే ఇది చూసి భయపడాల్సిన పని లేదు. భారత్ ప్రభుత్వం తన కొత్త ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించడంలో భాగంగానే ఈ సందేశాలను పంపింది. 

Also Read: భారత్‌లో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు! సామాన్యులపై పెను భారం!

మొబైల్‌ ఫోన్‌లకు వచ్చిన ఆ సందేషం ఇలా ఉంది. భారత్‌ తన పౌరుల కోసం తక్షణ విపత్తు హెచ్చరిక సేవలను అందించేందుకు స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి సెల్ బ్రాడ్ కాస్ట్‌ను ప్రారంభించింది. అప్రమత్తమైన పౌరులే సురక్షితమైన దేశానికి ఆధారం. ఈ సందేశం అందిన తర్వాత ప్రజలు ఎటువంటి చర్య తీసుకోవాలని పని లేదు. ఇది కేవలం భారత్ ప్రభుత్వం పంపిన పరీక్ష సందేశం మాత్రమే" 

ఈ పని భారత్ ప్రభుత్వంలోని రెండు కీలక విభాగాలు సమన్వయం చేసుకుంటున్నాయి. టెలికమ్యూనికేషన్ల శాఖ టెక్నాలజీ సహకారం, మొబైల్ నెట్‌వర్క్‌ల ద్వారా సందేశాల పంపిణీ బాధ్యతను చూస్తుంది. నేషనల్‌ డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ అథారిటీ విపత్తు నిర్వహణలో భాగంగా పౌరుల ప్రాణ , ఆస్తి నష్టాన్ని తగ్గించడం దీని ప్రధాన లక్ష్యం. ఈ రెండు విభాగాలు కలిపి దేశవ్యాప్తంగా మొబైల్‌ ఆధారిత విపత్తు కమ్యూనికేషన్ వ్యవస్థలను బలోపేతం చేస్తున్నాయి. 

గతంలో సునామీలు , తుపాన్లు భూకంపాలు వచ్చినప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేయడానికి రేడియోలు, టీవీ లేదా సాధారణ SMSపై ఆధారపడాల్సి వచ్చేది. అయితే, విపత్తు సమయంలో నెట్‌వర్క్‌ జామ్ కావడం లేదా సమాచారం అందడంలో జాప్యం వల్ల ప్రాణం నష్టం ఎక్కువగా ఉండేది. ఈ వ్యవస్థతో సెకనుల వ్యవధిలోనే కోట్ల మందికి ఏక కాలంలో సమాచారాన్ని చేరవేయవచ్చు. సాధారణ SMSల వలె కాకుండా, ఇది సెల్ బ్రాడ్ కాస్ట్ టెక్నాలజీపై పని చేస్తుంది. దీని వల్ల నెట్‌వర్క్ రద్దీగా ఉన్నా సందేశం నేరుగా ఫోన్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.  తుపాన్లు వరదలు, సునామీ వంటి విపత్తులు వచ్చేటప్పుడు ప్రజలను ముందుగా సురక్షితం ప్రాంతాలకు వెళ్లమని హెచ్చరించడానికి ఇది అద్భుతంగా పని చేస్తుంది. ఇది పూర్తిగా భారతీయ టెక్నాలజీతో తయారు చేశారు. దీని వల్ల భద్రత, నియంత్రణ మన చేతుల్లోనే ఉంటుంది. 

ఈ వ్యవస్థ సెల్‌ బ్రాడ్ కాస్ట్ అనే టెక్నాలజీ ఉపయోగిస్తారు. మీరు ఇంటర్నెట్‌ ఆన్‌లో ఉంచకపోయినా మెసేజ్ వస్తుంది. ఫోన్ సైలెంట్ మోడ్‌లో ఉన్నా కూడా  ఎమర్జెన్సీ అలర్ట్ వస్తుంది. ఇది టెలికాం టవర్ల ద్వారా నిర్ణీత ప్రాంతాల్లోని మొబైల్ ఫోన్‌లన్నింటికీ ఎక కాకంలో సిగ్నల్ పంపుతుంది.

Frequently Asked Questions

భారతదేశం ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్‌ను ఎందుకు పరీక్షిస్తోంది?

దేశవ్యాప్తంగా ప్రజలకు తక్షణ విపత్తు హెచ్చరికలను అందించడానికి భారత ప్రభుత్వం తన స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్‌ను పరీక్షిస్తోంది. దీని ద్వారా విపత్తుల సమయంలో ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించడమే లక్ష్యం.

ఈ ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ ఎలా పని చేస్తుంది?

ఈ వ్యవస్థ సెల్ బ్రాడ్ కాస్ట్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఇది ఇంటర్నెట్ లేకుండా, సైలెంట్ మోడ్‌లో ఉన్న ఫోన్‌లకు కూడా టెలికాం టవర్ల ద్వారా నిర్దిష్ట ప్రాంతాల్లోని అన్ని మొబైల్ ఫోన్‌లకు ఏకకాలంలో సిగ్నల్ పంపుతుంది.

ఈ అలర్ట్ సందేశం వస్తే ప్రజలు ఏదైనా చర్య తీసుకోవాలా?

లేదు, ఈ సందేశం కేవలం భారత ప్రభుత్వం పంపిన పరీక్ష సందేశం మాత్రమే. దీనిని చూసి భయపడాల్సిన అవసరం లేదు, ఎటువంటి చర్య తీసుకోవాల్సిన పని లేదు. ఈ సందేశం ద్వారా ప్రజలకు విపత్తు హెచ్చరిక వ్యవస్థ గురించి అవగాహన కల్పించడమే లక్ష్యం.

గతంలో ఉన్న పద్ధతుల కంటే ఈ కొత్త వ్యవస్థ ఎలా మెరుగైనది?

గతంలో SMS, రేడియో, టీవీ వంటివాటిపై ఆధారపడేవారు. కానీ ఈ కొత్త వ్యవస్థతో సెకన్లలో కోట్ల మందికి ఏకకాలంలో సమాచారం చేరవేయవచ్చు. నెట్‌వర్క్ రద్దీగా ఉన్నా, సందేశం నేరుగా ఫోన్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Loan Trap: చదువుకు 4 లక్షలు, పెళ్లికి 10 లక్షలు.. అప్పుల ఊబితో తప్పని చిక్కులు- పరిష్కార మార్గాలివే
చదువుకు 4 లక్షలు, పెళ్లికి 10 లక్షలు.. Loan Trapతో తప్పని చిక్కులు- పరిష్కార మార్గాలివే
Meta గ్లోబల్ టీమ్‌కు మోదీ ప్రభుత్వం సమన్లు.. ఆగస్టు 5, 6 తేదీల్లో విచారించనున్న కేంద్రం
Meta గ్లోబల్ టీమ్‌కు మోదీ ప్రభుత్వం సమన్లు.. ఆగస్టు 5, 6 తేదీల్లో విచారించనున్న కేంద్రం
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Breastfeeding Diet : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Embed widget