అన్వేషించండి

CM Jagan: ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ ప్రారంభించిన సీఎం - దీంతో ప్రయోజనాలు ఇవే

ఈ ఆరోగ్య సురక్ష పథకాన్ని తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ శుక్రవారం (సెప్టెంబరు 29) ప్రారంభించారు.

ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరికి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు చేసే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ ఆరోగ్య సురక్ష పథకాన్ని తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ శుక్రవారం (సెప్టెంబరు 29) ప్రారంభించారు. 45 రోజులపాటు ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుంచి జిల్లా కలెక్టర్‌ వరకు అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా ఉంటారని.. 10,032 సచివాలయాల పరిధిలో ‘విలేజ్‌ క్లినిక్స్‌’ అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లను అందుబాటులో ఉంచుతున్నామని.. ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి ఆరోగ్య సేవలు అందేలా చూస్తామని అన్నారు. ప్రతి ఒక్కరికి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి నయం అయ్యే వరకు ఆరోగ్య సురక్ష అండగా ఉంటుందని చెప్పారు.

ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో అంబులెన్స్‌ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఒక డాక్టర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉంటే ఇంకో డాక్టర్‌ అంబులెన్స్‌లో గ్రామాల్లోకి వెళ్తారని సీఎం జగన్‌ తెలిపారు. అయితే, ఇంటింటికీ వెళ్లి అందరికీ వైద్య సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించనున్నారని చెప్పారు. రాష్ట్రంలో 1.60 కోట్ల కుటుంబాలను ఈ డాక్టర్ల ప్రత్యేక టీమ్‌లు కలుస్తాయని చెప్పారు. ఆరోగ్య సురక్షలో భాగంగా ఏడు రకాల వైద్య పరీక్షలను ఇళ్ల వద్దనే డాక్టర్లు, సిబ్బంది నిర్వహించనునన్నట్లుగా చెప్పారు. గ్రామాల్లో సురక్ష క్యాంపులను నిర్వహించి మందులు పంపిణీ చేస్తామని చెప్పారు.

‘‘

గతంలో ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమం లేదు. ప్రివెంటివ్‌ కేర్‌లో ఇదొక నూతన అధ్యాయం. ప్రస్తుతం 542 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు ఉన్నాయి. ప్రివెంటివ్‌ కేర్‌లో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్పెస్ట్‌ను తీసుకురాగలిగాం. ప్రతి మండలంలో 2 పీహెచ్‌సీలు, ప్రతి పీహెచ్‌లోసీ 104 వాహనం, ఇద్దరు డాక్టర్లు కూడా ఉండేలా చూశాం. జగనన్న సురక్ష ద్వారా గ్రామాన్ని పూర్తిగా మ్యాప్‌ చేయబోతున్నాం. ప్రతి ఇంటినీ, ప్రతి గ్రామానీ జల్లెడ పడుతున్నాం. ఇంట్లో ఎలాంటి ఆనారోగ్య సమస్యలు ఉన్నా.. వారిని గుర్తించి వారికి వైద్య సేవలు అందిస్తున్నాం. ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి, స్పెషలిస్టు డాక్టర్ల చేతవారికి చికిత్స అందిస్తున్నాం. తర్వాత వారికి తదుపరి పరీక్షలు కూడా చేయించి, వారికి అవసరమైన చికిత్సలు అందిస్తున్నాం. నయం అయ్యే దాకా ఆ పేషెంట్‌ను చేయిపట్టి నడిపిస్తాం.

జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ గురించి, వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా గురించి కూడా పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తాం. ఆరోగ్య శ్రీ సేవలు ఏరకంగా పొందుతారనే విషయాన్ని ఈకార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తాం. ఎవ్వరికీ సందేహాలు లేకుండా ప్రతి కుటుంబానికీ అవగాహన కల్పిస్తాం. ఆరోగ్య శ్రీ సేవలు పొందిన తర్వాత సంబంధిత పేషెంటుకు అవసరమైన మందులు అందేలా, ఆ మేరకు పర్యవేక్షణ ఉండేలా తగిన రీతిలో ఆరోగ్య సురక్ష ద్వారా మ్యాపింగ్‌  చేస్తాం. వీరికి ఎలాంటి సమస్యలేకుండా చూస్తాం. సమయానికి మందులు అందేలా, మళ్లీ అవసరమైన చెకప్‌లు చేయించేలా, అవసరమైన చికిత్స లేదా మందులు అందేలా చూస్తాం. ఈ కార్యక్రమాలన్నీ ఆరోగ్య సురక్ష కింద అందిస్తాం. 

క్యాన్సర్‌ లాంటి పేషెంట్లకు ఖరీదైన మందులు కూడా ఉచితంగా ఆరోగ్య సురక్ష ద్వారా అందిస్తాం. ప్రజారోగ్య రంగంలో జగనన్న ఆరోగ్య సురక్ష కీలక పాత్ర పోషించబోతోంది. ఏ పేదవాడు వైద్యంకోసం ఇబ్బంది పడకూడదనే కార్యక్రమాన్ని ఇందులో చేపడుతున్నాం. మొత్తం ఐదు దశల్లో కార్యక్రమం జరుగుతుంది. మొదటి దశ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. సెప్టెంబర్‌ 15 నుంచి జరుగుతోంది. బీపీ, షుగర్‌, హిమోగ్లోబిన్‌ తప్పనిసరిగా పరీక్షలు చేస్తారు. అవసరాన్ని బట్టి యూరిన్‌, మలేరియా, డెంగీ, కఫం పరీక్షలు చేస్తారు. ప్రతి ఇంటికీ వెళ్లి, ప్రతి ఒక్కరినీ టెస్టు చేస్తారు. ఆరోగ్య శ్రీ యాప్‌ ద్వారా మ్యాపింగ్ చేస్తారు. టెస్టు ఫలితాలు ఆధారంగా ఆరోగ్య శిబిరాల్లో వారికి చికిత్సలు అందిస్తారు. ఆరోగ్య శ్రీని ఎలా ఉపయోగించుకోవాలి అన్నదానిపై కూడా పూర్తిగా అవగాహన కల్పిస్తారు’’ అని సీఎం జగన్ చెప్పారు.

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Health Condition: పవన్ కళ్యాణ్‌కు భుజాల్లో తీవ్ర గాయం.. వెంటనే సర్జరీ చేయించుకోవాలని ముంబై డాక్టర్ల సూచన!
పవన్ కళ్యాణ్‌కు భుజాల్లో తీవ్ర గాయం.. వెంటనే సర్జరీ చేయించుకోవాలని ముంబై డాక్టర్ల సూచన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి పరిహారం నిధులు జమ
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి పరిహారం నిధులు జమ
Bullet Train Corridors: హైదరాబాద్- చెన్నై, హైదరాబాద్- బెంగళూరు బుల్లెట్ రైళ్ల పనుల్లో తొలి అడుగు.. మార్కింగ్ చేస్తున్న అధికారులు
హైదరాబాద్- చెన్నై, హైదరాబాద్- బెంగళూరు బుల్లెట్ రైళ్ల పనుల్లో తొలి అడుగు.. మార్కింగ్ చేస్తున్న అధికారులు
Viral News: దుప్పటి అడిగినందుకు విద్యార్థినిని హాస్టల్ ఖాళీ చేపించిన వార్డెన్! చింతలపూడిలో ఘటన
దుప్పటి అడిగినందుకు విద్యార్థినిని హాస్టల్ ఖాళీ చేపించిన వార్డెన్! చింతలపూడిలో ఘటన

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu Amaravati Capital Review: అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
Nerve Weakness : నరాల బలహీనతకి కారణాలు ఏంటి? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
నరాల బలహీనతకి కారణాలు ఏంటి? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
CII Partnership Summit 2026: నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
Kakinada KIET College Invitation To CM Vijay: కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
Patancheru Real Estate: ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
Los Angeles Olympics Qualification Criteria : లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
Embed widget