అన్వేషించండి

Jagan vs BJP: నిన్నటి వరకు జగన్ వర్సెస్ టీడీపీ- నేడు జగన్ వర్సెస్ బీజేపీ- లడ్డూ వివాదంలో మరో మలుపు

Tirumala Laddu: ఏపీ బీజేపీ సోషల్ మీడియా జగన్‌ని టార్గెట్ చేసింది. జగన్ వీడియోలతో మీమ్స్ మొదలు పెట్టారు. ఇప్పటి వరకూ జగన్ ని టీడీపీ టార్గెట్ చేయగా, ఇప్పుడు బీజేపీ కూడా జతకలిసింది.

Tirumala Tirupati Laddu Issue: నిన్న మొన్నటి వరకు జగన్, టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలేవి. సోషల్ మీడియాలో కూడా వైసీపీ, టీడీపీ మధ్యే గొడవలు జరిగేవి. ట్రోలింగ్ కానీ, కౌంటర్లు కానీ ఎక్కువగా వైసీపీ, టీడీపీ అధికారిక సోషల్ మీడియా అకౌంట్ల మధ్యే ఉండేవి. రెడ్ బుక్ గొడవ కూడా ఈ రెండు పార్టీల మధ్యే. జగన్ ట్వీట్ వేస్తే వెంటనే టీడీపీ నుంచి కౌంటర్ పడేది, ఆ ట్వీట్ కి మళ్లీ వైసీపీ రియాక్ట్ అయ్యేది. ఇలా ఈ ఎపిసోడ్ లు ఇటీవల కాలంలో చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు బీజేపీ కూడా జగన్ ని టార్గెట్ చేసింది. బీజేపీ నేతలకు సగం తెలుసు, సగం తెలియదు అంటూ జగన్ చేసిన కామెంట్లు ఆ పార్టీ నేతలకు మంటపెట్టాయి. దీంతో ఏపీ బీజేపీ సోషల్ మీడియా యాక్టివ్ అయింది. జగన్ పై ట్రోలింగ్ మొదలు పెట్టింది. ఇప్పటి వరకు టీడీపీ సోషల్ మీడియా హ్యాండిళ్లు ఇలాంటి కామెంట్లు పెట్టేవి. ఇప్పుడు బీజేపీ కూడా జగన్ పై సెటైర్లు స్టార్ట్ చేసింది. 

అసలు జగన్ ఏమన్నారు..?
"మన ఖర్మ ఏంటంటే.. బీజేపీ వాళ్లకి సగం తెలుసు, సగం తెలియదు. టీటీడీ బోర్డులో బీజేపీలోని సీనియర్లు కూడా సభ్యులుగా పనిచేశారు. ఈ ప్రొసీజర్లన్నీ వారికి తెలియనివి కావు. తెలియకపోతే తెలుసుకోమనండి. బీజేపీ నిజంగానే హిందువులకు నిజాయతీగా ప్రాతినిధ్యం వహించే పార్టీ అయితే.. ఇంత దుర్మార్గంగా ప్రచారం చేయడం ధర్మమేనా అని చంద్రబాబుకు అక్షింతలు వేయాలి. ఆ ధైర్యం బీజేపీకి ఉందా..?" అని జగన్ ప్రశ్నించారు. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై స్పందించిన ఆయన పరోక్షంగా బీజేపీని కూడా టార్గెట్ చేశారు. చంద్రబాబు కల్తీ నెయ్యి గురించి ప్రస్తావిస్తే.. దాన్ని ఖండించాల్సింది పోయి సమర్థిస్తూ వైసీపీని టార్గెట్ చేయడం సరికాదన్నారు జగన్. 

జగన్ కోపానికి కూడా కారణం ఉంది. గతంలో బీజేపీ నేతలెవరూ నేరుగా జగన్ ని కామెంట్ చేయలేదు. ఏపీలో కూడా ఫైట్ టీడీపీ వర్సెస్ వైసీపీగానే సాగింది. తొలిసారిగా బీజేపీ నుంచి జగన్ పై పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి. కర్నాటకకు చెందిన బీజేపీ నేత, కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే జగన్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. టీటీడీ బోర్డు చైర్మన్ గా, సభ్యులుగా హిందువులు కానీ వారిని నియమించారని ఆమె అన్నారు. టీటీడీకి చెందిన విద్యాసంస్థల్లో వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవార్ల ఫోటోలు తొలగించేందుకు అప్పటి వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించిందని కూడా ఆమె ఆరోపించారు. లడ్డూల తయారీకోసం కల్తీ నెయ్యి ఉపయోగించారనే ఆరోపణలపై ఉన్నతస్థాయి దర్యాప్తు చేయాలని అన్నారు కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి. బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు కూడా ఈ వ్యవహారంలో ఘాటుగా స్పందించడంతో జగన్ తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పార్టీని టార్గెట్ చేయాల్సి వచ్చింది. నిజానిజాలు తెలుసుకుని చంద్రబాబుపై అక్షింతలు వేసే ధైర్యం బీజేపీ నేతలకు ఉందా అని ప్రశ్నించారు జగన్. 

Also Read: లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం హిందూ ధర్మంపై కుట్ర - కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబుకు బండి సంజయ్ లేఖ

దీంతో ఏపీ బీజేపీ నేరుగా జగన్ ని టార్గెట్ చేసింది. ప్రెస్ మీట్ లో జగన్ కొన్ని పదాలు పలకడానికి ఇబ్బంది పడిన విషయాన్ని బీజేపీ హైలైట్ చేస్తూ ట్రోలింగ్ మొదలుపెట్టింది. ఏంటో మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్ధం కావు! అంటూ ట్వీట్ వేసింది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. హిందువులపై జగన్ కి ఎందుకంత పగ అంటూ ఆమె వీడియో విడుదల చేశారు. మొత్తమ్మీద టీడీపీతోపాటు బీజేపీ కూడా ఇప్పుడు జగన్ ని పూర్తి స్థాయిలో టార్గెట్ చేసినట్టయింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mid Day Meals Scheme: గరికపాటి వ్యాఖ్యలు బాధాకరం, మధ్యాహ్న భోజనం పేద పిల్లల హక్కు: ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్
గరికపాటి వ్యాఖ్యలు బాధాకరం, మధ్యాహ్న భోజనం పేద పిల్లల హక్కు: ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్
AP Rains Alert: ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
Andhra Praedesh News: ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
Devansh Birthday:శ్రీవారి సన్నిధిలో చంద్రబాబు ఫ్యామిలీ! దేవాన్ష్ పుట్టిన రోజున తిరుమలలో అన్నదాన కార్యక్రమం! స్వయంగా వడ్డించిన సీఎం!
శ్రీవారి సన్నిధిలో చంద్రబాబు ఫ్యామిలీ! దేవాన్ష్ పుట్టిన రోజున తిరుమలలో అన్నదాన కార్యక్రమం! స్వయంగా వడ్డించిన సీఎం!

వీడియోలు

Late Marriage Effect on Women | 40ఏళ్లు దాటినా పెళ్లంటే ఇష్టపడని మహిళలు, ఆరోగ్యంపై ఊహించని ప్రభావం
Harshit Rana Ruled Out IPL 2026 | హర్షిత్ దూరం, పతిరణ రాక ఆలస్యం. కష్టాల్లో కేకేఆర్ | ABP Desam
Laxman Sivaramakrishnan Commentary BCCI | కామెంటరీకి శివరామకృష్ణన్ గుడ్ బై | ABP Desam
SRH Players Injury IPL 2026 Jack Edwards | గాయంతో సన్‌రైజర్స్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం | ABP Desam
MS Dhoni Injured in CSK Practice Camp IPL 2026 | ధోనీ మోకాలి గాయం ? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains Alert: ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
Andhra Praedesh News: ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
Harish Rao: శ్రమ మాది.. శిలాఫలకం రేవంత్ రెడ్డిది - సిద్దిపేట పర్యటనపై హరీశ్ రావు బహిరంగలేఖ
శ్రమ మాది.. శిలాఫలకం రేవంత్ రెడ్డిది - సిద్దిపేట పర్యటనపై హరీశ్ రావు బహిరంగలేఖ
Fire Cracker Lorry Catches Fire: హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
Anand Mahindra: గంటన్నర ముచ్చట్లే మహింద్రా గ్రూపును నిడిపే లీడర్లను తయారు చేస్తాయి - ఆనంద్ మహింద్రా విజయరహస్యం ఇదే!
గంటన్నర ముచ్చట్లే మహింద్రా గ్రూపును నిడిపే లీడర్లను తయారు చేస్తాయి - ఆనంద్ మహింద్రా విజయరహస్యం ఇదే!
Chandrababu Tirumala: సాంకేతికతతో ఆధ్యాత్మిక వైభవం - తిరుమలలో సీఎం చంద్రబాబు సరికొత్త మార్పులు
సాంకేతికతతో ఆధ్యాత్మిక వైభవం - తిరుమలలో సీఎం చంద్రబాబు సరికొత్త మార్పులు
Karimnagar SI Chandrasekhar Suicide : కరీంనగర్‌ టూటౌన్‌ ఎస్సై చంద్రశేఖర్‌ సూసైడ్‌- ఐదు రోజుల క్రితమే భార్య ఆత్మహత్య 
కరీంనగర్‌ టూటౌన్‌ ఎస్సై చంద్రశేఖర్‌ సూసైడ్‌- ఐదు రోజుల క్రితమే భార్య ఆత్మహత్య 
Trump Iran War:ఇరాన్ యుద్ధం ముగింపు దిశగా అడుగులు! అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన!
ఇరాన్ యుద్ధం ముగింపు దిశగా అడుగులు! అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన!
Embed widget