అన్వేషించండి

Rythu Bharosa Funds: రైతులకు గుడ్‌న్యూస్! నేడు వీరి అకౌంట్లలోకి డబ్బులు - బటన్ నొక్కనున్న సీఎం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఆర్థిక చేయూత అందించడానికి 15 అక్టోబర్, 2019 నుంచి వైఎస్ఆర్ రైతు భరోసా - పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తోంది.

వైఎస్ఆర్ రైతు భరోసా- పీఎం కిసాన్ పథకం 2023 - 24 కౌలు రైతులకు మొదటి విడత సాయాన్ని నేడు (ఆగస్టు 31) సీఎం జగన్ విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి నేరుగా లబ్ధి దారుల ఖాతాలోకి నిధులు జమ చేస్తారు.

ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా..
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఆర్థిక చేయూత అందించడానికి 15 అక్టోబర్, 2019 నుంచి వైఎస్ఆర్ రైతు భరోసా - పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తోంది.. అర్హులైన భూ యజమాని కుటుంబాలను ఈ పథకం కింద లబ్ధిదారులుగా గుర్తించి, వారికి మొదటి విడత రూ. 7500/-  మే నెలలో (పీఎం కిసాన్ లబ్ధిరూ. 2000/- లను కలిపి), రెండో విడత రూ. 4000/- అక్టోబర్  నెలలో (పీఎం కిసాన్ లబ్ధిరూ. 2000/- లను కలిపి),
మూడో విడత రూ. 2000/- ప్రత్యేకంగా పీఎం కిసాన్ లబ్ధిని జనవరి నెలలో అందజేయడం జరుగుతుంది. అదే విధంగా రాష్ట్రంలో భూమి లేని షెడ్యూల్ తెగలు , షెడ్యూల్ కులం,  వెనకబడిన కులాలు,  మైనారిటీ వర్గాలకు  చెందిన కౌలు రైతు కుటుంబాలకు, దేవాదాయ భూములు అటవీ భూమి సాగుదారులకు  సంవత్సరానికి రూ. 13,500/- చొప్పున ఆర్థిక సహాయం 3 విడతలలో రైతుల ఖాతాలలోకి  రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరుగుతుంది. మొదటి విడత రూ. 7500/- లబ్ధిని మే నెలలో, రెండో విడత రూ. 4000/- లబ్ధిని అక్టోబర్ నెలలో, మూడో విడత రూ. 2000 లబ్ధిని జనవరి నెలలో అందజేస్తున్నారు.

2019-20  లో పథక అమలు తీరు...
మొత్తం లబ్ధిదారులు : 46,69,375
భూ యజమాని కుటుంబాలు : 45,11,252  లుగా ఉన్నాయి..
భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాస్తవ సాగుదారులు : 1,08,256
అటవీ భూమి సాగుదారులు : 49,867
లబ్ధి మొత్తం : రూ.6173 కోట్లు 
(వైఎస్ఆర్ రైతు భరోసా లబ్ధి: రూ.3,648 కోట్లు + పీఎం కిసాన్ లబ్ధి: రూ.2525 కోట్లు)

2020-21 లో పెరిగిన తీరు..
మొత్తం లబ్ధిదారులు : 51,59,045
భూ యజమాని కుటుంబాలు : 50,04,874
భూమిలేని ఎస్పీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాస్తవ సాగుదారులు: 69,899
అటవీ భూమి సాగుదారులు : 84,272
లబ్ధి మొత్తం : రూ.6928 కోట్లు 
(వైఎస్ఆర్ రైతు భరోసా లబ్ధి  : రూ.3962 కోట్లు + పీఎం కిసాన్ లబ్ధి: రూ.2966 కోట్లు)

2021-22 సంవత్సరంలో పథకం  అమలు తీరు..
మొత్తం లబ్ధిదారులు : 52,38,517
భూ యజమాని కుటుంబాలు : 50,66,241
భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాస్తవ సాగుదారులు : 89,877
అటవీ భూమి సాగుదారులు : 82,399
లబ్ధి మొత్తం : రూ.7,016.59 కోట్లు
(వైఎస్ఆర్ రైతు భరోసా లబ్ధి: రూ.4051.87 కోట్లు + పీఎం కిసాన్ లబ్ధి: రూ.2964.72 కోట్లు)

2022-23 సంవత్సరంలో
మొత్తం లబ్ధిదారులు : 51,40,943
భూ యజమాని కుటుంబాలు : 49,26,041
భూమిలేని ఎస్పీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాస్తవ సాగుదారులు: 1,23,871
అటవీ భూమి సాగుదారులు : 91,031
లబ్ధి మొత్తం : రూ.6944.50 కోట్లు 
(వైఎస్ఆర్ రైతు భరోసా లబ్ధి  : రూ.4015.94 కోట్లు + పీఎం కిసాన్ లబ్ధి: రూ.2928.56 కోట్లు)

ఈ ఏడాది 2023-24  సంవత్సరం మొదటి విడత లబ్ధి జూన్ 1న భూ యజమానులు, అటవీ భూమి సాగుదారులకు రూ.3833.21 కోట్లు విడుదల చేయడం జరిగింది. కౌలు దారులకు మొదటి విడత లబ్ధి ఆగస్టు 31న విడుదల చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. రూ.109.74 కోట్లు 14,6324 భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాస్తవ సాగుదారులకు (3631 దేవాదాయ భూమి సాగుదారులతో కలిపి)  అందించడం జరుగుతుందని,
దీనితో  2023-24 వ సంవత్సరంలో మొదటి విడత లబ్ధి  మొత్తం 52,57,263 రైతులకు రూ. 3942. 95 కోట్లు అందుతుంది.
మొత్తం లబ్ధిదారులు : 51,10,939
భూ యజమాని కుటుంబాలు  : 50,19,187
అటవీ భూమి సాగుదారులు : 91,752
లబ్ధి మొత్తం : రూ.3833.21 కోట్లు 
(వైఎస్ఆర్ రైతు భరోసా లబ్ధి: రూ.2829.37 కోట్లు + పీఎం కిసాన్ లబ్ధి: రూ.1003.84 కోట్లు)గా లెక్కలు చెబుతున్నాయి. 2019-20 నుంచి ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా మొత్తం రూ.31005.04 కోట్ల లబ్ధి రైతు కుటుంబాలకు అందించడం జరిగినదని ప్రభుత్వం ప్రకటించింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Lokesh Latest News: వీడిన నారా లోకేశ్ పూజ గదిలోని బొమ్మ మిస్టరీ! క్షుద్ర పూజలంటూ వస్తున్న విమర్శలపై మంత్రి వివరణ! 
వీడిన నారా లోకేశ్ పూజ గదిలోని బొమ్మ మిస్టరీ! క్షుద్ర పూజలంటూ వస్తున్న విమర్శలపై మంత్రి వివరణ! 
Andhra Pradesh Job Calendar 2026: ఆంధ్రప్రదేశ్‌లో పదివేల పోస్టులతో జాబ్‌ క్యాలెండర్ విడుదల - ఏటా ఉగాదికి ఉద్యోగాల జాతర!
ఆంధ్రప్రదేశ్‌లో పదివేల పోస్టులతో జాబ్‌ క్యాలెండర్ విడుదల - ఏటా ఉగాదికి ఉద్యోగాల జాతర!
Weather in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం! ఉరుములు పిడుగులతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ!
తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం! ఉరుములు పిడుగులతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ!
AP DSC Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3004 పోస్టులతో ఏపీ సర్కార్ DSC నోటిఫికేషన్!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3004 పోస్టులతో ఏపీ సర్కార్ DSC నోటిఫికేషన్!

వీడియోలు

Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
Negative Campaign on SRH | IPL 2026 కి ముందు సన్ రైజర్స్ పై ఫేక్ పోస్టులు | ABP Desam
CSK Video on Shivam Dube | IPL 2026 కి ముందు చెన్నైలో క్రికెట్ బాల్స్ ఆందోళన | ABP Desam
Virat Kohli Home Coming RCB | IPL 2026 యుద్ధానికి తిరిగొచ్చిన మహారాజు | ABP Desam
Ishan Kishan Interim Captain SRH | ఇషాన్ వైపే ఆరెంజ్ ఆర్మీ మొగ్గు చూపింది అందుకే | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Petrol Price Hike: షాకిచ్చిన చమురు కంపెనీలు - పెరిగిన ప్రీమియం పెట్రోల్ ధరలు!
షాకిచ్చిన చమురు కంపెనీలు - పెరిగిన ప్రీమియం పెట్రోల్ ధరలు!
Iran War Updates: హెర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత - ఇరాన్‌ను కట్టడి చేసేందుకు అమెరికా భారీ వ్యూహం!
హెర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత - ఇరాన్‌ను కట్టడి చేసేందుకు అమెరికా భారీ వ్యూహం!
Lakshmir Bhandar:మహిళలకు ప్రతి నెల ఇచ్చే ఆర్థిక సాయం రూ. 500 పెంచిన మమత! 10 హామీలతో టీఎంసీ మేనిఫెస్టో విడుదల!
మహిళలకు ప్రతి నెల ఇచ్చే ఆర్థిక సాయం రూ. 500 పెంచిన మమత! 10 హామీలతో టీఎంసీ మేనిఫెస్టో విడుదల!
MNM Election Symbol: లోకనాయకుడికి సింబల్ చిక్కులు! కాగడా వదిలి సూర్యుడి వెలుగులోకి రమ్మని పిలుస్తున్న స్టాలిన్!
లోకనాయకుడికి సింబల్ చిక్కులు! కాగడా వదిలి సూర్యుడి వెలుగులోకి రమ్మని పిలుస్తున్న స్టాలిన్!
Pradip Guruji: మంచి పనులు చేయడానికి డబ్బుల్లేవని దొంగ నోట్లు ముద్రించాడట - ఈ గురూజీ మామూలోడు కాదు!
మంచి పనులు చేయడానికి డబ్బుల్లేవని దొంగ నోట్లు ముద్రించాడట - ఈ గురూజీ మామూలోడు కాదు!
Electric Vehicles: ఇరాన్ చమురు సంక్షోభంతో ఈవీల వెంట పరుగులు తీస్తున్న జనం! పెరిగిన BYD, విన్‌ఫాస్ట్ విక్రయాలు!
ఇరాన్ చమురు సంక్షోభంతో ఈవీల వెంట పరుగులు తీస్తున్న జనం! పెరిగిన BYD, విన్‌ఫాస్ట్ విక్రయాలు!
Vijayd Deverakonda Rashmika : చిన్నారిపై విరోష్ కపుల్ ముద్దుల వర్షం - చిట్టి ఫ్యాన్‌కు లడ్డూలు, పులిహోర స్పెషల్... క్యూట్ వీడియో
చిన్నారిపై విరోష్ కపుల్ ముద్దుల వర్షం - చిట్టి ఫ్యాన్‌కు లడ్డూలు, పులిహోర స్పెషల్... క్యూట్ వీడియో
Telangana new education system: తెలంగాణ కొత్త విద్యావిధానంలో టెన్త్ పరీక్షలు ఉండవు - మీడియా చిట్ చాట్‌లో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ కొత్త విద్యావిధానంలో టెన్త్ పరీక్షలు ఉండవు - మీడియా చిట్ చాట్‌లో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
Embed widget