అన్వేషించండి

కన్నాను బీజేపీ టార్గెట్ చేయబోతుందా- అందుకే ఈ నిర్ణయం తీసుకుందా?

గుంటూరు కేంద్రంగా కన్నా లక్ష్మినారాయణ కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా గతంలో భారతీయ జనతా పార్టీలో కీలకంగా వ్యవహరించారు. టీడీపీలో చేరిపోయారు. దీంతో ఆయన్ని బీజేపీ టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది.

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈ నెల24న గుంటూరులో నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర పార్టీ నాయకత్వం హాజరుకాబోతోంది. ఇప్పటికే రాష్ట్ర పార్టీ కోర్ కమిటి సమావేశాన్ని రాజమండ్రిలో నిర్వహించారు. ఇప్పుడు రాష్ట్ర పార్టీ కార్యవర్గ సమావేశానికి గుంటూరును వేదికగా ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యచరణ అంశాలతో పాటుగా, ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ విస్తరణ, జిల్లాల వారీగా కమిటిల నియామకంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశానికి జాతీయ నాయకత్వం నుంచి నేతలు కూడా హజరయ్యే అవకాశం ఉంది.

కన్నా టార్గెట్‌గా సమావేశం
గుంటూరుకు చెందిన కీలక నేత కన్నా లక్ష్మినారాయణ పార్టీకి రాజీనామా చేసి తెలుగు దేశం పార్టీలో జాయిన్ అయ్యారు. దీంతో ఇప్పడు భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు గుంటూరులోనే సమావేశం కాబోతున్నారు. గుంటూరు కేంద్రంగా రాజకీయ వ్యూహాలు, పార్టీ విస్తరణ, జిల్లాలో నూతన నాయకులను పార్టీలోకి చేర్చుకునే విషయాలపై ప్రధానంగా చర్చించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. 

కన్నా పార్టీని వీడిన తరువాత చాలా మంది నాయకులు పార్టీని వీడతారని భావించారు. అందుకు భిన్నంగా చాలా మంది నాయకులు భారతీయ జనతా పార్టీలోనే ఇంకా కంటిన్యూ అవుతున్నారు. అలాంటి వారందరికి భరోసా కల్పించటంటతో పాటుగా పార్టీని మరింతగా బలోపేతం చేసే విషయంలో ఎలా ముందుకు సాగాలి అనే విషయాలపై క్లారిటి ఇచ్చే అవకాశం ఉంది.

బీజేపిలోకి తులసి రామచంద్ర ప్రభు
భారతీయ జనతా పార్టీలోకి కీలక నేతలు, పారిశ్రామిక వేత్తలు వస్తున్నారని ప్రచారం నడుస్తోంది. తాజాగా గుంటూరుకు చెందిన తులసి సీడ్స్ అధినేత, పారిశ్రామికవేత్త తులసీ రామచంద్ర ప్రభు భారతీయ జనతా పార్టీకి దగ్గరయ్యారు. రాజమండ్రిలో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి రాష్ట్ర పార్టీ ఇంచార్జ్ వి మురళీధరన్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు సమక్షంలో పార్టీలో చేరుతున్నారు. గుంటూరుకు చెందిన తులసీ సీడ్స్ అధినేత తులసీ రామచంద్ర ప్రభు 2009 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్రజా రాజ్యం పార్టీ నుంచి పోటీ చేశారు. కన్నా లక్ష్మి నారాయణపై పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చారు. పారిశ్రామికంగా సేవారంగల్లో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డులను పొందిన తులసి రామచంద్ర ప్రభు రానున్న ఎన్నికల్లో పార్టీ ఆదేశానుసారం పోటీ చేయడానికి కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. 

కన్నాకు చెక్ పెట్టేందుకుకే ....
గుంటూరు జిల్లా కేంద్రంగా కన్నా లక్ష్మినారాయణ కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా గతంలో భారతీయ జనతా పార్టీలో కీలకంగా వ్యవహరించారు. రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడి హోదాలో పని చేసిన కన్నా ఆ తరువాత పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ ఇటీవలే తెలుగు దేశం పార్టీలో చేరారు. దీంతో కాపు సామాజికవర్గం నుంచి కన్నా లక్ష్మినారాయణ, స్థానంలో తులసి రామ చంద్ర ప్రభును ఆహ్వానిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న కన్నా లక్ష్మినారాయణ గుంటూరు పశ్చిమం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో అదే స్దానంలో భారతీయ జనతా పార్టీ నుంచి తులసి రామ చంద్ర ప్రభు బరిలోకి దింపుతారని పార్టీలో చర్చ నడుస్తోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
యమహా R2 నుంచి ఎలక్ట్రిక్‌ ఏరోక్స్‌ వరకు - 2026లో లాంచ్‌ కానున్న యమహా బైక్స్‌, స్కూటర్లు ఇవే
2026లో య'మహా' ప్లాన్‌ - రెండు ఎలక్ట్రిక్‌ స్కూటర్లు, కొత్త R2 స్పోర్ట్‌ బైక్‌ రెడీ
Telangana Cabinet Decisions: మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
Revanth Reddy: హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక వర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
Champion OTT : ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Embed widget