Ambati Rambabus Office Attack: అంబటి రాంబాబు ఇంటిపై దాడి.. టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవిపై కేసు నమోదు
Attack on Ambati Rambabu House: మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి ఘటనలో టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి సహా 31 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Ambati Rambabu | గుంటూరు: ఏపీ మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంబటి రాంబాబు కార్యాలయం, నివాసంపై జరిగిన దాడి ఘటనలో పోలీసులు కీలక చర్యలు తీసుకున్నారు. గుంటూరులోని పట్టాభిపురం పోలీసులు ఈ ఘటనలో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం అధికార కూటమి వర్సెస్ ప్రతిపక్ష వైసీపీ నేతలుగా వివాదం ముదురుతోంది.
ఏ1గా ఎమ్మెల్యే గళ్లా మాధవి.. నిందితుల జాబితాలో 31 మంది
ఈ కేసులో పోలీసులు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవిని ప్రధాన నిందితురాలిగా (A1) చేర్చారు. అలాగే ఆమె భర్త గళ్లా రామచంద్రరావును ఏ2 కాగా, మొత్తం 31 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అల్లర్లు సృష్టించడం, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం, అక్రమంగా చొరబాటు వంటి అభియోగాలను వీరిపై మోపారు. దాడి జరిగిన సమయంలో అంబటి రాంబాబు కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొనడం తెలిసిందే.
రాజకీయ ఉద్రిక్తత, పోలీసుల విచారణ
అంబటి రాంబాబు చేసిన కొన్ని వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ శ్రేణులు మొదటి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. తరువాత ఈ దాడికి పాల్పడ్డారు. అంబటి రాంబాబు కార్యాలయం ఫర్నిచర్ను ధ్వంసం చేయడంతో పాటు అక్కడ ఉన్న వైసీపీ ఫ్లెక్సీలను చింపివేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం పోలీసులు సీసీటీవీ దృశ్యాలను విశ్లేషిస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేస్తుండగా, తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన గుంటూరులో రాజకీయాలను వేడెక్కిస్తోంది.
అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు మొబైల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కోర్టు తీర్పుతో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అంతకుముందు గుంటూరు జీజీహెచ్లో అంబటికి వైద్య పరీక్షలు నిర్వహించారు. పోలీస్ విధులకు ఆటంకం కలిగించిన కేసులో స్టేషన్ బెయిల్ లభించినప్పటికీ, సీఎంపై దూషణల కేసులో కోర్టు రిమాండ్కు ఆదేశించింది.
పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో అంబటిపై రాష్ట్రవ్యాప్తంగా 16 క్రిమినల్ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆయన బయట ఉంటే శాంతిభద్రతల సమస్య తలెత్తడమే కాకుండా, ఆయన ప్రాణాలకు కూడా ముప్పు ఉందన్న పోలీసుల వాదనతో కోర్టు ఏకీభవించింది. సీఎంపై అసభ్య పదజాలం వాడారని, రెండు వర్గాల మధ్య వైషమ్యాలు పెంచేలా ఆయన తీరు ఉందని పోలీసులు కోర్టుకు విన్నవించారు. ఆరోరోపణలు రుజువైతే ఏడేళ్లపైగా శిక్ష పడే అవకాశం ఉండటంతో, తదుపరి విచారణ కోసం అంబటి రాంబాబును తమ కస్టడీకి ఇవ్వాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కోరారు.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
ట్రెండింగ్ వార్తలు






















