అన్వేషించండి

AP Cabinet: చంద్రబాబు వార్నింగ్: ఎమ్మెల్యేల తీరుపై సీరియస్, మంత్రులకు కీలక ఆదేశాలు!

AP Cabinet: పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్ట్రాంగ్‌ వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేలను అదుపులో ఉంచాలని మంత్రులకు బాధ్యతలు అప్పగించారు.  

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

AP Cabinet: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు ఎమ్మెల్యేలు గీత దాటి వ్యవహరిస్తున్నారనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో ఇది మరింతగా బహిర్గతమైంది. చాలా మంది సభ్యులు మంత్రులను, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే కామెంట్స్‌తో ఇరుకున పెట్టారు. ఇది మీడియాలో, సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్‌గా దృష్టి పెట్టారు. ఇలాంటివి భవిష్యత్‌లో జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగానే మంత్రులను వార్న్ చేశారు. జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రులు చొరవ తీసుకొని కఠినంగా ఉండాలని క్లాస్ తీసుకున్నారు.         

శుక్రవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో కీలకమైన విషయాలు చర్చించిన తర్వాత మంత్రులతో చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఉందని దీన్ని చెడగొట్టేందుకు వివిధ శక్తులు పని చేస్తున్నాయని ఈ టైంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. మాట్లాడే ప్రతి మాట ఆచితూచి ఉండాలని చెప్పారు. ఈ మధ్య జరిగిన అసెంబ్లీ సమావేాల్లో కొందరు సభ్యులు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా మాట్లాడారని గుర్తు చేశారు. పార్టీ గీత దాటుతున్న ఎమ్మెల్యేలను నియంత్రించాల్సిన బాధ్యత పూర్తిగా జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రులు బాధ్యత తీసుకోవాలన్నారు. కొందు తెలిస తెలియకో పరిధులు దాటి మాట్లాడారని, ఇకపై ఇలాంటిది జరగకూడని హెచ్చరించారు. దీనికి మంత్రులు బాధ్యత తీసుకోవాలన్నారు.   

జిల్లా ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్న మంత్రులకు చాలా బృహత్తర బాధ్యత ఉందని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. వ్యూహాత్మకంగా వ్యవహరించాలని సూచించారు. రొటీన్ పనుల బాధ్యతలు జిల్లా యంత్రాంగం చూసుకుంటుందని, కీలకమైన విషయాలపై దృష్టి పెట్టాలన్నారు. కూటమి పార్టీల మధ్య సమన్వయం చేసుకోవాలని, అసెంబ్లీ సమావేశాల్లో ఫ్లోర్ మేనేజ్మెంట్‌ చాలా ముఖ్యమని అన్నారు. ఒక్కో మంత్రికి ఏడుగురు ఎమ్మెల్యేల బాధ్యత అప్పగిస్తే వారు ఏం చేస్తున్నారో తెలుసుకోలేరా అని కాస్త సీరియస్‌గా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. జిల్లా బాధ్యతలతోపాటు శాఖాపరంగా వచ్చే విమర్శలను కూడా గట్టిగా బదులివ్వాలని స్పందించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు ప్రారంభించినప్పుడు కచ్చితంగా ఆ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి జిల్లాలకు వెళ్లి పాల్గొనాలని సూచించారు.       

అసెంబ్లీలో ఏం జరిగింది?

ఈ మధ్య జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బొండా ఉమ, బాలకృష్ణ, కామినేని శ్రీనివాస్ సహా ఇతర సభ్యులు చాలా తమ ప్రశ్నలతో సంచలనంగా మారారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్‌ను ఇబ్బంది పెట్టేలా కొన్ని ప్రశ్నలను బొండా ఉమామహేశ్వరరావు సంధించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు విషయంలో ప్రజల నుంచి సమస్యలు ఎదురవుతున్నాయని ఎవరూ స్పందించం లేదని విమర్శించారు. సమస్య పవన్ దృష్టికి తీసుకెళ్దామన్నా సరే ఆయన అందుబాటులో ఉండటం లేదన్నారు. అది జరిగిన కొన్ని రోజులకే బాలకృష్ణ కూడా చిరంజీవిపై వ్యక్తిగత విమర్శలు చేశారు. ఇది కూడా రచ్చకు కారణమైంది. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి సర్ది చెప్పాల్సి వచ్చింది. అంతేకాకుండా ఇకపై ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు చంద్రబాబు చర్యలు చేపట్టారు. కూటమి నేతల మధ్య విభేదాలు రాకుండా ఉండేలా ఇన్‌ఛార్జ్ మంత్రులు చొరవ తీసుకోవాలని సూచించారు. శాఖలను టార్గెట్ చేసేలా ఎలాంటి విమర్శలు చేయొద్దని జాగ్రత్తలు చెప్పారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Grok AI: 'X'కు నోటీసు పంపిన కేంద్రం! గ్రోక్ ఏఐ నుంచి అశ్లీల కంటెంట్ తొలగించాలని ఆదేశం! 72 గంటల గడువు
'X'కు నోటీసు పంపిన కేంద్రం! గ్రోక్ ఏఐ నుంచి అశ్లీల కంటెంట్ తొలగించాలని ఆదేశం! 72 గంటల గడువు
Budget 2026:దేశంలో తొలిసారి ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారా ? కొనసాగుతున్న సస్పెన్స్ !
దేశంలో తొలిసారి ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారా ? కొనసాగుతున్న సస్పెన్స్ !
Advertisement

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Grok AI: 'X'కు నోటీసు పంపిన కేంద్రం! గ్రోక్ ఏఐ నుంచి అశ్లీల కంటెంట్ తొలగించాలని ఆదేశం! 72 గంటల గడువు
'X'కు నోటీసు పంపిన కేంద్రం! గ్రోక్ ఏఐ నుంచి అశ్లీల కంటెంట్ తొలగించాలని ఆదేశం! 72 గంటల గడువు
Budget 2026:దేశంలో తొలిసారి ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారా ? కొనసాగుతున్న సస్పెన్స్ !
దేశంలో తొలిసారి ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారా ? కొనసాగుతున్న సస్పెన్స్ !
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Gig Workers Strike : గిగ్ వర్కర్ల సమ్మె నివారణకు కేంద్రం కొత్త ఫార్ములా! ఈ షరతులు నెరవేర్చితేనే సామాజిక భద్రతా ప్రయోజనాలు!
గిగ్ వర్కర్ల సమ్మె నివారణకు కేంద్రం కొత్త ఫార్ములా! ఈ షరతులు నెరవేర్చితేనే సామాజిక భద్రతా ప్రయోజనాలు!
India Tour of Bangladesh 2026:బంగ్లాదేశ్‌లో హింసపై భారత్‌లో ఆందోళనలు కొనసాగుతున్న వేళ బీసీబీ కీలక ప్రకటన
బంగ్లాదేశ్‌లో హింసపై భారత్‌లో ఆందోళనలు కొనసాగుతున్న వేళ బీసీబీ కీలక ప్రకటన
Pariksha Pe Charcha 2026: పరీక్షా పే చర్చ 2026 కోసం ఎలా నమోదు చేసుకోవాలి? ఎవరు పాల్గొనవచ్చు?
పరీక్షా పే చర్చ 2026 కోసం ఎలా నమోదు చేసుకోవాలి? ఎవరు పాల్గొనవచ్చు?
Embed widget