అన్వేషించండి

Amaravati: అమరావతికి అండగా నిలబడ్డ కేంద్రానికి మద్దతుగా ఇంటి ముందు దీపాలు వెలిగించండి! రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు పిలుపు!

Amaravati: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి కేంద్రం మద్దతు ఇచ్చినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రతి ఇంటి ముందు దీపాలు వెలిగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అమరావతి అభివృద్ధిపై చంద్రబాబు ఎన్డీఏ భాగస్వాములతో చర్చించారు.
  • రాష్ట్రవ్యాప్తంగా ఇంటి ముందు దీపాలు వెలిగించాలని సీఎం పిలుపునిచ్చారు.
  • రైతులకు, అమరావతికి మద్దతుగా దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
  • గత ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని అడ్డుకుందని చంద్రబాబు విమర్శించారు.

Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలతో కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రాజధాని అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న మద్దతు, గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించడం వంటి అంశాలపై చర్చించారు.  ఈ సందర్భంగా ఆయన ఒక ప్రత్యేక పిలుపునిచ్చారు. "అమరావతికి మద్దతుగా ఈ రోజు సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు దీపాలు వెలిగించాలి" అని సూచించారు. ఇది కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు, రాజధాని పట్ల ప్రజల నిబద్ధతను, కేంద్ర ప్రభుత్వ సహకారానికి కృతజ్ఞతను తెలియజేసి ఒక సంకేతమని ఆయన పేర్కొన్నారు. 

ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా మధ్యాహ్నం ఆయన ఉద్దండరాయునిపాలెం వెళ్లనున్నారు. ఈ  ప్రాంతానికి చారిత్రక ప్రాధాన్యత ఉంది. సరిగ్గా 2015లో ఇదే ప్రాంతంలో  అమరావతి రాజధాని నగరానికి అత్యంత వైభవంగా శంకుస్థాపన జరిగింది. ఐదేళ్ల విరామం తర్వాత మళ్లీ అదే స్పూర్తిని నింపేందుకు సీఎం అక్కడ పర్యటించనున్నారు. అదే విధంగా సాయంత్రం వేళల్లో రాష్ట్రవ్యాప్త దీపోత్సవం జరగనుంది.

అమరావతి అంశం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో గత ఐదేళ్లుగా ఒక పెద్ద వివాదంగా ఉంది. గత వైసీపీ ప్రభుత్వం' మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకురావడంతో అమరావతి నిర్మాణం పూర్తిగా స్తంభించిపోయింది. మొన్న జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన తర్వాత, అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పుడు చట్టసవరణ కూడా చేసి అమరావతి ఏకైక రాజధాని అని పార్లమెంట్‌లో చట్టం తీసుకొచ్చారు. 

ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అమరావతికి, భూములు ఇచ్చిన రైతులకు అండగా నిలబడి మద్ధతు ప్రకటించింది. అందుకే కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రజల్లో రాజధాని పట్ల నమ్మకాన్ని పెంచడానికి ఈ దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 

ఈ దీపోత్సవం కేవలం రాజధాని ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకుండా, రాష్ట్రంలోని 26జిల్లాల్లోని ప్రతి గ్రామంలోనూ నిర్వహించాలని ఎన్డీఏ నేతలు నిర్ణయించారు. ఇందులో  పార్టీ కార్యకర్తలు, ప్రజలు భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు. ఉద్దండరాయునిపాలెం పర్యటనలో ఆయన అక్కడ ఉన్న ప్రస్తుత పరిస్థితులను సమీక్షించి, నిర్మాణ పనులు ఎప్పటి నుంచి వేగవంతం చేయాలో అధికారులకు సూచనలు చేయనున్నారు. 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమావేశంలో వైసీపీ అధినేత జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజలు తిరస్కరించినప్పటికీ జగన్ తీరులో మార్పు రాలేదని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు రాజధాని ప్రాజెక్టును నాశనం చేశారని అన్నారు. ఆ గాయాలు మాన్సే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో ఇతర ప్రాంతాల్లో చిచ్చు పెట్టేందుకు అర్థంపర్థం లేని ప్రతిపాదనలు తీసుకొస్తున్నారని అన్నారు. 

అమరావతి పేరు పలకడానికి జగన్‌కు ఇష్టం లేదని చంద్రబాబు విమర్శించారు. అందుకే కొత్త కొత్త వింతైన పేర్లు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. అమరావతి ఏర్పాటుతో ఏ ప్రాంతానికి అన్యాయం జరగదని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పటికే విశాఖలో ప్రపంచస్థాయి సంస్థలు తీసుకొస్తున్నామని వివరించారు. రాయలసీమలో కూడా పరిశ్రమలు తెచ్చామన్నారు. కర్నూలులో విలైనంత త్వరగా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. 

Frequently Asked Questions

అమరావతి దీపోత్సవం ఎందుకు నిర్వహిస్తున్నారు?

అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రజల్లో రాజధాని పట్ల నమ్మకాన్ని పెంచడానికి ఈ దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

దీపోత్సవం ఎప్పుడు, ఎక్కడ జరగనుంది?

ఈ రోజు సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు దీపాలు వెలిగించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఉద్దండరాయునిపాలెం లో కూడా ప్రత్యేక కార్యక్రమం జరగనుంది.

గతంలో అమరావతి అభివృద్ధి ఎలా ఉంది?

గత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకురావడంతో అమరావతి నిర్మాణం నిలిచిపోయింది. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చేస్తామని చట్టం చేసింది.

ముఖ్యమంత్రి ఉద్దండరాయునిపాలెం ఎందుకు వెళ్తున్నారు?

2015లో అమరావతి శంకుస్థాపన జరిగిన ఉద్దండరాయునిపాలెం ప్రాంతానికి చారిత్రక ప్రాధాన్యత ఉంది. అక్కడి ప్రస్తుత పరిస్థితులను సమీక్షించి, నిర్మాణ పనులను వేగవంతం చేయడానికి అధికారులకు సూచనలు ఇవ్వనున్నారు.

దీపోత్సవంలో ఎవరు పాల్గొనాలి?

ఈ దీపోత్సవం రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని ప్రతి గ్రామంలోనూ నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో పార్టీ కార్యకర్తలు, ప్రజలు అందరూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh Speech At Bhogapuram Airport: ఎర్రబస్సు రాదన్న చోట భోగాపురం ఎయిర్‌పోర్ట్.. వికసిత్ ఉత్తరాంధ్రకు గ్రోత్ ఇంజన్: నారా లోకేష్
ఎర్రబస్సు రాదన్న చోట భోగాపురం ఎయిర్‌పోర్ట్.. వికసిత్ ఉత్తరాంధ్రకు గ్రోత్ ఇంజన్: నారా లోకేష్
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Breaking News:నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 బైక్‌లే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్‌కు అతి భారీ డిమాండ్
కేవలం 3 నిమిషాల్లోనే అమ్ముడైన రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 X రఫ్ క్రాఫ్ట్స్ - ఏంటి దీని స్పెషాలిటీ?
మేష రాశి ఆగస్టు 2-8 వారఫలం: కుజుడి సంచారంతో అదృష్ట యోగం, విజయాలు!
మేష రాశి ఆగస్టు 2-8 వారఫలం: కుజుడి సంచారంతో అదృష్ట యోగం, విజయాలు!
Embed widget