అన్వేషించండి

కేంద్రం ఇవ్వని పంటలకి కూడా మద్దతు ధర ఇస్తున్నాం- పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ప్రారంభోత్సవంలో జగన్ కామెంట్స్

రైతులు తాము అమ్ముకోవాల్సిన ఉత్పత్పులను ఆర్బీకేల ద్వారా కొనుగోలు జరిగేలా చేస్తున్నామన్నారు సీఎ జగన్. కేంద్ర ప్రభుత్వం ఇవ్వని పంటలకి కూడా కనీస మద్ధతు ధర ఇస్తూ ఆర్బీకేలలో పోస్టర్లలో డిస్‌ప్లే చేశామన్నారు.

రాష్ట్రంలో 945 ప్రైమరీ ప్రాసెసింగ్‌ కలెక్షన్‌ సెంటర్ల ఏర్పాటుకు నిర్ణయించుకున్నట్టు సీఎం జగన్ చెప్పారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను వర్చువల్‌గా ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ప్రస్తుతానికి 421 ప్రైమరీ ప్రాసెసింగ్‌ కలెక్షన్‌ సెంటర్లు ప్రారంభించినట్టు తెలిపారు. "ఇవన్నీ 1912 ఆర్బీకేలకు మ్యాప్‌ చేసినట్టు పేర్కొన్నారు. తొలిదశలో 344 కోల్డ్‌ రూమ్‌ల పనులు జరుగుతున్నాయి. వీటిలో 43 కోల్డ్‌ రూమ్‌లు ప్రారంభించుకున్నాం. ఇవి కూడా దాదాపు 194 ఆర్బీకేలతో అనుసంధానమై ఉన్నాయి. ప్రతి ఆర్బీకేను కోల్డ్‌ రూమ్స్, కలెక్షన్‌ సెంటర్లకు మ్యాపింగ్‌ చేశాం. ప్రైమరీ ప్రాసెసింగ్‌లో డ్రయ్యింగ్‌ ప్లాట్‌ఫామ్‌లు, కలెక్షన్‌ సెంటర్లు, వ్యవసాయ ఉపకరణాలు వంటి వాటిని ఆర్బీకే పరిధిలో తీసుకునిపోవాలి. గ్రేడింగ్, సెగ్రిగేషన్‌ వంటి కార్యక్రమాలు ఆ స్థాయిలో జరిగితే సెకండరీ ప్రాసెసింగ్‌ అనేది జిల్లా స్ధాయిలో జిల్లాకొకటి ఉండేటట్టుగా అడుగులు పడుతున్నాయి. అని అన్నారు. 

రైతులు తాము అమ్ముకోవాల్సిన ఉత్పత్తులను ఆర్బీకేల ద్వారా కొనుగోలు జరిగేలా చేస్తున్నామన్నారు జగన్. కేంద్ర ప్రభుత్వం ఇవ్వని పంటలకి కూడా కనీస మద్ధతు ధర ఇస్తూ ఆర్బీకేలలో పోస్టర్లలో డిస్‌ప్లే చేశాం. ఏ పంట ధరైనా పడిపోతే ఆర్బీకే స్ధాయిలోనే జోక్యం చేసుకుని మద్ధతు ధరకు కొని రైతును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. దీనికి ఈ ప్రైమరీ, సెకండరీ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఉపయోగపడతాయి. ఈ మార్పులతో రైతు పండించే పంటకు మెరుగైన రేటు వస్తుంది అని జగన్ అభిప్రాయపడ్డారు. 

శ్రీసిటీలో రూ.1600 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన పనులకు శంకుస్ధాపన చేయడం ఆనందం కలిగిస్తోందన్నారు జగన్. మోన్‌ డ లీజ్‌ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకంతో రెండో విడతలో రూ.1500 కోట్లు పెట్టుబడి పెడుతోందన్నారు. చాక్‌లెట్, క్యాడ్‌బెర్రీ, బోర్న్‌విటా వంటివి తయారు చేస్తున్న ఈ ప్యాక్టరీ దినదినాభివృద్ది చెందాలని జగన్ ఆకాంక్షించారు. 

సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటుతో ధర్మవరం ప్రాంతానికి సంబంధించిన వేరుశనగ పంటకు విలువ పెరుగుతుందని వివరించారు. మెరుగైన ధర ఇవ్వాలనే ఈ యూనిట్ల ఏర్పాటుకు నిర్ణయించాం. ధరల స్థిరీకరణనిధి ద్వారా ఏటా రూ.3వేల కోట్లు కేటాయించి నాలుగేళ్లలో దాదాపుగా రూ.8వేలకోట్లతో పంట కొనుగోలకు ఖర్చు చేశాం. మార్కెట్‌లో మద్ధతు ధర లేనప్పుడు రైతుభరోసా కేంద్రాల ద్వారా కొనుగోళ్లు చేస్తున్నాం. మద్ధతు ధరలు కల్పిస్తున్నాం. ఆర్బీకేలో డిస్‌ప్లే చేసిన రేటు కన్నా తక్కువ వస్తే ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని జగన్ తెలిపారు.  
రూ.75 కోట్లతో ధర్మవరంలో ఏర్పాటు చేస్తున్న వేరుశనగ ప్రాసెసింగ్‌ యూనిట్‌ జిల్లా రైతులకు ఉపయోగపడుతుంది. 55,620 మెట్రిక్‌ టన్నుల సామర్ధ్యంతో ఈ యూనిట్‌ 15 వేల మంది రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. మరో 9 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తయితే చిక్కీ, ఆయిల్, పీనట్‌ బట్టర్‌ వంటి ఉపఉత్పత్తులు తయారై పంటకు మార్కెటింగ్‌ పెరుగుతుంది. 

నాలుగు ప్రైమరీ ప్రాసెసింగ్‌ యూనిట్లును చిత్తూరులో జిల్లాలో 3, అన్నమయ్యజిల్లాలో ఒకటి ప్రారంభిస్తున్నామన్నారు జగన్. దాదాపు 14,400 మెట్రిక్‌ టన్నులకు సంబంధించి పండ్లు, కూరగాయల ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ప్రారంభిస్తున్నాం. దీనివల్ల మార్కెటింగ్‌ సౌకర్యం పెరుగి రైతులకు మంచి ధరలు లభిస్తాయి. 2414 మంది రైతులకు మంచి జరుగుతుంది. 

సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో 3,588 మంది రైతులుకు మేలు చేస్తూ.. దాదాపు 10,800 టన్నుల టమాటా ప్రాసెసింగ్‌ చేసే యూనిట్లకు శంకుస్ధాపన చేసుకున్నాం. మరో నాలుగు నెలల్లో వీటిని ప్రారంభించుకోబోతున్నాం. వీటికి అదనంగా 250 మెట్రిక్‌ టన్నుల కోల్డ్‌ స్టోరేజ్‌ ఏర్పాటుతో మార్కెట్‌లో రైతుల ఇబ్బందులు తీరుతాయి. మార్కెట్‌లో ధరలు పడిపోయినా అమ్ముకోవాల్సిన అవసరం లేకుండా పోతుంది. మంచి ధరలకు అమ్ముకునే అవకాశం కలుగుతుంది. 

మిల్లెట్స్‌లో దాదాపు 13 సెకెండరీ ప్రాసెసింగ్‌ యూనిట్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మరో 32పైగా ప్రైమరీ ప్రాసెసింగ్‌ మిల్లెట్‌ యూనిట్లు అందుబాటులోకి వస్తున్నాయి. దేశంలో ఎక్కడా జరగని విధంగా మిల్లెట్స్‌కు ఎంఎస్‌పీ అందించింది కూడా మన రాష్ట్రంలోనే. ఇప్పుడు 7,200 మెట్రిక్‌ టన్నుల కెపాసిటీతో సెకండరీ ప్రాసెసింగ్‌ యూనిట్‌ రావడం విజయనగరం రైతులకు మంచి జరుగుతుంది. 

కర్నూలులో ఆనియన్‌ డీహైడ్రేషన్‌ కార్యక్రమాన్ని పైలట్‌ ప్రాజెక్టు కింద వంద చోట్ల చేస్తున్నామన్నారు జగన్. రూ.1 లక్ష పెట్టుబడితో ప్రతిఒక్కరికీ దాదాపు రూ.12వేల ఆదాయాన్నిచ్చే కార్యక్రమమిది. రానున్న రోజుల్లో ఈ యూనిట్లను మరింత విస్తరిస్తూ ఐదువేల వరకు పెంచుతాం.

టాప్ హెడ్ లైన్స్

Deepam 2 Scheme: ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్.. ఉచిత గ్యాస్ సిలిండర్లకు రూ.139.53 కోట్లు విడుదల
ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్.. ఉచిత గ్యాస్ సిలిండర్లకు రూ.139.53 కోట్లు విడుదల
Thalliki Vandanam Cybercrime: తల్లికి వందనం పథకంలో సైబర్ మోసం.. 28 మంది అకౌంట్లలో నగదు మాయం, ట్విస్ట్ ఏంటంటే
తల్లికి వందనం పథకంలో సైబర్ మోసం.. 28 మంది అకౌంట్లలో నగదు మాయం, ట్విస్ట్ ఏంటంటే
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Bengal Birbhum Police Raid: బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Ram Charan : ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
Maruti Suzuki Victoris EMI calculator: హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
Korean Horror Thriller OTT : దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
Embed widget